LATEST NEWS
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్  దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.   అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ,  చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది.  దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.   మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు.  జగన్ హయాంలో అంటే  2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు. అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో  ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు.  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.  
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పవన్ కల్యాణ్ ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. ఆయన బీజేపీ తరఫున తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారైన సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఆయన ప్రచార కార్యక్రమం రద్దైనట్లు జనసేన ప్రకటించింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తరువాత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు. అయితే అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రంగంలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం వల్ల జనసేన అభ్యర్థుల పరిస్థితి గందరగోళంలో పడుతుందన్న చర్చ జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పురపోరులో పవన్ ప్రచారం చేయరని జనసేన క్లారిటీ ఇచ్చింది. ఇలా ఉండగా తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో మొత్తం 363 వార్డులలో జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరంతా కూడా గాజుగ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రల పేర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.  గొల్లపూడిలో  విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన   జాతీయ రహదారిపై వైసీపీ పరామర్శల కారణంగా ట్రాఫిక్  స్తంభించిపోయి సామాన్య జనం నరకయాతన అనుభవించారన్నారు. పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే  రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు. తన నిర్వాకం వల్ల సొంత పార్టీ కార్యకర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, జగన్ కనీసం వారికి సంతాపం కూడా ప్రకటించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికీ, అహంకారానికీ నిదర్శనమని దేవినేని ఉమ విమర్శించారు.  అసలింతకీ ఆయన పరామర్శలకు వస్తున్నారా?  ప్రాణాలు బలితీసుకోవడానికి వస్తున్నారా అని నిలదీశారు.  గతంలో పల్నాడు పర్యటనలో జగన్  కారు కిందపడి సింగయ్య అనే కార్యకర్త మృతిచెందిన ఘటనను దేవినేని ఉమ ఈ సందర్భంగా గుర్తు చేశారు.   కళ్ల ముందే ఇలాంటి సంఘటనలు జరిగినా జగన్ ఇసుమంతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కానీ, సంతాపం ప్రకటించడం కానీ చేయకపోవడాన్ని దుర్మార్గానికి పరాకాష్టగా ఉమ అభివర్ణించారు.  
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. తిరుమల వెంకన్న దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో అదీ.. మరో  మాజీ మంత్రి జోగి రమేష్ ఎదురుగా అన్నట్లు చెబుతున్నారు. ఔను తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆమె అన్న మాటలకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారింది.  వాస్తవానికి రోజా మంత్రిగా ఉన్న సమ యంలో రోజుకు వందలు వేలుగా టీటీడీ దర్శనం టోకెన్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ కమేడియన్ కిరాక్ ఆర్పీ పలు మార్లు ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు.. టీటీడీ చైర్మర్ బీఆర్ నాయుడు కూడా ఆ చిట్టా అంతా తమ దగ్గర ఉందనీ, ఇదో పెద్ద కుంభకోణమనీ చెప్పడమే కాకుండా త్వరలోనే అన్ని విషయాలూ బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం.. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయంటున్నారు. రోజా మాటలు వాస్తవమే అయితే ఆమె వేంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేసినట్లు అంగీకరించేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.   అయితే విచిత్రమేంటంటే.. అంత భ‌య ప‌డుతూ కూడా ఎందుకిలా చేశారన్నది ఇప్పుడో చర్చగా మారింది. సింథ‌టిక్ నెయ్యితో స్వామివారికి ల‌డ్డూలు చేసి పెట్టిన  పాపం ఊర‌కే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ దర్శనాలను మాత్రం ఆమె మానరు. మధ్యమధ్యలో కాశీ కూడా వెళ్లి వస్తుంటారు. పాపం చేశాను.. పరిహారం చూపండి అనో ఏమో రోజా ఈ దేవుళ్లను క్రమం తప్పకుండా దర్శించుకుని వస్తుంటారు.   అవన్నీ పక్కన పెడితే వైసీపీలో రోజా కు ఏ మంత ప్రాముఖ్యత కనిపించడం లేదు. సోంత నియోజకవర్గం నగరిలో స్థానిక వైసీపీ నేతలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో..వచ్చే ఎన్నికలలో ఆమెకు వైసీపీ టికెట్ దక్కకుండా వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది.  ఇక ఏపీలో లాభం లేదు తమిళనాడు వెళ్లిపోయి.. టీవీకేలో సెటిల్ అవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదంటున్నారు.  మరిప్పుడు గత్యంతరం లేక వైసీపీలో గుర్తింపు కోసం చంద్రబాబును భల్లాల దేవుడు, జగన్ ను బాహుబలి అంటూ సినిమా డైలాగులతో రాజకీయం చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 
