English | Telugu

కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా బీజేపీ నేత‌లు

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జనతా కర్ఫ్యూ లో భాగంగా కుటుంబంతో ఇంట్లో సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబ‌స‌భ్యులతో స‌ర‌దాగా చెస్ ఆడుకున్నారు. ప్ర‌ధాని పిలుపు మేర‌కు ప్ర‌జ‌లంతా ఐక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిందని ఆయ‌న అన్నారు. ఇలాంటి క‌ర్యాక్ర‌మాన్ని చేప‌ట్టి ప్ర‌పంచానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ప్ర‌ధాని మోదీ నిలిచార‌ని సంజ‌య్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణా ఈ వైర‌స్ ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో సి.ఎం. ఇచ్చిన పిలుపు మేర‌కు 24 గంట‌లు పాటించ‌డం సంతోష‌క‌రమ‌ని ఆయ‌న అన్నారు.

మాజీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌. మేమంతా ఇంటికే ప‌రిమితం అయ్యాం. మీరు కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌లు బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఐక్య‌త ప్ర‌ద‌ర్శించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న‌నిర్ణ‌యానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ చెప్పారు.