English | Telugu
టైగర్ సరసన రష్మిక
Updated : Jul 9, 2022
టైగర్ ష్రాఫ్, డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం టైగర్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాడు. సెప్టెంబర్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని కోసం ఇప్పటికే వారు ఒక అనౌన్స్మెంట్ వీడియోను షూట్ చేశారు. అతి త్వరలోనే దాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మూవీలో టైగర్ జోడీగా రష్మికా మందన్న నటించనున్నదనేది లేటేస్ట్ బజ్.
ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త జంట కావాలని డైరెక్టర్ శశాంక్ భావించాడు. టైగర్ జోడీగా రష్మిక అయితే బాగుంటుందని అనుకున్న అతను ఇప్పటికే రష్మికను సంప్రదించగా, క్యారెక్టర్ నచ్చి, చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇండియాతో పాటు కొన్ని విదేశీ లొకేషన్లలోనూ జరగనుంది.
ఈ మూవీలో సాహసాలు చేసే క్యారెక్టర్లో స్పోర్టీ లుక్లో టైగర్ కనిపిస్తాడట. మరోవైపు సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప 2'లో నాయిక అయిన రష్మిక.. ఆ మూవీతో పాటు సమాంతరంగా టైగర్-శశాంక్ ఫిల్మ్లోనూ నటిస్తుంది. బాలీవుడ్లో ఇది రష్మిక నటించే 4వ సినిమా. ఇప్పటికే ఆమె 'మిషన్ మజ్ను', 'గుడ్బై' సినిమాలను పూర్తిచేసి, రణబీర్ కపూర్తో సందీప్ వంగా రూపొందిస్తోన్న 'యానిమల్'లో నటిస్తోంది.