  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు. టీం 11 కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయి హత్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రూ.250 కోట్లు దోచేశారని, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచే పార్టీని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం వస్తోందని, విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ స్థిరత్వం అవసరమని, కార్యకర్తలంతా బాధ్యతతో పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
ALSO ON TELUGUONE N E W S
    -ఇనిస్టా పోస్ట్ వైరల్  -అభిమానులు,నెటిజన్స్ సానుభూతి  -పద్మావతి ఎవరు    మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)ఇచ్చిన అవకాశంతో 'కంత్రి' తో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి 'ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్(Meher Ramesh). మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి సోదరుడు వరుసైన మెహర్ రమేష్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీంతో అభిమానులతో పాటు  నెటిజెన్స్ సదరు పోస్ట్ చూసి తమ సానుభూతిని   తెలియచేస్తున్నారు. సదరు పోస్ట్ లో ఏముందో చూద్దాం.   మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీన అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటని భావోద్వేగ వ్యాఖ్యలు చేసాడు.  2023 లో భోళా శంకర్ తర్వాత మళ్ళీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.   Also read:  ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం.. రీజన్ ఇదే    మెహర్ రమేష్ సినీ కెరీర్ విషయానికి  వస్తే కంత్రి కంటే ముందే  ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడ లో పునీత్  రాజ్ కుమార్ తో రీమేక్ చేసి హిట్ అందుకున్న రికార్డు మెహర్ రమేష్ కి ఉంది. తెలుగులో మాత్రం ఎందుకనో హిట్ అనేది మెహర్ రమేష్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తు వస్తుంది. మరి  అప్ కమింగ్ చిత్రాలతో అయినా విజయాల్ని అందుకుంటాడేమో చూడాలి.   
As Thandel completed one year since its theatrical release, lead actor Naga Chaitanya marked the milestone by thanking audiences and the film’s team for making the project memorable. Sharing a message on social media, the actor expressed gratitude to fans for their continued support and acknowledged the collective effort behind the film. Directed by Chandoo Mondeti and starring Naga Chaitanya and Sai Pallavi, Thandel released in theatres on 7 February 2025. The film drew inspiration from a real-life 2018 incident involving fishermen from Srikakulam who inadvertently crossed international waters. Extensive research and interactions with fishing communities shaped the film’s narrative, with several sequences filmed in real coastal locations. For the role, Naga Chaitanya underwent a massive physical and emotional transformation, modifying his appearance and body language to portray the life of a fisherman. The film marked a significant phase in his career. Sai Pallavi played Satya, a character centred on emotional resilience and domestic responsibility. At the box office, Thandel crossed the Rs. 100 crore mark worldwide. Following its theatrical run, the film premiered on Netflix and later recorded strong viewership during its satellite premieres, emerging as one of the most watched Telugu films on television. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
‘అమరన్‌’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ 55వ సినిమా ప్రారంభమైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్ప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.    ఫిబ్రవరి 7న ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరై టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల నటిస్తుండడం విశేషంగా చెప్ప్పుకోవచ్చు. శ్రీలీల ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలిసిందే. సాయిపల్ల విషయానికి వస్తే.. డాన్సులతోపాటు నటనలోనూ తనకు తనే సాటి అనిపించుకున్న హీరోయిన్. మరి వీరిద్దరి ధాటికి ధనుష్ ఎలా తట్టుకుంటాడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.   డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి గురించి చెప్పాలంటే... 2017లో ‘రంగూన్‌’ అనే తమిళ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించడం విశేషం. ఆ తర్వాత 2024లో శివకార్తికేయన్‌తో చేసిన ‘అమరన్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ధనుష్‌తో చేయబోయే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకునే విభిన్నమైన కథాంశంతో ఉంటుందట.    ధనుష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. అమరన్‌లో హీరోయిన్‌గా నటించిన సాయిపల్లవికి రాజ్‌కుమార్‌తో ఇది రెండో సినిమా. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు తమిళ్‌లో రెండో సినిమా. ధనుష్, రాజ్‌కుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం సహజం. ఇప్ప్పుడు సాయిపల్లవి, శ్రీలీల కూడా ఈ సినిమాలో భాగమవుతుండడంతో సినిమాకి ఉన్న హైప్ రెట్టింపు అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. 
