English | Telugu

ఓటమి భయంతో ఎన్నికలు వాయిదా వేసిందా?


అధికార వైసీపీ పార్టీ తమకు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాజధాని ప్రాంతంలోని మునిసిపాలిటీలకు ఎన్నికలను వాయిదా వేశాలా చేసింది. రాష్ట్రంలో మొత్తం 29 పుపాలక సంఘాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ మున్సిపాలిటీలలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 7 పుపాలక సంఘాలు ఉండటం విశేషం. వాయిదా పడిన మున్సిపాలిటీలలో అమరావతి రైతుల ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతాలు కూడా ఉండటం ఇక్కడ చర్చనీయాంశం. ఇది కాకతాళియంగా జరిగిందో..లేక వైసీపీకి కలిసి వచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలాచేశారో తెలియదు కానీ వీటన్నింటిపైనా కోర్టు కేసులు ఉన్నాయి.

తమ గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేయడంపై కొన్ని గ్రామాల వారు కోర్టులకు వెళ్లడం వల్లనే ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగడం లేదని అధికార పార్టీ చెప్తుండగా..ఓటమి భయంతోనే వాయిదా పడేలా చేశారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ మునిసిపాలిటీల వివరాలు జిల్లాల వారిగా ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం: ఆముదాలవలస, రాజాం, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు, కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు: బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల,దాచేపల్లి, ప్రకాశం: కందుకూరు,దర్శి, నెల్లూరు: గూడూరు,కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు: శ్రీకాళహస్తి, కుప్పం, కడప జిల్లా: రాజంపేట, కమలాపురం, కర్నూలు: బేతంచర్ల. అదే విధంగా కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అవి: శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం.