LATEST NEWS
డ్రగ్  పెడలర్ లావణ్య సినీ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండ గానే మరో డ్రగ్ పెడలర్ మస్తాన్ సాయి ఎంటరయ్యారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అప్పగించింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో లావణ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో లావణ్య శ్రీనివాస్ తో మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలడంతో శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.చాలాకాలంగా వీరువురు ఫోన్ లో తరచూ మాట్లాడేవారు. లావణ్య కేసుకు సంబంధించిన సమాచారం శ్రీనివాస్ అందించే వాడని తెలుస్తోంది.  శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఏ కేసు విషయంలో వీరిరువురు మాట్లాడినట్టు  అనేది తెలియరాలేదు. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆ పార్టీలోని సీనియర్లను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలే  గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ లో నైతిక స్థైర్యం బాగా దెబ్బతింది. అధికారంలో ఉన్నంత కాలం నోటికొచ్చిన బూతులతో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరు తెరవాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వైసీపీ కోలుకుని రాజకీయంగా చురుకుగా మారడం కష్టమని భావించిన ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకున్నారు. కూటమి పార్టీలలో సర్దుకున్నారు. మరి కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మిగిలిన వారిని జగన్ స్వయంగా పార్టీ నుంచి తరిమేసే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారా? అంటూ అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి.  సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్న తరువాత.. పొరపాటు ఎక్కడ జరిగింది, ప్రజా విశ్వాసాన్ని ఎందుకు కోల్పోయాం. తిరిగి ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అని ఆలోచిస్తుంది.  ఘోర ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటుంది. పార్టీని మళ్లీ గాడి లోకి పెట్టడానికి ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తుంది. కానీ వైసీపీలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ కొన్ని రోజులు, తెలుగుదేశం అధినేత ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగానే ఓటమి పాలయ్యామంటూ కొన్ని రోజులు గడిపేసింది. ఎంత సేపూ తాము బ్రహ్మాండమైన పాలన అందించాం. సంక్షేమాన్ని దండిగా ఇచ్చాం.. అని చెప్పుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ము పందేరం చేసినా దానిని తీసుకుని కూడా జనం తమకు ఓట్లేయలేదని నెపాన్ని ప్రజల మీదకు నెట్టేయడంతోనే వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలూ ఈ ఎనిమిది నెలలూ గడిపేశారు. దీంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు నేతలు జగన్ కు బైబై చెప్పేశారు. అలా వెళ్లిపోవడం అన్నది పార్టీలో అత్యంత కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు అయిన విజయసాయి వరకూ సాగింది. దీంతో ఇక పార్టీలో మిగిలిన వారిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని అంతా భావించారు. అంటే పార్టీ పదవులలో మిగిలి ఉన్న సీనియర్లను నియమించి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తారని అంతా భావించారు. అయితే జగన్ తీరు మాత్రం పార్టీలో ఇంకా మిగిలి ఉన్న సీనియర్లను తరిమేసేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రోజాను పార్టీ నుంచి తరిమేయడానికి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  గతంలో మాజీ మంత్రి బాలినేని విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆయనంతట ఆయనే పార్టీ వదిలి వెళ్లిపోయేలా చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సరే విషయానికి వస్తే.. నగరి నియోజకవర్గ ఇన్ చార్జిగా రోజాను కాకుండా.. ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరడానికి సిద్ధమైన నాయకుడిని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన రోజాపై భారీ మెజారిటీతో గెలుపోందారు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమ రెండవ కుమారుడు   గాలి జగదీశ్ వైసీపీ గూటికి చేరనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన బుధవారం వైసీపీ కండువా కప్పుకుంటారు. ఆయననను పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రోజాకు పార్టీ నుంచి బయటకు వెళ్లమని మర్యాదగా చెప్పినట్లేనని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో గాలి జగదీశ్ ను వైసీపీలో చేర్చుకోవడంపై రోజా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అబ్యంతరాన్ని ఆమె నేరుగా జగన్ కే తెలియజేశారని అంటున్నారు. దీంతో గాలి జగదీశ్ వైసీపీ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  మొత్తం మీద జగన్ వ్యవహార శైలి పార్టీలోని సీనియర్లకు కాళ్ల కింద కుంపటి పెడుతున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
చిరంజీవి ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది.  ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి అన్న మాటలు, జై జనసేన అంటూ చేసిన నినాదం రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాను జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారని పరిశీలకులు విశ్లేషించారు.   ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారనీ, ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అది కొంచం సద్దుమణిగే సరికి లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడిన మాటలు మరోసారి చిరంజీవి రాజకీయాలలో యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ తన తమ్ముడు, జనసేన అధినేత పవర్ కల్యాణ్ సాధిస్తారని చెప్పారు. తాను పూర్తిగా సినిమాలకు పరిమితం అని చెప్పేశారు. అలా చెబుతూనే తాన ఆకాంక్షలు, ఆశయాలు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారనడం ద్వారా తన అభిమానులకు మాససికంగా తాను జనసేనవైపు ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ పవన్ సాధిస్తారు అనడం వెనుక ఉద్దేశమేమిటన్న చర్చ మొదలైంది.  దీంతో చిరంజీవి స్వయంగా తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించినా, రాజకీయం మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో చిరంజీవి గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమేషన్లలో భాగంగా చెప్పిన ఓ డైలాగ్ ‘నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీతో సంబంధం లేకుండా ఆయన చుట్టూ రాజకీయాలు ప్రదక్షణం చుస్తున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  
ఆయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆయన  ఆదివారం లక్నోలోని ఎసీపీజీటీలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ బుధవారం (ఫిబ్రవరి 12) తుదిశ్వాస విడిచారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత   సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహ రించారు.  సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచే స్తున్నారు. ఆయన 1945 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 ఏళ్లు. సత్యేంద్ర దాస్ తన గురువు అభిరామ్ దాస్ జీ ప్రభావంతో   1958లో  అంటే 13 ఏళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించారు. అప్పటి నుంచీ ఆయన తన ఇంటిని వదిలి ఆశ్రమంలో నివసించారు. సత్యేంద్రదాస్ మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది రెట్లు పెద్దదని బీజేపీ సీనియర్  నాయకుడు, అనకాపల్లి పార్లమెంట్  సభ్యుడు సీఎం రమేష్ లోక్ సభ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేద్ లో మద్యం కుంభకోణం అంశాన్ని ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11)  లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నగదు లావాదే వీలతోనే సాగిన మద్యం అమ్మకాలలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అసలు మద్యం విక్రయాలన్నీ నగదుతోనే జరిగాయనీ,  ఏదీ డిజిటల్‌ ఫార్మాట్‌లో లేదని సీఎం రమేష్ లోక్ సభలో చెప్పారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని మార్చారనీ, అప్పటి వరకూ ప్రైవేటు షాపుల ద్వారా జరిగే మద్యం విక్రయాలను జగన్ తన హయాంలో ప్రభుత్వ దుకాణాలకు మార్చేశారనీ వివరించారు. అయితే పని చేసే ఉద్యోగులు మాత్రం  కాంట్రాక్టు కార్మికులని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదన్నారు.   ఈ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులను ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేసింది. అవసరమైతే సీబీఐ, ఈడీలకు ఈ కేసు అప్పగిస్తామనీ చెప్పింది. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ ఆంధ్ర ప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తి స్థాయి విచారణ జరపాలని లోక్ సభ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.   ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే.  క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్  ఏర్పాటైన సిట్ లోఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఏపీ సర్కార్ చేర్చింది.  ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని లోక్ సభ సాక్షిగా డిమాండ్ చేయడంతో జాతీయ స్థాయిలో ఏపీ మద్యం కుంభకోణం హైలైట్ అయ్యింది. 