  -ముమైత్ ఖాన్ ఏం చెప్తుంది -ఎందుకు తనకి ఆ ప్రాబ్లమ్ -చివరగా ఎప్పుడు కనపడింది   సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),పూరి జగన్నాధ్(Puri Jagannadh)ల పోకిరి లోని 'ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే సాంగ్' కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండకపోవచ్చు. అంతలా సదరు సాంగ్ కి అభిమానులు,ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సదరు కనెక్ట్ అడిక్ట్ గా మారడానికి 'ముమైత్ ఖాన్'(Mumaith Khan)కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా సదరు సాంగ్ లో  డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan)మగధీర లోని 'బంగారు కోడిపెట్ట సాంగ్' లో కూడా సూపర్ గా స్టెప్స్ వేసి తన స్థాయిని పెంచుకొని సోలో హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కానీ గత కొంత కాలం నుంచి సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్న మమైత్ ఖాన్'  అందుకు గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించింది.   ముమైత్ ఖాన్ మాట్లాడుతు పదమూడు సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఒక ప్రమాదం కారణంగా మెదడులోని నరాలకి దెబ్బ త్తగిలింది.దాంతో కనీసం ఏడేళ్ల పాటు కదలకూడదని బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదని వైద్యులు చెప్పారు. దాంతో మంచానికే పరిమితమయ్యాను. మందులు కూడా వాడటంతో లావు అయ్యాను. విరామం తీసుకోవడానికే దేవుడు ఇలా చేసాడని అనుకున్నాను కానీ ఏ మాత్రం బాధపడలేదని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. Also read:  జియో హాట్ స్టార్ ఆఫీస్ కి ఊహించని పార్సిల్స్.. రాజా సాబ్ స్ట్రీమింగ్ నే కారణం 2004 లో నందమూరి హరికృష్ణ, మీనా కాంబోలో వచ్చిన స్వామి మూవీలో క్యామియో రోల్ తో తెలుగు సినీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ పోకిరి తోనే స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ,తమిళ, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్, క్యామియా రోల్స్, ప్రధాన క్యారక్టర్ లు కలుపుకొని సుమారు వంద సినిమాల వరకు చేసింది. తెలుగులో చివరిగా 2019 లో వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ లో కనపడగా మళ్ళీ తన ప్రభావాన్ని చాటుతుందేమో చూడాలి.  
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. హీరోగానే కాదు, డైరెక్టర్‌గా కూడా తనేమిటో ప్రూవ్ చేసుకొని అద్భుతమైన సినిమాలను రూపొందించారు. డైరెక్టర్‌గా అర్జున్‌కి మంచి పేరు తెచ్చిన సినిమా జైహింద్. ఆ తర్వాత కూడా చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. చివరగా తమిళ, కన్నడ భాషల్లో కుమార్తె ఐశ్వర్యతో ఓ సినిమా చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్ప్పుడు తెలుగులో ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతాపయనం’ పేరుతో ఓ విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.    నిరంజన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సినిమా విడుదల కాబోతోంది. 1992లో ‘సేవగన్‌’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన అర్జున్ తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ‘సీతాపయనం’. ఇక ఐశ్వర్యా అర్జున్ విషయానికి వస్తే.. 2013లో విశాల్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పట్టతు యానై’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. 2018లో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘సొల్లివిదవ’, కన్నడ సినిమా ‘ప్రేమ బరహా’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇప్ప్పుడు తండ్రి దర్శకత్వంలోనే రూపొందిన ‘సీతాపయనం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవు తున్నారు. 
