English | Telugu

'కింగ్‌డమ్‌' విషయంలో శ్రీలీల జడ్జిమెంట్ నిజమైందా..?

ఒక్కోసారి ఒకరు నటించాల్సిన సినిమా మరొకరికి వెళ్తుంటుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అయినా, లేదంటే ఆ పాత్రకి పేరొచ్చినా.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తాయి. పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. ఆ సినిమాని వదులుకొని మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. తాజాగా శ్రీలీల విషయంలో అదే జరుగుతోంది. (Kingdom)

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'కింగ్‌డమ్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గురువారం(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించాల్సి ఉంది. 2023లో ప్రకటించిన ఈ సినిమా ఆలస్యమవుతుందనో లేదా శ్రీలీల వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్లనో.. కారణమేంటో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ లోకి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వచ్చింది. అయితే 'కింగ్‌డమ్‌' విడుదలయ్యాక.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నేడు థియేటర్లలో అడుగుపెట్టిన 'కింగ్‌డమ్‌' నెగటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే.. అసలు ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదో కొన్ని సీన్స్ లో అలా వచ్చి వెళ్తుంది అంతే. నిజం చెప్పాలంటే అసలు ఆ పాత్ర లేకపోయినా.. కథకి వచ్చే నష్టమేమీ లేదు. ఇది చాలదు అన్నట్టు.. ఇందులో మూడో సాంగ్స్ ఉంటే, వాటిలో 'హృదయం లోపల' సాంగ్ లో హీరోయిన్ కనిపిస్తుంది. కానీ ఆ సాంగ్ ని కూడా.. సినిమా లోనుంచి తీసేశారు. దీంతో 'కింగ్‌డమ్‌'లో హీరోయిన్ పాత్ర ఏదో మొక్కుబడి అన్నట్టుగా ఉంది.

ఇటీవల శ్రీలీల వరుస పరాజయాలను చూసింది. ఇలాంటి సమయంలో 'కింగ్‌డమ్‌'లో భాగమై ఉంటే.. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్ర చేసిందనే విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ఆ విమర్శల నుంచి శ్రీలీల తెలివిగా తప్పించుకుందనే చెప్పవచ్చు.

కాగా, శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులో 'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో 'ఆషికీ-3', తమిళ్ లో 'పరాశక్తి' చిత్రాల్లో నటిస్తోంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.