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం తన 16 వ చిత్రానికి సంబంధించిన మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో చిత్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది.జాన్వీ కపూర్(Janhvi kapoor)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు సానా(Buchibabu sana)దర్శకుడు.సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.స్పోర్ట్స్ నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతు ఉంది. ఇక ఈ మూవీ తర్వాత  'శౌర్యవ్'(Shouryuv)అనే యువ దర్శకుడితో చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.శౌర్యవ్ ఎవరో కాదు,నాచురల్ స్టార్ నాని తో 'హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు.మొదటి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.చరణ్‌ కి ఇటీవల ఒక లైన్ చెప్పాడని,అది చరణ్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'శౌర్యవ్' ఇప్పుడు ఆ కథని పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడనే కథనాలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 'హాయ్ నాన్న' శౌర్యవ్ కి తొలి సినిమా అయినా కూడా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా సెంటిమెంట్,కామెడీ,యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించాడు.అందువలనే శౌర్యవ్ కి చరణ్ ఓకే చెప్పాడని కూడా అంటున్నారు.బుచ్చిబాబు సినిమా తర్వాత చరణ్ చెయ్యబోయే సినిమాపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మరి చరణ్,శౌర్యవ్ ల సినిమాపై త్వరలోనే అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.      
ఆర్‌.జి.వి. ఆర్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై గిరికృష్ణ కమల్‌ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘శారీ’. టూ మచ్‌ లవ్‌ కెన్‌బి స్కేరీ అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఈ సినిమాను రవిశంకర్‌ వర్మ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సత్యయాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం మ్యాంగో మీడియా ద్వారా విడుదల చేశారు.  ప్రస్తుత జనరేషన్‌లో మీడియా, సోషల్‌ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతే అనర్థం కూడా ఉందని చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌లో వినిపించే రామ్‌గోపాల్‌వర్మ సినిమాలోని ప్రధాన ఇతివృత్తాన్ని చెప్పారు. ‘సోషల్‌ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌గాని, ఫోర్‌గ్రౌండ్‌గాని ఏమి తెలియకుండా నమ్మేయడంతో... ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’ అంటూ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చారు వర్మ.  నిర్మాత రవిశంకర్‌వర్మ మాట్లాడుతూ ‘మా ‘శారీ’ చిత్రంలోని టీజర్‌,  ‘ఐ వాంట్‌ లవ్‌’,  ‘ఎగిరే గువ్వలాగా...’ ఈ రెండు లిరికల్‌ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. సత్య యాదు, ఆరాధ్యదేవి, సాహిట్‌, సంభవాల్‌, అప్పాజీ అంబరీష్‌, కల్పలత తదితరులు నటించిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శబరి, రచన, సమర్పణ: రామ్‌గోపాల్‌వర్మ, నిర్మాత: రవిశంకర్‌ వర్మ, దర్శకత్వం: గిరికృష్ణ కమల్‌. 
టాలీవుడ్‌ హీరోల్లో రవితేజకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే తెలుగులో ఎంతో మంది మాస్‌ హీరోలు ఉన్నారు. వారిలో కూడా రవితేజ వెరీ స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే మాస్‌ ఆడియన్స్‌కి ఆయన దగ్గరైన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఎలాంటి సినిమా ప్రేక్షకులకు నచ్చుతాయి, తన నుంచి వారు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని పర్‌ఫెక్ట్‌ గుర్తించి ఆ తరహా సినిమాలే చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగా పాతిక సంవత్సరాల కెరీర్‌ని చూసిన రవితేజకు ఈమధ్యకాలంలో సరైన హిట్‌ పడలేదన్నది వాస్తవం. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్‌ తర్వాత ఎన్నో ఫ్లాప్‌ సినిమాలు చెయ్యాల్సి వచ్చింది. మధ్యలో ధమాకా అనే సినిమా హిట్‌ కావడంతో అతని కెరీర్‌ గ్రాఫ్‌లో కాస్త చలనం వచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు వరసగా ఫ్లాప్‌ అయ్యాయి. చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయినా ఆ క్రెడిట్‌ అంతా చిరంజీవికే వెళ్లింది. ఇటీవల హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రవితేజ చేసిన మిస్టర్‌ బచ్చన్‌ డిజాస్టర్‌ అయింది. ఇప్పుడు రాబోతున్న మాస్‌ జాతరపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నారు.  రవితేజకు సరైన హిట్‌ రావడం లేదన్న బాధ అతని ఫ్యాన్స్‌లో విపరీతంగా ఉంది. మాస్‌ జాతర చిత్రంతో మరోసారి విజృంభిస్తారన్న కాన్ఫిడెన్స్‌ వారిలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటో చూసి ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఎందుకంటే రవితేజ గుర్తు పట్టలేనంత కనిపిస్తున్నారు. ఫేస్‌లో, పర్సనాలిటీలో ఎంతో తేడా కనిపిస్తోంది. దీనిపై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒకో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరికి అందరి డిస్కషన్‌లో తేలిన విషయం ఏమిటంటే.. ఇది లేటెస్ట్‌ ఫోటో కాదని, పాత ఫోటోనే ఇప్పుడు కావాలని వైరల్‌ చేస్తున్నారని అందరికీ అర్థమైంది. 