Set against the backdrop of a society that shuns and stigmatizes the so-called “dirty” people, Cockroach is a beautiful love story that unfolds in the margins. It narrates the pure friendship between a street-side sex worker and a contract killer—an unlikely bond that questions the moral decay of a corrupt and rotten social system. Cockroach is a hard-hitting film that introduces audiences to the dense darkness of a morally bankrupt society. While people applaud the killing of a cockroach and write poetry about butterflies, the film questions this hypocrisy through its characters. Directed by P. Suneel Kumar Reddy and produced by B. Bapiraju under the banner Sri Lakshmi Pictures, Cockroach has successfully completed its censor formalities. The Central Board of Film Certification has awarded the film an “A” (Adults Only) certificate. The director and producers have respectfully requested, through the press, that sensitive viewers and children refrain from watching the film. The makers have announced that preparations are underway to release the film in theatres in the first week of March. To portray the violent confrontations in the film with authenticity, real fighters were cast as actors. Abhilash Sunkara, Premasan, and Naveen appear as contract killers inspired by real life.  Award winning actress Teertha (for Sontha Ooru) plays a key role. Other important roles are played by Meenakshi, Raman, Bugatha, Anji Gagan, Pradeep, Samudram Venkatesh, Mallika, FM Babai, Raju, Balaji, LB Ramana, RK Singh, Pooja, Potti Murthy, Prasad, Relare Raghu troupe, Johnny, and others. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The first full week of February 2026 has arrived with an explosion of high-stakes entertainment in the digital space. Following a busy January, the momentum continues as major streaming giants like JioHotstar, Netflix, and ZEE5 roll out a diverse palette of content. From supernatural horror-comedies and intense political period dramas to deep-diving documentaries, there is something to satisfy every type of viewer this week.   If you are looking for what to watch between February 2nd and February 9th, here is your definitive guide to the latest OTT releases. The Week's Biggest Premieres: The Raja Saab (JioHotstar): After a much-discussed theatrical run, Prabhas makes a grand entry onto the digital screen with The Raja Saab. Premiering on February 6th, this supernatural horror-comedy directed by Maruthi features the "Rebel Star" in a dual role. Blending royal intrigue with age-old curses, the film follows a hero caught between two worlds. Notably, the OTT version includes an extended cut with unseen footage. It is available for streaming in Telugu, Tamil, Kannada, and Malayalam.   Parasakthi (ZEE5): For those seeking grit and historical weight, Sivakarthikeyan’s period political drama Parasakthi is the week’s standout. Arriving on February 7th, the film is set against the backdrop of the 1960s anti-Hindi agitations in Tamil Nadu. Directed by Sudha Kongara, it tells a powerful story of cultural identity and resistance, following a railway worker who finds himself at the heart of a revolutionary movement.   Kis Kisko Pyaar Karoon 2 (JioHotstar): Kapil Sharma returns to his comedy roots with this spiritual sequel, which premiered on February 6th. Stepping back into the shoes of Mohan Sharma, the plot finds him accidentally married to three women of different faiths while trying to navigate his actual love life. It is a classic comedy of errors that promises to be a favorite for families this weekend. New on Netflix: Netflix continues to dominate the global content stream with a mix of returning favorites and insightful biography. On February 5th, the platform