English | Telugu
కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి లడ్డూలు ఉచితం
Updated : Mar 21, 2020
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన లడ్డూలు పాడవకుండా ఉండటం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 10 లడ్డూలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షల లడ్డూలను, ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన.. తిరుపతిలోని ఉద్యోగుల విశ్రాంతి సముదాయం వద్ద ఉద్యోగులకు లడ్డులను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.