English | Telugu

23 రాత్రి నుంచి ‘హరి హర వీరమల్లు’షోలు : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

23 రాత్రి నుంచి ‘హరి హర వీరమల్లు’షోలు : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

Publish Date:Jul 19, 2025

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అలాగే తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది? 17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.  హరి హర వీరమల్లు ప్రయాణం గురించి చెప్పండి? నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందే అనుకున్నారా? మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా? జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి? ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల  అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా? ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఆలస్యమైంది కదా.. పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము. మీ కుమారుడు జ్యోతికృష్ణ గారి గురించి? మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు.
Are big films unable to control leaks and piracy?

Are big films unable to control leaks and piracy?

Publish Date:Jul 19, 2025

Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Upendra, Aamir Khan has faced leaks while shooting in Vizag port area with Nagarjuna. Also, there have been leaks from Pawan Kalyan's OG sets. Now, Megastar Chiranjeevi's Mega157 is facing leaks with Chiranjeevi and Nayanthara images leaking from sets.  Earlier, there have been leaks from Shah Rukh Khan's Jawan sets and several big films as well. Even Rajamouli has not been exempt for these leaks. Hence, Baahubali team in 2013 have decided to not allow phones on sets. Even they did same for RRR but SSMB29 shoot scenes have been leaked from Orissa schedule.   Lokesh Kanagaraj had to write a note requesting fans to not share the leaked clips while Nag's Simon character traits have created huge buzz and excitement for the film. Mega157 team have also released a statement asking fans to not share such images anymore.    Well, big films and big stars does create huge amount of anticipation all over and excitement. But sharing the film scenes from shoot without clear cut permissions lead to unnecessary spoilers spreading all over. This could dilute the excitement for the film or create huge expectations prior release.  Also, piracy has been huge issue from two decades with the dawn of new technology. The makers are trying to find creative ways to reduce the effects of piracy and they have been trying to disperse their films to OTT platforms at the earliest for good amount. Now, leaks have become a new issue for producers to tackle.  The excitement of fans and audiences to watch stars in action is understandable but recording them and releasing on social media. These sort of leaks are harmful for sustaining the theatrical excitement of audiences while some can work in positive way. In any case, it is harmful to encourage such leaks and catching matinee idols on big screens is advisable.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

DNA Movie Review

Publish Date:Jul 19, 2025

Saiyaara Movie Review

Publish Date:Jul 18, 2025

తండ్రి చెప్పినట్టే సౌందర్య కెరీర్‌ సాగింది.. ఆమె జీవితం కూడా అలాగే ముగిసింది!