released the fourth season of The Lincoln Lawyer, which sees Mickey Haller defending himself in a high-stakes murder trial. Also new this week is Queen of Chess (Feb 6), a compelling documentary charting the rise of Hungarian Grandmaster Judit Polgár, exploring how she shattered gender barriers in the male-dominated world of professional chess. New on JioHotstar: Beyond its big-ticket movie premieres, JioHotstar is catering to thriller enthusiasts with the arrival of Jazz City (Feb 6). This historical drama is infused with Calcutta’s vibrant jazz culture and set against the political turbulence of the late 1960s. The platform also continues to draw viewers with the Malayalam supernatural thriller Sarvam Maya, which explores a series of mysterious events in a rural mansion. New on Amazon Prime Video & Others: Amazon Prime Video has focused on light-hearted romance and human-centric stories this week. Nari Nari Naduma Murari (Feb 4) stars Sharwanand in a comedic love triangle where a secret past marriage threatens his current engagement. On the international front, the rom-com Relationship Goals, starring Kelly Rowland, also debuted on February 4th. Meanwhile, SonyLIV is keeping audiences engaged with new episodes of its reality mainstays, Shark Tank India and MasterChef India. Regional Highlights: Shabad: Reet Aur Riwaaz (ZEE5): A poignant family drama that arrived on February 6th, starring Suvinder Vicky and Mihir Ahuja. it explores the generational clash between a traditional Ragi singer and his speech-impaired son, who dreams of a career on the football field. Vaa Vaathiyaar (Prime Video): While it arrived just before the week began, Karthi’s black comedy is a major trending title this week. It follows a policeman influenced by his grandfather’s obsession with MGR, blending social commentary with high-octane action. Checkmate (Manorama Max): For fans of Malayalam cinema, this new thriller premiered on February 6th, offering a gritty look at corporate rivalry and personal vengeance. Gustaakh Ishq (ZEE5): This intense romantic thriller featuring Vijay Varma continues to garner a strong response for its dark, atmospheric storytelling and complex character arcs. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    -ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పనే -ఎందుకు అలా చేసారు -నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నారు   నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కథ నేనే.. ఈ హర్రర్ సాంగ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రముఖ ఓటిటి దిగ్గజం జియో హాట్ స్టార్(Jio Hotstar)మధ్య చక్కర్లు కొడుతుంది. ఇందుకు ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది ది రాజాసాబ్(The Raja Saab)మూవీ. అదేంటని అనుకుంటున్నారా! పూర్తి డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు కూడా సదరు సాంగ్ ని హమ్ చేస్తు ప్రభాస్ ఫ్యాన్స్ జియో హాట్ స్టార్ ని వీడేలా లేరని అంటారు. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రాజాసాబ్ నిన్న ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.దీంతో కొంతమంది అభిమానులు జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కి పెద్ద ఎత్తున బిర్యానీ పార్సెల్స్ ఆర్డర్ చేసారు. సదరు ఫుడ్ ఆర్డర్లకి సంబంధించిన ఫోటోలను జియో హాట్‌స్టార్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో పాటు  “లవ్వే… లవ్వే… అంతా లవ్వే. థాంక్యూ డార్లింగ్. అందరూ కొట్టి చంపేస్తారు… మీరు మాత్రం పెట్టి చంపేస్తున్నారు” అంటూ సరదా క్యాప్షన్ ఇవ్వడం నెటిజన్లని ఆకట్టుకుంది. దీంతో పాటు సోషల్ మీడియాలోను  వైరల్‌గా మారింది.  also read:  నువ్వు మాత్రం అలాగే ఉండు దొర.. మనసు మార్చుకోకు    థియేటర్స్ లో రాజాసాబ్ డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఫ్యాన్స్ బిర్యానీ పంపించడం ఆసక్తిగా మారడంతో పాటు ముందు ముందు మరిన్ని కానుకలు  ఇస్తారేమో అనే చర్చ కుడా జరుగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.      