Megastar Chiranjeevi attended to two different events in the same week - one for Vishwak Sen's Laila and another for Brahma Anandam. While he is an entertaining orator on stage, his frequency of speeches has started hurting his senior fans. They are requesting him to stop such speeches.  At Brahma Anandam event, he slipped out a foul word on stage unwillingly. In trying to entertain people and talk about his journey, he is slightly going over board opine his fans. While his words about no compounds in film industry have been welcomed, his narrative on saying that he took the initiative to end it, rose eyebrows.  Now, in the last night event, he talked about his grandfather having two wives and even joked about an affair. Later, he stated that he helped comedian Brahmanandam to become what he did today and even talked about how his political ideology is being carried forward by Pawan Kalyan.  While some are welcoming his stance about not returning to politics ever and resigning from any sort of active politics, they are worried about him tarnishing his image with self-elevating speeches. Some are equating him with Mohan Babu, in talking about his journey everywhere.  His sense of humor and comic sense are being praised for his spontaneity but his inadvertent flirting and several comments on girls are bringing extreme negativity and trolls against him. Hence, senior Mega Fans are requesting him to maintain his dignity before losing it to such silly mistakes. 
  మూవీ: కాదలిక్క నేరమిళ్లై  నటీనటులు: జయం రవి, నిత్యా మీనన్, రవి మోహన్, యోగి బాబు తదితరులు ఎడిటింగ్: లారెన్స్ కిశోర్ సినిమాటోగ్రఫీ: గావెమిక్ యూ. అరి మ్యూజిక్: ఎఆర్ రహమాన్ నిర్మాతలు: ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం: కృతిగ ఉదయనిధి ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో‌ నటించిన చిత్రం ' కాదలిక్క నేరమిళ్లై'. తమిళంలో ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అవ్వగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం... కథ:  శ్రియ (నిత్యామీనన్) ఆర్కిటెక్ట్ గా చెన్నైలోని ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఆమె నివసిస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ (జాన్ కొక్కెన్)తో ఆమె ప్రేమలో ఉంటుంది. నిశ్చితార్థం తరువాత అతని నిజస్వరూపం తెలియడంతో దూరం పెడుతుంది. ఇక సిద్ధార్థ్ (జయం రవి), బెంగుళూర్ లో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ కి గౌడ (యోగిబాబు) సేతు (వినయ్ రాయ్) స్నేహితులుగా ఉంటారు. ఒకసారి సేతుతో పాటు వెళ్లడం వలన, సిద్ధార్థ్ కూడా 'స్పెర్మ్' డొనేట్ చేయవలసి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి, తప్పుడు అడ్రెస్ ఇస్తాడు.  సిద్దార్థ్, నిరుపమ ప్రేనలో ఉంటారు కానీ వారికి బ్రేకప్ అవుతుంది. మరోవైపు శ్రీయ తన బిడ్డ  తండ్రి కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎనిమిదేళ్ల తరువాత కంపెనీ పనిపై సిద్ధార్థ్ చెన్నై కి వెళతాడు. అక్కడ అతనికి శ్రియతో పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. అదే సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి నిరుపమ రీ ఎంట్రీ ఇస్తుంది. సిద్దార్థ్ జీవితం ఎటువైపు మలుపు తిరిగింది? తన బిడ్డ తండ్రిని శ్రియ కనక్కోగలిగిందా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: ఈ సినిమా చూసాక ఒక్కటే ఫీల్ కలుగుతుంది.. ఇది పెద్దవాళ్ళకి, మెచురిటీ ఉన్న యువతకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు యువకులు కలిసి తమ స్పెర్మ్ డొనేట్ చేయడం దానివల్ల వచ్చే పరిణామాలు ఇలా ఒక సెన్సిటివ్ టాపిక్ ని కామెడీగా చూపించాలనుకున్నాడు దర్శకుడు.  అది ఎంత వరకు నచ్చుతుందంటే కొంత మెచుర్డ్ ఉన్నవాళ్ళకే అన్నట్టుగా సాగుతుంది.  ఒక మనిషి ఎంత కష్టపడ్డా ఓడిపోతున్నప్పుడు అతనికి బ్యాడ్ టైమ్ కలుగుతుంది. అలాంటి టైమ్ లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశంతో హీరో అలా చేయడంతో కథ కాస్త ఆసక్తిగా సాగుతుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా గుర్తొస్తుంది. అయితే చివరలో ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని తీసినట్టుగా ఉంటుంది. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. యోగిబాబు లాంటి వాళ్ళు ఉన్నప్పటికి వారితో సరైన కామెడీని వాడుకోలేదనిపించింది.