English | Telugu
వాంతులు, విరేచనాలు, రుచితెలియపోవడం కూడా కరోనా లక్షణాలే!
Updated : Mar 21, 2020
ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందట. రుచి తెలియకపోవటం, వసనను గుర్తించకపోవడం కూడా కరోనా లక్షణాలేనట. 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కరోనా వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది. కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించిందని వైద్యులు సూచిస్తున్నారు.