    -సోషల్ మీడియా వేదికగా అభిమానుల హంగామా  -వాళ్ళు ఏం చెప్తున్నారు -అనిల్ రావిపూడి మరి ఏం చేస్తాడు   పోపులపెట్టెలో ఉండే భారీ ఖర్చులేని మసాలా దినుసులు ఇచ్చే రుచి,సువాసన వల్ల తెలుగు ప్రజలు ఆనందంతో సుష్టిగా, సంతృప్తిగా భోజనం చేస్తారు. సదరు ఈక్వెషన్ తెలుగు సినిమాకి కూడా వర్తిస్తుంది. తన అమ్ముల పొదిలో దాగి ఉన్న ఫ్యామిలీ, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ దినుసుల వల్ల పర్ఫెక్ట్ తెలుగు సినిమా చూశామనే సంతృప్తి ప్రేక్షకులు పొందుతారు. ఒక రకంగా తెలుగు సినిమాకి పునాది కూడా అవే. అనిల్ రావిపూడి ఆ మూడు దినుసులని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్లడమే కాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటు తెలుగు సినిమా గొప్పతనాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా తెలియచేస్తునాడు. రీసెంట్ గా తెలుగు సినిమా ప్రేమికులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా  అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి ఒక విన్నపం చేసుకుంటున్నారు. సదరు విన్నపం ఏంటో చూద్దాం.   ఏ డైరెక్టర్ అయినా హిట్ మీద హిట్ ని అందుకుంటు ఉంటే తన రేంజ్ మరింతగా పెరగాలని పాన్ ఇండియా సబ్జెట్స్ వైపు చూడటం సహజం. ఆ విధంగా ఆలోచించడం తప్పు కూడా కాదు. కానీ పాన్ ఇండియా మోజులో పడి రక రకాల అంశాలని కలపాలనే ప్రాసెస్ లో తెలుగు సినిమాతో పాటు, తెలుగు సినిమా లవర్ కి అన్యాయం జరుగుతుంది.దాంతో సంతృప్తి ని పొందలేకపోతున్నాం. ఎప్పుడైనా ఒక సారి పాన్ ఇండియా సబ్జెట్స్ అంటే ఓకె. కానీ ఒక మోస్తరు డైరెక్టర్ నుంచి బడా డైరెకర్స్ దాకా అందరూ అదే దారిని అవలంబిస్తూ నెలకొక సారైనా అలాంటి సినిమాని తీసుకొస్తున్నారు. మీరు మాత్రం ఆ దిశగా ఆలోచించకండి.   అచ్చ తెలుగు సినిమాలతో మమ్మల్ని సంతోష పెడుతూనే ఉండాలి. థియేటర్ ముఖం చూసి సంవత్సరాలు,సంవత్సరాలు అవుతున్న పెద్ద వాళ్ళు సైతం మీరు అందిస్తున్న తెలుగు సినిమా దినుసుల వల్లే థియేటర్స్ కి వస్తున్నారు. పైగా మీకు సంక్రాంతి నెల పై పేటెంట్ హక్కు పొందిన వ్యక్తిగా కూడా రికార్డు ఉంది. కాకపోతే ప్రతి సంక్రాంతికి కాకుండా మీరు అందించే నవ్వుల విందు ఆరునెలలకి ఒకసారైనా వచ్చే అవకాశం ఉంటే చూడండి అంటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   Also read:  ఓన్లీ సింగిల్ ఫ్రమ్ ముంబై!.. మాఫియా నేపధ్యం పక్కానా!    అనిల్ రావిపూడి అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రకరకాల హీరోల పేర్లు వినిపిస్తున్నా ఇంకా కన్ఫార్మ్ కాలేదు.ఇటీవల ఆయన మాట్లాడుతూ ఈ సారి టైటిల్ నుంచే ఎంటర్ టైన్ మెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.   
