English | Telugu

ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు

కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
కొవిడ్ 19 నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తాం. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తాం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి హెచ్చ‌రించారు. డ్రగ్స్ డిజి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు చేశారని ఆయ‌న చెప్పారు.

కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు
153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉంది.
27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలింది.
ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలని, కరోనా వైరస్(కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి
వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరు సంప్ర‌దించ‌వ‌చ్చు.