English | Telugu
ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి తెలుగురాష్ట్రాలు వణుకుతున్నాయి!
Updated : Mar 22, 2020
* ఫిబ్రవరి 21న జెద్దా నుంచి మక్కాకు, అక్కడినుంచి మదీనాకు విమానాల్లో వెళ్లారు.
* మళ్లీ మక్కా వచ్చి మార్చి 9న హైదరాబాద్కు వచ్చారు.
* 10న విమానాశ్రయం నుంచి మెహిదీపట్నంలోని కుమార్తె ఇంటికెళ్లారు. 11న విశాఖ-కాచిగూడ ఎక్స్ప్రెస్ బీ1 బోగీలో బయల్దేరి విశాఖకు 12న వచ్చారు. అల్లీపురంలోని ఆయన ఇంట్లో పలువురు వచ్చి కలిశారు.
* 13న శుక్రవారం ఓ మసీదులో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
* 14న జ్వరంతో మంచం మీదనుంచి లేవలేకపోయారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఓ ల్యాబ్కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
* 17న మర్రిపాలెంలో వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఆయన కరోనా లక్షణాలు గమనించి ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రికి పంపారు. క్లినిక్లో ఈ వృద్ధుడు ముగ్గురు వైద్యసిబ్బందిని నేరుగా కలిశారు. తర్వాత నమూనాలు పంపిన రెండు రోజులకు వ్యాధి ఖరారైంది.
* ఆయన కుటుంబంలో 58 ఏళ్ల భార్య, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్యకూ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు.
* గోపాలపట్నంలో ఉంటున్న తల్లి, ఇద్దరు సోదరులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసి వారినీ పరీక్షలకు తరలించారు.
* మర్రిపాలెంలో ఆయన్ను పరీక్షించిన వైద్యుడు హోమ్ క్వారంటైన్లో ఉంటానని తెలిపారు.
ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి కరోనా ఎంత మందికి సోకిందోనని ఏపీ, తెలంగాణా అధికారులు భయపడుతున్నారు. ఇప్పట్టికైనా కరోనాను కట్టడి చేయడానికి మన కోసం...మనం బ్రతికే సమాజం కోసం అప్రమత్తంగా వుందాం.