‌ ఒకానొక సిచువేషన్ లో హీరో పాత్ర భిన్నంగా ఉంటుంది. లవ్ బ్రేకప్ అయ్యాక కొంతమంది అమ్మాయిలతో అలా చేయడం కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా సెట్ అవ్వలేదు.  ఫ్యామిలీతో కలసి చూడలేకుండా కొన్ని సీన్లు డిస్టబ్ చేస్తాయి. అడల్ట్ వర్డ్ బాగానే వాడారు. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: శ్రీయగా నిత్యామీనన్, సిద్దార్థ్ గా జయం రవి ఆకట్టుకున్నారు. యోగి బాబు, వినయ్ రాయ్ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : మెచుర్ట్ ప్రేమికులకు మాత్రమే. వన్ టైమ్ వాచెబుల్‌. రేటింగ్:  2.25 / 5 ✍️. దాసరి  మల్లేష్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopalvarma)కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు నా గత చరిత్రని మర్చిపోయి ఇన్ని రోజులు సిగ్గుతో తలదించుకునే సినిమాలు చేశాను.ఇక నుంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తాను.సినిమా అనేది చాలా గొప్పది.సినిమా రుణం తీర్చుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. వర్మ లేటెస్ట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో ఆయన బాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల గురించి మాట్లాడుతు ఇటీవల కొత్త రకం దర్శకులు వచ్చారు.వాళ్ళు 'బాంద్రా' లాంటి ఖరీదైన ఏరియాలో ఉంటు విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తు,ఆ తరహా చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు.ఆ విధంగా నెమ్మదిగా అదే మేకింగ్ స్టైల్ లోకి బాలీవుడ్ మారిపోయింది.దాంతో మాస్ ఎంటర్ టైనర్ సినిమాలని ప్రేక్షకులకి అందించాలనే విషయాన్నీ బాలీవుడ్ మర్చిపోయింది.పుష్ప 2(Pushpa 2)లాంటి సినిమాలని తెరకెక్కించే సామర్ధ్యం బాలీవుడ్ కి ఉన్నా కూడా వాళ్ళు ఆ దిశగా ఆలోచించటం లేదు. కానీ సౌత్ ఇండస్ట్రీ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.ఇక్కడి వారు సంసృతి సంప్రదాయాలకి అనుగుణంగా చిత్రాలని తెరకెక్కిస్తూ మాస్ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నారు,అందుకే విజయాల శాతం ఎక్కువ ఉందని చెప్పుకొచ్చాడు.     
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఉపాసన(Upasana)దంపతులు జంతు ప్రేమికులనే విషయం అందరకి తెలిసిందే.అరుదైన జాతికి చెందిన'రైమ్'అనే కుక్కపిల్లతో పాటు రకరకాల కుక్కలు,బాద్ షా,కాజల్,బ్లేజ్ అనే గుర్రాలే కాకుండా,పక్షి జాతికి చెందిన రకరకాల పక్షులు కూడా ఉన్నాయి.ఆ పక్షుల్లో 'కుట్టి'(Kutti)అనే ఆఫ్రికన్ గ్రే 'చిలుక' ఉంది.ఆ చిలుక కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. దీంతో ఉపాసన సోషల్ మీడియా వేదికగా'హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ no 25 లో 'కుట్టి' అనే  చిలుక తప్పిపోయింది.ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటు పోస్ట్ చేసింది.ఆ పోస్ట్ చూసిన 'యానిమల్ వారియర్ టీం' 'చిలుక'ని పట్టుకొని 'రామ్ చరణ్'దంపతులకి ఇచ్చారు.అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ దంపతులు కూడా వారియర్ టీం కి కంగ్రాట్స్ చెప్పారు.ఇక 'కుట్టిని' ఎలా రెక్కీ చేసి పట్టుకున్నారో అందుకు సంబంధిచిన వివరాలని యానిమల్ వారియర్ టీం సోషల్ మీడియాలో కూడా ఉంచింది.     
                                                                నాలుగున్నర దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో అగ్ర  హీరోగా కొనసాగుతు, తనదైన నటనతో,డాన్సులతో  కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు మెగా స్టార్ చిరంజీవి.గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాకపోయినా కూడా, ఈ ఏడాది మాత్రం విశ్వంభర తో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.   రీసెంట్ గా చిరు బ్రహ్మానందం మూవీకి  సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరయ్యారు.ఈ సందర్భంగా  అయన మాట్లాడుతు ఈ మధ్య కాలంలో నేను పొలిటికల్ కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంటే, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని కొంత మంది అనుకుంటున్నారు. అలాంటి  డౌట్స్ ఏం పెట్టుకోకండి.ఈ జన్మంతా రాజకీయాలకి దూరంగా ఉంటాను.కళామతల్లి సేవలోనే ఉంటు,మరిన్ని మంచి సినిమాలు చేస్తు ప్రేక్షకులని అలరిస్తాను. పొలిటికల్ గా నేను అనుకున్న భావాలని,లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిరు చేసిన ఈ వ్యాఖ్యలతో బిజెపి లోకి చిరు వెళ్తున్నాడని,ఒక అత్యున్నత పదవిలో చిరు కూర్చోబోతున్నాడనే  వార్తలకి చెక్ పెట్టినట్లయింది.మొన్న జరిగిన లైలా మూవీ ఈవెంట్ లో  కూడా  పవన్ స్థాపించిన పార్టీ తనదే అనే ఉదేశ్యంలో చిరు మాట్లాడిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు చిరు మాట్లాడిన మాటలు సినీ సర్కిల్స్ , పొలిటికల్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా నిలిచాయి.    
