English | Telugu

ఫిష్ వెంకట్ కి అండగా ప్రభాస్.. ఏకంగా 50 లక్షలు!

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలుస్తోంది. తమను ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు కూడా కోరారు. ఈ విషయం ప్రభాస్ కి చేరడంతో.. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని తాను ఇస్తానని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.

ప్రభాస్ టీం తాజాగా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను సంప్రదించిందట. ఆపరేషన్ కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని, కిడ్నీ దాతను చూసుకోవాలని ప్రభాస్ టీం చెప్పిందట. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. అంతేకాదు, ఆపరేషన్ కోసం రూ.50 లక్షలు దాకా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.