English | Telugu
ఏపీలో కలిసొస్తున్న పరిస్ధితులు..మళ్లీ జోష్లో టీడీపీ....
Updated : Mar 20, 2020
ఔనన్నా కాదన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది..కానీ సాధారణ ఎన్నికలు జరిగిన రెండు నెలల నుంచే ఏపీలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి.....టిడిపి అయితే వైసీపీ పైౌ తీవ్ర స్థాయిలో దాడి మొదలు పెట్టింది....దీంతో వైౌసీపీకి కొంత ఇబ్బంది ఎదురయ్యింది..సాధారణంగా ఎన్నికలు జరిగిన ఆరు నెలల వరకు ప్రతిపక్షం సైలెంట్ గా ఉంటుంది..కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు....దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు వ్యవహారం మొదట్లో వచ్చిన ఇసుక సమస్య చాలా ఇబ్బండిగా మారాయి....ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి....దీంతో వైసీపీ సహజంగానే జోష్ లో ఉంది.కానీ టీడిపి, మిగిలిన ప్రతిపక్షాలు ఇబ్బంది పడే పరిస్థితి..
అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలు ప్రస్తుతం ఆరు వారాలు వాయదా పడ్డాయి...దీంతో టిడిపి ఊపిరి పీల్చుకుని మెంటల్ గా ఎన్నికలకు రడీ అయ్యే పరిస్థితి వచ్చింది..గెలుపు ఓటమి తర్వాత విషయం.. ముందు పోటీ చేయడానికి అధ్యర్ధులు ప్రిపేర్ అవ్వచ్చే అనే భావన పార్టీలో ఏర్పడింది..దీంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో టిడిపి వర్గాలున్నాయి.....