Publish Date:Jul 17, 2025

(జూలై 18 నటి సౌందర్య జయంతి సందర్భంగా..) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాతి తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య. 1990వ దశకంలో టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌పైనే ఆధారపడేవారు. ఆ విధంగానే సినిమాలు చేస్తుండేవారు. కానీ, దానికి భిన్నంగా తాను ఎక్స్‌పోజింగ్‌ చేయబోనని తన దర్శకనిర్మాతలకు చెప్పి ఆ మాట మీదే నిలబడ్డారు సౌందర్య. మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య. 1992లో ప్రారంభమైన సౌందర్య కెరీర్‌ 2004తో ముగిసింది. 31 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబళించింది. ఎంతో వైవిధ్యంగా సాగి, విషాదంగా ముగిసిన సౌందర్య సినీ, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగళ్‌లో కె.ఎస్‌.సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ. అయినప్పటికీ తెలుగు, తమిళ్‌ అనర్గళంగా మాట్లాడేవారు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్‌కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారు. అప్పుడు ఎంబిబిఎస్‌ చదువుతున్న సౌందర్య ఆ సినిమా చేయడానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత వరస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో హరీష్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా 1993లో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఆమె నటించిన 11 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 9 తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు చిత్రం 1992లోనే ప్రారంభమైంది. అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాక సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చింది. దాంతో సంవత్సరానికి 10కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయారు సౌందర్య. తన 12 సంవత్సరాల సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్‌ అయిన చివరి సినిమా శ్వేతనాగు. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. తమిళ్‌, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్‌ అయింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌,  జగపతిబాబు, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ వంటి స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ చేశారు. అలాగే తమిళ్‌లో రజినీకాంత్‌తో పడయప్పా, అరుణాచలం వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించారు. అలాగే హరీష్‌, వినీత్‌ వంటి యంగ్‌ హీరోలతో కూడా సౌందర్య మంచి సినిమాలు చేశారు. తన కెరీర్‌లో 100కిపైగా సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలోనూ అశ్లీలమైన పాత్రలు పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్లామర్‌ పాత్రలు చేయకపోయినా ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. ఒకప్పుడు సావిత్రి తరహాలో ఆమెను అందరూ ఆదరించేవారు. తెలుగులో సౌందర్యకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, అమ్మోరు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాముడొచ్చాడు, పెదరాయుడు, ప్రియరాగాలు, రాజా, తారకరాముడు, అంత:పురం, చూడాలని వుంది. 1995లో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ మరణించడంతో సౌందర్య మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. ఎన్నో కథలు విని చివరికి గిరీష్‌ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే చిత్రాన్ని కన్నడలో నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి. వాటితోపాటు కర్ణాటక స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు కూడా ద్వీప చిత్రం గెలుచుకుంది.  సౌందర్య వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును 2003 ఏప్రిల్‌ 27న వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. సౌందర్యకు చిన్నతనం నుంచి ప్రజాసేవ చెయ్యాలని, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక బలంగా ఉండేది. అంతేకాదు, ఆమెకు హిందూత్వ భావాలు కూడా ఎక్కువ. అందుకే తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కళ్లాపి చల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు. దాన్ని బట్టి హిందూ సాంప్రదాయంపై ఆమెకు ఎంత గౌరవం ఉండేదో అర్థమవుతుంది. ఆ తర్వాత అమర సౌందర్య సోషల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలోని ముళబాగల్‌ తాలూకాలోని తమ గ్రామం గంగికుంటను అభివృద్ధి చేసారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమరనాథ్‌, అతని భార్య ఎంతో సహకరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు. సౌందర్య కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ఆర్థిక సహాయం చేస్తూనే ఉంది. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరి అని భావించిన సౌందర్య.. 2004 జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అందులో భాగంగానే కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగరరావు తరఫున ప్రచారం చేసేందుకు 2004 ఏప్రిల్‌ 17 ఉదయం 11 గంటలకు బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి చార్టెర్డ్‌ విమానంలో బయల్దేరారు సౌందర్య. ఆమెతోపాటు సోదరుడు అమరనాథ్‌ కూడా ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో ఉన్నవారంతా సజీవ దహనమైపోయారు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో సౌందర్య ఐదు నెలల గర్భవతి. ఒక అద్భుతమైన నటి జీవితం 31 సంవత్సరాల అతి చిన్న వయసులో విషాదాంతం కావడం అందర్నీ కలచివేసింది. సౌందర్య నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారట. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళపాటు అగ్రనటిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు, ఆమె కెరీర్‌ 2004లో ఎండ్‌ అవుతుందని కూడా ఆయన చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన చెప్పినట్టుగానే సౌందర్య కెరీర్‌ ముగిసింది. అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరం.

షారుఖ్ కి గాయాలు!.. అమెరికాలో ట్రీట్ మెంట్!

Publish Date:Jul 19, 2025

పఠాన్, జవాన్, డంకీ వంటి వరుస హిట్స్ తో తనని 'బాలీవుడ్ బాద్షా' అని ఎందుకు అంటారో షారుఖ్ మరోసారి చాటి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పఠాన్, జవాన్ అయితే కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాయి. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో సుమారు మూడు సంవత్సరాలు తర్వాత షారుఖ్ 'కింగ్'(King)అనే మూవీ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా షారుక్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని, ఒక సన్నివేశంలో షారుఖ్ డూప్ లేకుండా క్లిష్ట తరమైన స్టంట్ చెయ్యడంతో   గాయాలు పాలయినట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తుంది. కొన్ని ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ లో  అయితే, అత్యవసర చికిత్స కోసం షారుక్ ని అమెరికా తీసుకెళ్లినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో కింగ్ షూటింగ్ సెప్టెంబర్ కి వాయిదా పడే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అయితే షారుక్ కి తగిలిన గాయాల విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కండరాలు పట్టాయని సన్నిహిత వర్గాల వారు చెప్తున్నట్ట్టుగా టాక్.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కింగ్' ని 'సిద్దార్ధ్ ఆనంద్' తెరకెక్కిస్తున్నాడు. షారుఖ్ ని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసిన పఠాన్ కి కూడా సిద్దార్ధ్ ఆనంద్(Siddharth Anand) దర్శకుడు కావడంతో, కింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షారుఖ్ సరసన రాణి ముఖర్జీ జత కడుతుండగా, షారుక్ కుమార్తె సుహానా(Suhana Khan)సిల్వర్ స్క్రీన్ పై కూడా షారుక్ కి  కూతురుగా ఈ చిత్రంలో చేస్తుంది. దీంతో ఈ చిత్ర కథ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  దీపికా పదుకునే(Deepika Padukune),అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)కూడా కింగ్ లో   కథకి ప్రాధాన్యత గల పాత్రలని పోషిస్తున్నారనే టాక్ కూడా ఉంది.  

పులిహోర కలపడం బాగా వచ్చుగా

Publish Date:Jul 19, 2025

సీనియర్ హీరోలు హీరోయిన్లు ఈమధ్య బుల్లితెర షోస్ కి బాగా వస్తున్నారు. రీసెంట్ గా జీ తెలుగులో ఆదివారం ప్రసారం కాబోతున్న బ్లాక్ బస్టర్ బోనాలు షోకి హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా వచ్చారు. ఆ ప్రోమో చూస్తే శ్రీకాంత్ రోజా మీద పంచ్ లు వేస్తూనే ఉన్నాడు. "నా రాజా నువ్వే" అనే సాంగ్ కి రోజా వేసిన డాన్స్ కానీ కన్నుకొట్టి మరీ లవ్ సింబల్ చూపించడం మాములుగా లేదు. "బ్లాక్ బస్టర్ బోనాలు జరుపుకోవాలంటే రోజా గారి టీమే జరుపుకోవాలి" అని హోస్ట్ రవి అనేసరికి "రోజా ఎంటర్ ఐతే వార్ వన్ సైడ్ అవుతుంది" అని చెప్పింది రోజా. తర్వాత హీరో శ్రీకాంత్ మంచి యంగ్ లుక్ లో "సౌందర్య లహరి" సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. "ఏంటి రోజా గారు వస్తే వార్ వన్ సైడా...ఇప్పుడు నేను ఆఫ్టర్ నూన్ సీరియల్స్ కి సపోర్ట్ చేస్తున్న. నిజంగా వార్ వన్ సైడే..అది నా సైడ్ " అంటూ వాళ్ళ టీమ్ వైపు చూపించాడు. "చిన్నపిల్లలం మేమందరం..సరదాగా బోనాలు పండగ చేసుకోవడానికి వచ్చాము" అని రోజా చెప్పేసరికి. "నువ్వు తలకు రంగు వెయ్యి మాకు వెయ్యకు" అంటూ శ్రీకాంత్ రోజాకి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఒక మ్యూజిక్ పెట్టి ఆ సాంగ్ చెప్పాలంటే రోజా గారిని కానీ శ్రీకాంత్ గారిని కానీ పట్టుకోవాలని చెప్పాడు హోస్ట్ రవి. తర్వాత ఒక సీరియల్ యాక్టర్ వచ్చి రోజాని పట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ "పాట తెలిసి వచ్చారా రోజా గారిని హగ్ చేసుకోవడానికి వచ్చారా" అంటూ మళ్ళీ కౌంటర్ వేసాడు శ్రీకాంత్. "వానొచ్చేస్తుంటే వరదోచేస్తుంది" అనే సాంగ్ కి రోజా, శ్రీఎకాంత్ కలిసి డ్యూయెట్ డాన్స్ చేసారు. ఇక తర్వాత బాలయ్య అఖండ గెటప్ లో ఒక పిల్లాడు వచ్చి "రోజా నేను నీకే సపోర్ట్ చేస్తా అన్నాడు" . వెంటనే రోజా "వచ్చేయండి మన పార్టీకి" అనేసింది. ఇక బోనాలు స్పెషల్ లో త్రిసూలం మీద కోరిక కోరుకుని గాజులు వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే "నువ్వు అనుకో అసెంబ్లీకి వెళ్ళకూడదు అని" అన్నాడు. అంతే రోజా మాత్రం గాజులు వేసింది. దాంతో శ్రీకాంత్ షాకయ్యాడు. ఫైనల్ గా రోజాకి, శ్రీకాంత్ కి కళ్ళకు గంతలు కట్టి పులిహోర కలిపే టాస్క్ ఇచ్చాడు రవి. శ్రీకాంత్ ఐతే చేతికి దొరికిన ఇంగ్రీడియెంట్స్ ని వేసి కలిపేసి కంపు చేసాడు. "నాకు పులిహోరా కలపడం రాదు..రోజాకు పులిహోర కలపడం బాగా వచ్చు" అన్నాడు శ్రీకాంత్.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

చిరంజీవికి షాకిస్తున్న ప్రభాస్.. వార్ తప్పదా..?

Publish Date:Jul 16, 2025

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ సినిమాకి మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారబోతుందని, 2026 సంక్రాంతికి వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. చిరంజీవి, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ చూడనున్నాం.   నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'తో చిరంజీవి, 'రాజా సాబ్'తో ప్రభాస్ బాక్సాఫీస్ వార్ కి దిగాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. 'విశ్వంభర' అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముండగా, 'రాజా సాబ్'ను డిసెంబర్ కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఈ డిసెంబర్ కూడా కాదని.. 2026 జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారట. దీంతో 2025 సంక్రాంతికి మిస్ అయిన చిరంజీవి-ప్రభాస్ బాక్సాఫీస్ వార్.. 2026 సంక్రాంతికి ఉండేలా ఉంది.   2026 సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే చిరంజీవి కర్చీఫ్ వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న తన 157వ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే సీజన్ పై 'రాజాసాబ్' కన్ను పడినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి, మధ్య పొంగల్ పోరు తప్పేలా లేదు.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

జూనియర్

Publish Date:Jul 18, 2025

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

కన్నప్ప

Publish Date:Jun 27, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025

Kannappa

Publish Date:Jun 27, 2025