  సినిమా తీయడం ఒకెత్తయితే, దానిని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రమోషన్స్ కోసం అందరూ తెగ ఖర్చు పెడుతుంటారు, బాగా కష్ట పడుతుంటారు. కానీ విశ్వక్ సేన్ సినిమాలకు మాత్రం పెద్దగా కష్ట పడకుండానే పబ్లిసిటీ అవుతుంది. సరిగ్గా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ జరిగి, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. తాజాగా లైలా విషయంలోనూ అదే జరిగింది.   2019 లో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' మొదలు కొని, ఈ ఫిబ్రవరి 14న విడుదల కానున్న 'లైలా' వరకు.. విశ్వక్ సేన్ సినిమా వస్తుందంటే విడుదలకు ముందు దాదాపు ఏదో ఒక వివాదం జరుగుతూనే వస్తోంది. 'ఫలక్‌నుమా దాస్' ఈవెంట్ లో "నన్ను ఎవడు లేపక్కర్లేదు. నన్ను నేనే లేపుకుంటా" అంటూ విశ్వక్ చేసిన కామెంట్స్ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినట్లుగా అప్పట్లో చర్చ నడిచింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో విశ్వక్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఆ తర్వాత కూడా విశ్వక్ సినిమాల విడుదలకు ముందు ఏదో ఒక వివాదం జరుగుతూనే వచ్చింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయగా అది వైరల్ అయింది. అంతేకాదు, ఆ ప్రాంక్ వీడియోపై ఒక టీవీ యాంకర్ తో విశ్వక్ కి గొడవ జరిగింది. అలాగే ఒకసారి 'బేబీ' దర్శకుడితోనూ కాంట్రవర్సీ అయింది. ఇక ఇప్పుడు 'లైలా' సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 150 మేకలలో 11 మేకలే మిగిలాయి అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇవి పరోక్షంగా వైసీపీ సీట్లపై చేసిన కామెంట్స్ లా ఉండటంతో.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై స్పందించిన విశ్వక్.. ఎవరో ఒకరు చేసిన కామెంట్స్ కి ఇలా సినిమాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.   విశ్వక్ ఎవరినీ నేరుగా విమర్శించకపోయినా ఏదో ఒక వివాదం అవుతుంది. ఇక లైలా విషయంలో అయితే తను ఏం కామెంట్స్ చేయకుండానే కాంట్రవర్సీ అయింది. దీంతో విశ్వక్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కానీ, నిజానికి ఈ కాంట్రవర్సీ వల్ల లైలా కే ప్లస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్నటివరకు ఈ సినిమా గురించి ఎంత మందికి తెలిసిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మందికి ఇంకా బలంగా చేరువైంది. బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ అయింది.   ఏ హీరో సినిమాకి జరగనంతగా విశ్వక్ సేన్ సినిమాల విడుదలకు ముందు ఇలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని వల్ల లాభమెంత? నష్టమెంత? అనేది పక్కన పెడితే.. సినిమా గురించి అయితే అందరూ మాట్లాడుతున్నారు.  మరి ఇలా వివాదాలతో వచ్చే ఫ్రీ పబ్లిసిటీ వల్ల లాభమా నష్టమా?.. మీ అభిప్రాయమేంటో తెలియచేయండి.  
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో తెలుగు సినీ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన నార్త్ ఇండియన్ భామ 'రకుల్ ప్రీత్ సింగ్'.ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో ఉన్న అందరి అగ్ర హీరోలతో నటించి టాప్ హీరోయిన్ రేంజ్ ని కూడా వెళ్ళింది.బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాలు చేసిన రకుల్ ఇటీవల గాయపడిన విషయం అందరకి తెలిసిందే. ఇప్పుడు ఆమె గాయం నుంచి కోలుకొని తన తదుపరి చిత్రం 'మేరే హస్బెండ్ కీ బీవీ' షూటింగ్ లో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతు గాయపడిన తర్వాత నా శరీరంపై నాకు గౌరవం పెరిగింది.నేను అందరకి చెప్పేది ఒక్కటే,అతిగా వ్యాయామం చెయ్యకుండా,మీ శరీరం మాట వినండి.గాయం నుంచి కోలుకొని 'మేరే హస్బెండ్ కీ బీవీ సెట్స్ లోకి అడుగుపెట్టడం ఎంతో ఉద్వేగంగా,ఆనందంగా ఉంది.   'మేరే హస్బెండ్ కీ బీవీ'కి నా భర్త 'జాకీ భగ్నానీ' నే నిర్మిస్తున్నాడు.అందుకే ఈ సినిమా నాకు ప్రత్యేకం.సెట్స్ లో మేము ప్రొఫిషినల్ గానే ఉంటాం అని చెప్పుకొచ్చింది.ఇక  'మేరే హస్బెండ్ కీ బీవీ' ని ముదసర్ అజీజ్ దర్శకుడుగా వ్యవహరించగా ఈ నెల 21 న మూవీ విడుదల కానుంది.అర్జున్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో భూమి ఫడ్నేకర్ కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  కౌగిలి అనే పదానికి చాలా రకాల అర్థాలు చెబుతుంటారు.  చూసే దృష్టిని బట్టి అర్థం మారుతుంది అంటారు. అలాగే ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ హవా కొనసాగుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందరికీ సంబంధించినదే అయినా స్పెషల్ గా ప్రేమికులు ప్రాముఖ్యత ఇస్తారు.  వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే కూడా ఒకటి.  ఈ రోజును ఆరోగ్యకరంగా ఎలా జరుపుకోవాలంటే.. హగ్ చేసుకోవడం పరిస్థితిని బట్టి అర్థాలు ఇస్తుంది. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటారు అంటే చూట్టూ ఉన్న అందరి కళ్లు నానా రకాలుగా అర్థాలు వెతుక్కుంటాయి.  ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం అంటే.. వారి మధ్య ఉండే అపార్థాలు, దాపరికాలు చెరిపేసుకోవడమే.. వాలెంటైన్ వీక్ ను ఎంతో సంబంరంగా జరుపుకునే ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు.  అందులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమ పేరుతో తొందర పడకూడదు. ప్రేమించిన అమ్మాయిని ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా  కౌగిలించుకోవడానికి ముందు అమ్మాయి అనుమతి తప్పక తీసుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ స్టెప్ వేయకూడదు.   ప్రేమికుల జంట  ఏదైనా పని చేసే ముందు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  పబ్లిక్ లో ఎలాంటి  పనులు చేయకూడదు.  సమాజం పట్ల భాద్యగా ఉండాలి. కౌగిలి.. కౌగిలి అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు.. వాలెంటైన్స్ వీక్ ఎలాగైతే ఇష్టమైన వారితో ఎలాంటి సంబంధం ఉన్నవారితో అయినా ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవచ్చో.. హగ్ డే కూడా అలాగే జరుపుకోవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు, తోడబుట్టిన వారు..ఆత్మీయులు,  కష్టాలలో తోడుగా నిలిచేవారు,  మంచి దారి చూపించేవారు..ఇలా ఎవరిని అయినా మనసుకు దగ్గరా చేసుకుని ఆత్మీయంగా ఒక కౌగిలింత ద్వారా కొండంత భరోసాను ఇద్దరి బంధంలో నింపుకోవచ్చు.                                   *రూపశ్రీ.