- నిర్మాత సేఫ్టీ కోసమే ఈ నిర్ణయమా? - మహేష్, రాజమౌళిలకు రెమ్యునరేషన్ లేదు - రాజమౌళి కొత్త స్ట్రాటజీ   టాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా ‘వార‌ణాసి’. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎదురుచూస్తున్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న‘వార‌ణాసి’ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్ప్పుడు వైరల్ అవుతోంది. సినిమా మేకింగ్‌లో, ప్రమోషన్స్‌లో, మార్కెటింగ్‌లో తనకంటూ ఒక స్టైల్ కలిగి ఉన్న రాజమౌళి.. తను చేసే  సినిమాకి సంబంధించి తీసుకునే రెమ్యునరేషన్‌లో కూడా కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.    గతంలో కొంతమంది టాప్ హీరోలు తాము చేసే సినిమాలకు రెమ్యునరేషన్‌కి బదులుగా ఏదో ఒక ఏరియా థియేట్రికల్ రైట్స్ తీసుకోవడం మనం చూశాం. సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టయితే నిర్మాతకు అది భారంగా మారే అవకాశం ఉంది. దాని వల్ల సినిమా నిర్మాణం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు హీరోలు ఈ నిర్ణయం తీసుకునేవారు. ఇప్ప్పుడు ఒక అడుగు ముందుకు వేసి రాజమౌళి కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాడని తెలుస్తోంది.    భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న‘వార‌ణాసి’ రెమ్యునరేషన్ల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకి పనిచేసినందుకుగాను మహేష్, రాజమౌళి రెమ్యునరేషన్ల రూపంలో ఏమీ తీసుకోకుండా వర్క్ చేస్తున్నారట. ఇంతకుముందు రాజమౌళి చేసిన కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్‌తోపాటు సినిమాకి వచ్చిన లాభాల్లో కూడా వాటా తీసుకునేవారు. ఈ సినిమాకి సంబంధించి తన రెమ్యునరేషన్ కింద ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది.    డైరెక్టర్‌గా రాజమౌళికి మంచి గ్లోబర్ మార్కెట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా రాజమౌళికి 160 కోట్లకుపైగా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ డైరెక్టర్‌కి ఈ స్థాయి రెమ్యునరేషన్ లభించలేదు. రాజమౌళికి ఉన్న క్రేజ్, అతని సినిమాలకు వచ్చే కలెక్షన్స్ దృష్ట్యా ఆ స్థాయిలో పారితోషికం తీసుకోవడం సమంజసమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.    ఇక మహేష్ విషయానికి వస్తే.. ఈ సినిమా నిర్మాణంలోనూ మహేష్ భాగస్వామి అని తెలుస్తోంది. ‘వార‌ణాసి’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకునేందుకు మహేష్ కూడా సిద్ధమయ్యారని సమాచారం. తాజా అంచనాల మేరకు మహేష్‌కు 200 కోట్ల వరకు అందే అవకాశం కనిపిస్తోంది. ఆ విధంగా మహేష్, రాజమౌళి తమ రెమ్యునరేషన్లను ఫిక్స్ చేసుకున్నారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు.. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి. ప్రజలు చేయాల్సినది.. క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.                                    *రూపశ్రీ.
  అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి.  ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తారు. అబ్బాయి ఉద్యోగం,  సొంతిల్లు ,  సంపాదన, ఆస్తిపాస్తులు,  అబ్బాయి అలవాట్లు.. ఇవి మాత్రమే కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిని తమకు ఎంత దగ్గర ప్రాంతంలో వీలైతే అంత దగ్గరలో ఇవ్వాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేని అమ్మాయిల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేయగానే ఒకరిని ఒకరు చేరుకునేట్టుగా ఉండే ప్రాంతాలకు ఇవ్వాలని ఆశిస్తారు.  దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. చేరుకోవడం తేలిక.. దగ్గరగా నివసించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఒకరినొకరు కలవడానికి  అడ్డంకులు తక్కువగా ఉండటం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు కూతురిని చూడవచ్చు, కూతురు తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు. చిన్న,  పెద్ద సమస్యలు,  అపార్థాలను వెంటనే పరిష్కరించవచ్చు. ఇది సంబంధంలో పారదర్శకతను తెస్తుంది,  పరస్పర విశ్వాసాన్ని బలపరుస్తుంది. దగ్గరగా ఉండటం వల్ల, రెండు కుటుంబాలు ఒకరి మనస్తత్వాన్ని,  వారి అవసరాలను సులభంగా అర్థం చేసుకోగలవు, ఇది సంబంధంలో సామరస్యాన్ని పెంచుతుంది. సమయం, ఖర్చు.. కూతురిని దూరంగా ఇచ్చినప్పుడు ఆమెను చూసి రావడానికి  తరచుగా ఎక్కువ సమయం,  డబ్బు ఖర్చవుతుంది.  ప్రయాణాలు, ఫోన్ కాల్స్,వాహన సదుపాయం మాత్రమే కాకుండా  ప్రయాణానికే ఉన్న సమయం అంతా గడిపోతుంటుంది. దీని  వల్ల సంబంధాలకు సమయం కేటాయించడంలో ఒత్తిడిని కలిగిస్తుంది. దగ్గర ఉన్న సంబంధాలకు ఇాలాంటి సమస్యలు ఉండవు.  చిన్న చిన్న పండుగలు,శుభ సందర్భాలను కూడా  కుటుంబంతో పంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. ఆర్థిక, మానసకి భారాన్ని తగ్గిస్తుంది. వాతావరణం.. దగ్గరి ప్రాంతంలోనే అమ్మాయిని ఇవ్వడం వల్ల ప్రాంతీయత, అలవాట్ల సమస్య ఉండదు. ఆహారపు అలవాట్లు,  పద్దతులు కూడా తెలిసి ఉంటాయి.  