తెలంగాణాలో వైకాపా కోలుకొంటుందా?

Publish Date:Jun 20, 2013

Advertisement

 

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటనలో అకస్మాతుగా మరణించిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బయటకి వచ్చి వైకాపా పెట్టిన కొత్తలో సానుభూతి వల్లనయితేనేమి, జగన్ పట్ల ప్రజలకేర్పడిన నమ్మకం వల్లనయితేనేమి, ఆపార్టీకి తెలంగాణాలో కూడా మంచి ఆదరణ కనబడింది. అయితే, తన పార్టీని మరింత బలపరుచుకోవడానికి జగన్ తెలంగాణాలో పర్యటించబోతే, తెరాస ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆయన తెలంగాణాలో అడుగుపెట్టకుండా అడ్డుకోగలిగింది. ఇక తెలంగాణా విషయంలో ఆయన స్పష్టమయిన నిర్ణయం ప్రకటించకుండా, సెంటిమెంటును గౌరవిస్తామంటూ వైకాపా ద్వంద వైఖరి అవలంభించడంతో, ఆ పార్టీని అడ్డుకొనేందుకు తెరాసకు మరో మంచి ఆయుధం దొరికింది. 

 

ఆ తరువాత జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో వైకాపా మరిక బలపడలేకపోయింది. రాకెట్ స్పీడుతో సాగిపోయిన షర్మిల పాదయాత్రలు కానీ, విజయమ్మ రచ్చబండ కబుర్లు గానీ, ఆ పార్టీని తెలంగాణా ప్రజలు నమ్మేలా చేయలేకపోయాయి.

 

ఇక, తెరాస అధినేత కేసీఆర్ తన ఆకర్ష వ్యూహాలతో వైకాపా నేతలను తనవైపు తిప్పుకొంటూ మెల్లగా పార్టీని ఖాళీ చేసేస్తున్నాడు. తెలంగాణాలో వైకాపాకు బలమయిన నాయకుడయిన బోడ జనార్ధన్ ఆయన అనుచరులతో సహా ఇటీవలే తెరాసలోకి వెళ్ళిపోయారు.

 

ఇటువంటి పరిస్థితిలో మున్సిపల్ మరియు పంచాయితీ ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం వైకాపాకు కొంచెం కష్టంగానే ఉంది. తెదేపా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, బయ్యారం విషయంలో స్పష్టత ఇచ్చి తెలంగాణాలో నిలద్రొక్కుకొంటున్నపటికీ, ఆ రెండూ చేయని వైకాపా మాత్రం తెలంగాణా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది.

 

విజయమ్మ, షర్మిల ఇద్దరూ తెలంగాణాలో పర్యటించినప్పటికీ ‘జగనన్నవస్తాడు, రాజన్నరాజ్యం తెస్తాడు’ అని చిలకపలుకులు పలుకుతూ తెలంగాణా అంశంలో వారు స్పష్టత ఈయకుండా దాటవేయడంతో, వైకాపా తెలంగాణా వ్యతిరేఖమని కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజల మీద ప్రభావం చూపడంతో క్రమంగా ఆ పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గుతోంది.

 

కొండా సురేఖ వంటి బలమయిన నేతలు సైతం ఇప్పుడు ప్రజలకి నచ్చజెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇక అదే సమయంలో తెలంగాణావాదాన్ని బలంగా వినిపిస్తున్నతెరాస తన పోరాటం తీవ్రతరం చేసిన ప్రతీసారి కూడా, వైకాపా ఆ పోరాటంలో పాల్గొనలేక పోవడంతో, ఆపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అనే భావం ప్రజలలో మరింత బలపడి, అక్కడ అది ఒక అంటరాని పార్టీగా మిగిలిపోతోంది.

 

వైకాపా యొక్క ఈ బలహీనతను బాగా అర్ధం చేసుకొన్న కేసీఆర్ మరియు అతని పార్టీ నేతలు వైకాపాను మరింత ఇబ్బందిపెట్టేందుకు తెలంగాణా అంశంపై ఏదో నిత్యం ఒక సవాలు విసురుతూ ఆ పార్టీతో ఆడుకొంటుంటే, వారి ప్రశ్నలకు సంజాయిషీలు ఇచ్చుకోలేక వైకాపా నేతల తల ప్రాణం తోకకి వస్తోంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విజయమ్మ మళ్ళీ తెలంగాణా యాత్రలకు సిద్దమవుతున్నారు. కేసీఆర్ మాటలకు తీవ్ర ప్రభావితులయి ఉన్న తెలంగాణా ప్రజలను, తెలంగాణా ఊసే ఎత్తని వైకాపా సభలకు తరలించడానికి వైకాపా నేతలు చాల కష్టపడవలసి వస్తోంది. అందువల్ల, రేపు విజయమ్మ తెలంగాణాలో యాత్రలు మొదలు పెడితే, పార్టీని బలపరుచుకోవడం సంగతి దేవుడెరుగు, ముందు ఆమె సభలకి జనాలను తరలించగలిగితే అదే పదివేలు అని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

ఒకవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదిగా జైల్లో చిక్కుకుపోయి ఉండటం, మరో వైపు పార్టీ తెలంగాణా అంశంపై స్పష్టత ఈయకపోవడంతో వైకాపా తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచనయింది. అందువల్ల ఆ పార్టీకి మొదట్లో కనబడిన ఆదరణ ఇప్పుడు కనబడటం లేదు.

 

ఎన్నికల సమయానికి తెరాస ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొట్టినప్పుడు, దానిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు వైకాపా వద్ద ఉపాయమూ లేదు, ఉన్నా దానిని సమర్ధంగా అమలు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు లేడు గనుక వైకాపా సీమంద్రా ప్రాంతానికే పరిమితమయిపోక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.