  టెలివిజన్, ఇంటర్నెట్ ఇవేవీ రాక ముందే ప్రపంచాన్ని ఇది కలపగలిగింది.  అప్పటి వాళ్ళకి అదేదో మాయాజాలం జరుగుతుందేమో అన్నట్టు ప్రపంచ ముచ్చట్లన్నీ గాలిలోనే జనాల దగ్గరకి చేరవేసి అందరికీ  ఆశ్చర్యాన్ని,  ఆనందాన్ని కలిగించింది.  అంతలా అందరినీ ఆశ్చర్యపరిచినదేమిటో.. అననుకుంటున్నారా? ఆకాశం నుండి ఏదో మాట వినబడినట్టు.. ఒక బుల్లి పెట్టేలో నుండి లీలగా వినిపించే మాటలు, పాటలు, ముచ్చట్ల సమాహారం.. పెద్దవాళ్లకు మరచిపోలేని అనుభూతులను పంచిన వెలకట్టలేని బహుమానం.. అదే.. “రేడియో”. మన భారతదేశ ప్రజలకి మాత్రం   ‘ఆకాశవాణి’గా  బాగా పరిచయం. ఇప్పుడున్న చాలామంది తమ బాల్యంలో ఈ ఆకాశవాణి  మాట, పాట విననివారు  ఉండరు. టెక్నాలజీ పెరిగినా కూడా  ఇది మన జీవితాల్లో ఇప్పటికీ ఉంది.  ప్రతి ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన  ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భం జరుపుకుంటారు.  ఒకప్పుడు అందరినీ ఎంతగానో అలరించిన  చిన్ననాటి నేస్తమైన రేడియో గురించి తెలుసుకుంటే....  రేడియో.. 19వ శతాబ్ధపు తొలినాళ్లలోనే రేడియో ప్రపంచానికి పరిచయమైనప్పటికీ దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచన మాత్రం 2010లో ప్రారంభమైంది.  రేడియో ప్రాముఖ్యతను గుర్తించి, దీనికంటూ  ప్రత్యేకమైన రోజు ఉండాలని  మొదటగా స్పెయిన్ దేశం  ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియో  ప్రభావాన్ని గుర్తించిన యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు సమాచారం అందించడంలోనూ, విద్యను ప్రోత్సహించడంలోనూ,  సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను ఏకం చేయడంలోనూ  రేడియో ఎంతగానో సహాయపడింది. వార్తలు, వినోదం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.  పట్టణాలకే కాక  గ్రామాలకు కూడా  చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా విషయం పట్ల అవగాహనను వ్యాప్తి చేయడంలోనూ, ప్రజలకి  వర్తమాన విషయాల గురించి  సమాచారం  అందించటంలోనూ శక్తివంతమైన సాధనంగా పనిచేసింది. రేడియోతో భారతదేశ ప్రజలకున్న అనుబంధం.. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, విశాల మైదానాలతో ఎంతో భౌగోళిక వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఎక్కడెక్కడో నివసించే ప్రజలందరికీ  సమాచారం అందించటం అంత సులువైన విషయం కాదు. కానీ రేడియో ఆ పనిని సాధ్యం చేసింది. అందుకే మన దేశంలో రేడియో ఒక ప్రాచీనమైన, అత్యంత నమ్మదగిన సమాచార మాధ్యమాలలో ఒకటిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది. భారతదేశంలో మొదటిసారిగా  రేడియో ప్రసారం 1927లో ప్రారంభమైంది. 1936లో "ఆకాశవాణి"(ఆల్ ఇండియా రేడియో) ఏర్పడింది. అప్పటి నుండి, భారతదేశంలో సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లో రేడియో ఒక భాగమైపోయింది. సమాచారాన్ని అందించడంలోనూ, వినోదాన్ని పంచడంలోనూ, సంగీతం, వార్తలు, సమకాలీన అంశాలను అందించడంలోనూ రేడియో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నాటికీ కూడా భారతదేశంలో  ఇంటర్నెట్ అందుబాటులో లేని  మారుమూల  ప్రాంతాలలో నివసించే ప్రజలకు వార్తలు, వినోదం, విద్యా సంబంధిత సమాచారంతో పాటూ  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి  అవగాహన కల్పించడంలో రేడియో ఎంతో సహాయపడుతోంది. ఆపద సమయాల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రేడియో అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది.  ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా,  ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు తెల్సుకోవటానికి  ఈ  రేడియో ఎంతగానో ఉపయోగపడుతోంది. రేడియో భవిష్యత్తు.... టెక్నాలజీ ఎంత పెరిగినా, మనమెంత ఎదిగినా  అమ్మ పిలుపులాంటి ఆకాశవాణి మాటని మర్చిపోలేము, మర్చిపోకూడదు. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ఈ రేడియో మన తరానికి అందించిన సేవలని గుర్తించి, ప్రశంసించాలి. ప్రస్తుతం ఎఫ్.ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియోలు, ఆన్‌లైన్ రేడియోలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి.  డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ రేడియో, పాడ్ కాస్టులు  వస్తున్నాయి. ఎన్ని వచ్చినా  కానీ, ఇప్పటికీ ప్రజలకు అత్యంత నమ్మకమైన  సమాచార మాధ్యమంగా సంప్రదాయ రేడియో కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంటుంది.                                    *రూపశ్రీ.
  వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వాలెంటైన్స్  వారంలో ప్రతి రోజు సంబంధాలు,  ప్రేమకు సంబంధించి విభిన్న అంశాలు రోజుకు ఒకటిగా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. వాలెంటైన్స్ వీక్  రోజ్ డే తో ప్రారంభం అవుతుంది  ఇది వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరూ తమకు తమ భాగస్వామి ఎంత ముఖ్యమో, తమ భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయడానికి,  వ్యక్తం చేయడానికి ఈ వాలెంటైన్స్ వీక్ చాలా మంచి వేదిక అవుతుంది. ప్రామిస్ డే.. సంబంధాలలో నిబద్ధత,  విధేయత  ప్రాముఖ్యతను ప్రామిస్ డే నొక్కి చెబుతుంది. ప్రామిస్ డే అనేది వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజు. ఇది సంబంధాలలో  బలాన్ని పెంచుతుంది.  ప్రామిస్ డే రోజు భాగస్వామికి వాగ్దానాలు చేయడం, బంధం పట్ల ఉన్న  నిబద్ధతను చాటిచెప్పడం,  బంధానికివిలువ ఇవ్వడం,  కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. ఇది  భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం, అవగాహన,  ఒకరి పట్ల మరొకరు విధేయతగా ఉండటం వంటి విషయాలను ప్రామిస్ తెలుపుతుంది.  ప్రేమను, బంధం పట్ల గౌరవాన్ని  తెలియజేస్తూ హృదయపూర్వకంగా  ఉత్తరాలు రాయడం, లేదా ప్రేమ లేఖలు రాయడం, మనసులో ఉన్న అమితమైన ప్రేమకు అక్షరరూపం ఇవ్వడం లేదా మనసులో ఉన్న ప్రేమను ఏదో  ఒక అందమైన చర్యతో వ్యక్తం చేయడం ద్వారా ప్రామిస్ డే ను అందంగా మార్చుకోవచ్చు. నమ్మకమే పునాది.. ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది అవుతుంది.  స్నేహం, ప్రేమ,  ఇతర బందాలు ఏవైనా నమ్మకం అనే పునాదుల మీదనే బాగుంటాయి. ఆ పునాది సరిగా లేకపోతే బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమికులకు, ప్రేమను మనసులో నింపుకున్నవారికి కూడా అంతే.. నమ్మకం అనే పునాది బాగుంటేనే వారి బంధం వివాహం వరకు వెళ్లగలుగుతుంది.  ఆ నమ్మకాన్ని ప్రామిస్ ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రామిస్ డేకి అంత ప్రాముఖ్యత.                                      *రూపశ్రీ.
  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకమైన ఆహారం తినడం చాలా ముఖ్యమైనదని భావిస్తారు. అందరూ ఆహారాన్ని తీసుకునే విషయంలో మంచి అలవాట్లు  మెరుగుపరుచుకుంటే అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి. ఇవి రెండూ కూడా ఆరోగ్యం చేకూరుస్తాయి. కానీ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా సరే.. ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది.   అయితే శరీరానికి అందాల్సిన విటమిన్లు అందకపోవడం వల్ల శరీరంలో సమస్యలు ఏర్పడతాయి.  ముఖ్యంగా 5 రకాల విటమిన్లను తీసుకుంటూ ఉంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  ఇంతకీ ఆ 5 రకాల విటమిన్లు ఏమిటో.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. వాటి లోపం వల్ల వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి. సహజ వనరుల నుండి విటమిన్లు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు చూపిస్తున్నాయి.  రోజూ ఏ విటమిన్లు తీసుకోవాలి,  దీని కోసం ఆహారంలో చేర్చాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే.. విటమిన్-ఎ.. విటమిన్-ఎ మన శరీరానికి అనేక విధాలుగా ముఖ్యమైనది. ఇది కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, రేచీకటి వంటి అరుదైన సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం, జుట్టు,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్-ఎ చాలా ముఖ్యమైనది. విటమిన్ A  దృష్టి సమస్యలను,  రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల  ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు,  పాలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-బి.. విటమిన్ ఎ లాగే విటమిన్ బి కూడా  ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ శక్తి ఉత్పత్తికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. విటమిన్ బి చర్మం, గోర్లు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆమ్లం (B9) చాలా అవసరం ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, మాంసం, పప్పుధాన్యాలు ఈ విటమిన్  మంచి వనరులు. విటమిన్-సి.. విటమిన్ సి,  డి రెండూ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మం, ఎముకలు,  దంతాలకు ప్రయోజనం చేకూర్చే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆహారం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నారింజ, నిమ్మ, ఉసిరి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, బ్రోకలీ మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-డి.. విటమిన్ డి కూడా రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌గా పరిగణించబడుతుంది. ఈ విటమిన్ కాల్షియం శోషణను పెంచడం ద్వారా ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది.  విటమిన్ డి లోపం ఎముకల బలహీనత, నిరాశ,  రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. సూర్యకాంతి, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు నుండి విటమిన్ డి పొందవచ్చు. విటమిన్-ఇ.. విటమిన్ ఇ ఒక ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా చర్మం మరియు జుట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, ఈ విటమిన్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది గుండె,  రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ఆహారం ద్వారా విటమిన్ E తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.  అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, అవకాడో, వేరుశెనగలు విటమిన్ ఇ  మూలాలు.                                       *రూపశ్రీ.  
  ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడు అయినా టిఫిన్, భోజనం చేశాక టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మంది అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీ లు తీసుకోవడం అనేది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి వచ్చినా దాని రుచి అడ్డు కట్ట వేస్తుంది. అయితే భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెబుతున్నారు ఆహార నిపుణులు, వైద్యులు.  భోజనం తరువాత కాపీ, టీ లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. ఈ కాలంలో చాలా మంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో గ్యాస్, ఉబ్బరం,   మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.  అయితే ఆహారం తీసుకోవడంలో కానీ, తప్పడు ఆహారపు అలవాట్లు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయట.   భోజనం చేసిన తరువాత కాఫీ, టీ తాగితే.. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్,  టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి,  కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయి.  ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది,  ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది.  దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు చాలా దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటి నొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర పట్టదు. చాలా మంది టీ తాగిన తర్వాత రాత్రి నిద్రపోలేకపోతున్నామని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వెంటనే టీని వదులుకోవడం మంచిది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
అలా సరిగా కూర్చోనట్లయితే అష్టా వక్ర భంగిమలలో మీరు కూర్చుంటే వెన్ను నొప్పి, మెడ నొప్పికి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో స్మార్ట్ ఫోన్ వినియోగం ల్యాప్ టాప్ వినియోగిస్తూ దీర్ఘకాలం పాటు కూర్చుంటున్నారా బెడ్ పై పడుకునే టప్పుడు బెడ్ సరిగ్గా ఉందా ?సరైన భంగిమలో పడుకుంటు న్నారా ?అలా కానట్లయితే మీ చేతి వేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూస లోని జాయింట్స్ అరిగి పోతాయి. ఆస్టియో ఆర్తరైటిస్ వంటి వ్యాధులు బారిన పడతారు. మీరు దీర్ఘ కాలం పాటు వాడకం లేదా కూర్చునే భంగిమ పడుకునే భంగిమ లో ఏమాత్రం తేడా ఉన్నా సరిగ్గా లేకపోయినా మీవేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూసా అరిగి పోతుంది.4౦ సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చే ఆస్టియో ఆర్తరైటిస్ వల్ల కీళ్ళు,జాయింత్స్ లో అరుగుదల కనిపించించింది.ఈ సమస్య ఇప్పుడు 2౦ సం వచ్చరాల వాళ్ళలో అరుగుదల కనిపిస్తుంది. దాదాపు దగ్గర ఫగ్గర 1౦ నుండి 15%సమస్యలు  15౦ మంది రోగులలో రోమటాలజీ విభాగం లైఫ్ స్టైల్ డిజార్దర్ గా  పేర్కొన్నారు.ఇటీవల కాలం లో వెన్ను నోప్పితో బాధపడుతున్నారన్న పలురోగులను హెచ్ ఓ డి ప్రొఫే సర్ ఉమాకుమార్ అవుట్ పేషంట్ బ్లాక్ లో చూస్తున్నప్పుడు వచ్చిన పలు సమస్యసలను ప్రస్తావించారు. ఒక కేజీ బరువు పెరిగినా ఒత్తిడి పెరిగి కీళ్ళు పిరుదల పై నుండి ౩ నుండి 6 రెట్లు నొప్పులు పెరుగుతాయి.మెడను వంచడం 15 డిగ్రీ ల యాంగిల్ లో ఉంటె స్మార్ట్ ఫోన్ మాట్లాడం వల్ల 11 కే జీల బరువు పెరిగి మెడ వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా ౩౦ డిగ్రీల యాంగిల్ లో కింది భాగం లో స్మార్ట్ ఫోన్ లో చూస్తారో 18 కే జి ల ఒత్తిడి పెరిగి వెన్ను మెడ నొప్పి కి సంబందించిన సమస్యలు వస్తాయి.మీ మెడను కిందికి వంచే బదులు ఫోన్ ల్యాబ్ టేబ్ పైన పెట్టుకోవాలని దీని వల్ల కంటిని కాపాడవచ్చునని డాక్టర్ కుమార్ అన్నారు.ఎప్పుడైతే భుజాలు మెడ ముందుకు వంగు తాయో ముందు భాగం లో ఉన్న కండరాలు గట్టి పడి వెనుక వైపు భాగం లో ఉన్న నరాలు కండరాలు బలహీన పడతాయి ఈ కారణంగా ఒక పక్కన కండరాలు బలహీన పది కండరాల మధ్య సమతౌల్యం లోపించి దీనివల్ల స్పోండి లైటిస్ స్పొండోలసిస్ వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కుమార్ వివరించారు. ఆర్తరైటిస్ కు అవుట్ పెషంట్ గా వస్తున్నారని అంకి లోజింగ్ స్పాం డి లైటిస్ రోమటైద్ ఆర్తరైటిస్ వంటి సమస్యలతో వస్తున్నట్లు గుర్తించామన్నారు.జీవన శైలి విధానాల వల్ల సమస్యలతో బాధపడుతున్నారని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా డాక్టర్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి రోగులకు  ఆక్యుపేషనల్ తెరఫీ ని సూచించి నట్లు తెలిపారు అదీ వారు కూర్చునే భంగిమజీవన శైలి విధానం లో మార్పులు చేస్తే కొంత మేర సమస్యనుండి బయట పడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక కేసు విషయాన్ని ప్రస్తావించారు.ఇతను 2౩ సంవత్చరాల పురుషుడు  అతను ఎక్జి క్యుటివ్ గా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేసే ఉద్యోగని తెలిపారు అతను వెన్ను నొప్పి తో బాధపడుతున్నాడని ఓపి డిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి చేతి వేళ్ళు స్పర్స లేకుండా పోయాయని. నాలుక పై భాగం సైతం తిమ్మిరిగా స్పర్స కోల్పోయారని నిర్ధారించారు.పూర్తి పరీక్షలు నిర్వహించిన తరువాత అతని కూర్చునే భంగిమలో పడుకునే భంగిమలో తప్పు ఉందని మొబైల్ ఫోన్ కీబోర్ద్ ఎక్కువ సేపు వినియోగిస్తున్నాడని చాలా ఫోన్స్ మాట్లాడాల్సి ఉంటుందని అప్పుడు మొబైల్ ఫోన్ 6 నెలల పాటు జీవనశైలి లో మార్పులు చేయాలని  సూచించామని అన్నారు. అయితే అతనికి యాంకిలో జింగ్ స్పోండి లైటిస్ గా నిర్ధారించారు.అందుకు ప్రజలు వారి వారి పని చేసే ప్రదేశాలలో వారు కూర్చ్గునే భంగిమ నిటారుగా గుర్తించడం వాటిని వారు నియంత్రించుకోవాలి వారికి అత్యధికంగా నొప్పి వచ్చినప్పుడు మార్చుకునే ప్రాయత్నం చేయాలి అందుకోసం ఆర్గనామిక్ సెట్ అప్ చేసుకోవాలి.మోచేయి 9౦%టేబుల్ ల్యాబ్ టాబ్ టేబుల్ పై ఉండే విధంగా మానీటర్ మీకీబోఅర్డ్ కింది భాగం లో ఉండాలి 2౦ నిమిషాల తరువాత 2౦ సెకండ్లు విరామం అవసరం సుదీర్ఘంగా పనిచేయకుండా విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కూర్చ్గున్నవద్దె కదలకుండా పనిచేస్తే సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొన్నారు.