ఇది మనుషుల్లో కలిసిపోవడానికి బాగా సహాయపడుతుంది. సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో పెద్దగా తేడా లేకపోతే, రెండు కుటుంబాలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఉమ్మడి పునాది సంబంధాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా,  బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల ఇల్లు,  అత్తమామల ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నప్పుడు,  పిల్లలను పెంచడంలో మంచి సపోర్ట్ లభిస్తుంది.  ఉద్యోగం కారణంగా నేటి కాలంలో వారు పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దగ్గరలోనే రెండు కుటుంబాలు ఉంటే పిల్లల విషయంలో మంచి సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలకు రెండు కుటుంబాల  ప్రేమ,  మద్దతు కూడా లభిస్తుంది. ప్రతికూలతలు.. కుటుంబాలు దగ్గరలో ఉండటం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉంచాయి.  రెండు కుటుంబాలు ఆరోగ్యకరమైనవి అయితే సమస్య లేదు. కానీ కేవలం అమ్మాయి మాత్రమే కావాలని, ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబం మాకు అవసరం లేదని అనుకునే అత్తింటి వారితో ఇలా దగ్గరగా ఉండటం వల్ల అటు ఆడపిల్ల తల్లిదండ్రులు,  ఆ అమ్మాయి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు దగ్గర  ఉంటే ఏ చిన్న గొడవ జరిగినా ఆడపిల్ల తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడుతుంది.  ఇది అత్తింటితో అనుబంధాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు అల్లుడి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం,   ఆడపిల్లకు చెడు మాటలు నేర్పి  కుటుంబాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అయితే.. దూరం సంబంధం అయినా, దగ్గరి సంబందం అయినా..  రెండు కుటుంబాలు  ఆరోగ్యకరంగా ఉండే విదానం మీదనే సంబంధాలు నిలబడతాయి, సంతోషంగా ఉంటాయి.                                   *రూపశ్రీ.
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.   షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 డయాబెటిస్‌కు  దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం  ప్రధాన వడపోత  అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది.  ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్,  ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది,  అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు,  శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల,  ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు.  కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే,  త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.  కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..  డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది  చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్  డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట,  మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి.  దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.  ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.   డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది,  కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది.  ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు,  ముడతలను తగ్గిస్తుంది,  ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం,  ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు.  అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మూత్రం లీకేజి ఇందుకే.. వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం,  పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్  బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు   వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మరో కారణం  ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా,  వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి,  మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి.. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.  పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు,  కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి.  ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా  కెగెల్ వ్యాయామాలు చేయాలి.  సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.   ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...