English | Telugu

మాధవీతో జతకట్టిన గజల్

డా. గజల్ శ్రీనివాస్, మాధవీలత(నచ్చావులే ఫేం) హీరో హీరోయిన్లుగా శ్రీ కృష్ణవాసా దర్శకత్వంలో జూలై 3న కొత్త చిత్రం పూజాకార్యక్రమాలు నటీనటుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని లతాశ్రీ మూవీస్ నూతన నిర్మాణ సంస్థ M.P. రవిరాజారెడ్డి నిర్మిస్తుండగా, కృష్ణవాసా స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రకథ "ప్రత్యేకమైన కథాంశమని" ఇందులో ఎంతో మంచి పెర్ఫార్మెన్స్ కి అవకాశమున్న కథానాయకుడి పాత్రను చేస్తున్నట్లు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. A Film by Aravind తరువాత ఎంతో జాగ్రత్తగా పాత్రను ఎంచుకొని చేస్తున్న చిత్రమని అయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు డా. డిసౌజా, సాయిశర్మ, శ్రీనివాసరెడ్డి, విష్ణుకిశోర్, భానుశ్రీలు నటించనున్నట్లు, ప్రఖ్యాత నటి శ్రీమతి జయలలిత ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి వెంకటహనుమ ఛాయాగ్రహణం నిర్వహిస్తారని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 21 నుండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, మేడపాడు, చించినాడ ప్రాంతాలలో జరుగుతుందని తెలిపారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.