డైరెక్టర్ గా విజయనిర్మల మొదటి సినిమా.. వద్దన్న ఆరుద్ర, భయపడిన యద్దనపూడి!
నేడు విజయనిర్మల జయంతి. ఈ సందర్భంగా ఆమె 'మీనా'తో తెలుగులో ఎలా డైరెక్టర్గా మారారో చెప్పుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం. విజయనిర్మల నటించిన మూడో చిత్రం 'సాక్షి'. దానికి దర్శకులు బాపు. డైరెక్షన్లో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన స్టోరీ బోర్డ్ విధానం అవీ చూసినప్పుడు ఓ చిత్రానికి ఎలాగైనా దర్శకత్వం చెయ్యాలనే కోరిక కలిగింది విజయనిర్మలకు. అయితే తొందరపడకుండా మెళకువలన్నింటినీ పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ విధంగా పదేళ్లు సినిమాల్లో నటిస్తూనే, దూరంగా ఉండి దర్శకత్వం గురించి స్టడీ చేశారు.