ప్రపంచ వ్యాప్తమైన వివేక వాణి!!

Publish Date:Jan 11, 2022

Advertisement

 

వివేకం అంటే బుద్ధి. ఆలోచన కలిగినది, అర్థం చేసుకోగలది, పరిపక్వత కలిగి అన్నిటినీ సమ దృష్టితో చూడగలిగేది వివేకం యొక్క గొప్ప లక్షణం. ఈ వివేకాన్ని మెండుగా కలిగిన వారు వివేకులు. వివేకులు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. వారిలో ఖచ్చితమైన దృఢచిత్తం ఉంటుంది. దేనికీ భయపడరు, బాధపడరు, ప్రపంచాన్ని అన్నివైపుల నుండి చూస్తూ అన్ని కోణాలలో అన్ని విధాలుగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వివేకాన్ని తన పేరులో నింపుకుని, ప్రపంచానికి వివేకాన్ని పంచిన మహనీయుడు స్వామి వివేకానంద!!ఈయన పేరు వింటే ప్రపంచదేశాలలో భారతీయ హైందవ ప్రవచనాల పరంపర గుర్తొస్తుంది. బాధ్యతాయుతమైన యువతరపు నెత్తురు ఉరకలేస్తుంది. 1863 జనవరి 12వ తేదీన జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రుడు.

రాజు సభలో బుల్లిరాజు!!

బాల్యం నుండే నరేంద్రుడిలో భావి మహత్వ సూచనా లక్షణాలు కానవచ్చాయి. ఇతడు మహోత్సాహ వంతుడు, వ్యాకుల మనస్కుడు. అప్పుడప్పుడు హఠాత్తుగా ఇతడు ఉద్రిక్తుడయ్యేవాడు. తల్లి దీనికొక విచిత్రమైన నివారణోపాయాన్ని కనుగొంది. ఇతణ్ణి కుళాయి నీళ్లకింద కూర్చోబెట్టి శివనామాన్ని జపింప చెయ్యటమే ఆ చికిత్స, నరేంద్రుడు ఎదిగేకొద్దీ అతడిలో అసాధారణ ఉదార ప్రవృత్తులు కనిపించసాగాయి. బిచ్చగాళ్లకు, సన్న్యాసులకు విలువైన వస్తువులను మరో ఆలోచన లేకుండా ఇచ్చి పంపేవాడు. పెంపుడు జంతువులన్నా, పక్షులన్నా ఇతడికి ఎంతో ఇష్టం. ఆవు, కోతి, నెమలి, పావురం, రెండు మూడు గినీ పందులను ఇతడు పెంచేవాడు. కొరడా చేతపుచ్చుకొని గుర్రపుబండిని తోలే 'కోమ్మాన్' ఈ పసివాడి ఊహాలోక నాయకుడు. నరేంద్రుడు తన తోటి బాలుర మన్ననలకు పాత్రుడైన నేత, 'రాజు సభ' అనే ఆటంటే ఇతడికెంతో ఇష్టం. దాన్లో నరేంద్రుడు ఎప్పుడూ రాజు' పాత్రను వహించేవాడు, మిత్రులను అధికారులుగా నియమించేవాడు. ఇలా చిన్ననాటి నుండే ఈయణలో నాయకత్వ లక్షణాలు పురుడుపోసుకున్నాయి.

అధ్యాత్మ అద్భుత మార్గం!!

చిన్నప్పటి నుండి తెలియకుండానే ధ్యానంలో కూర్చోవడం నరేంద్రుడి జీవితంలో అనుకోకుండా జరిగిపోయేది. అలా ధ్యానం చేయడం కూడా ఈయనకు ఆటగా అనిపించేది. అది క్రమంగా పెరుగుతూ ఆయన్ను ఆధ్యాత్మిక సాధన వైపుకు తీసుకెళ్లి రామకృష్ణుల వారి శిష్యుడిని చేసింది. బెలూరులో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఈయన. ప్రపంచ దేశాలకు భారతీయ హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి, అదే విదేశాలలలో పర మతం ముందు భారతీయ సనాతన ధర్మం విశిష్టతను, అందులో మార్మికాన్ని, ఆఫహ్యాత్మికథను, తాత్వికతను ఎలుగెత్తి చాటిన మహనీయుడు.

కెరటాల ఆదర్శప్రాయుడు!!

కెరటం నా ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడి కూడా మళ్లీ లేచినందుకు అంటాడు వివేకానందుడు. ప్రయత్నాల పోరాటంలో వైఫల్యాలను అధిగమించి గెలుపుకై సాగిపోవాలని యువతకు ఉగ్గుపోసినట్టు తన మాటల అస్త్రాలతో ఎన్నెన్నో సూక్తులను చెప్పి భావిభారత అభివృద్ధికి యువతే ముఖ్యమని వారు ఎప్పుడూ విల్లు విడిచిన బాణాల్లా దూకుపోయి దేశాన్ని వెలిగించాలని పిలుపునిచ్చినవాడు.

సోదర, సోదరీ బందానికి మూలకర్త!!

ఈయన చికాగో ప్రసంగం ఎంతో ఖ్యాతి పొందింది. ఆనాటి ఆయన ప్రసంగంలో విదేశీయులను, అక్కడున్న సకల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొదటి మాట  "సోదరసోదరీమణులారా" అని. ఆ ఒక్క మాటతో మనుషులు, దేశాలు, ఖండాల మధ్య ఉన్న వ్యత్యాసం అంతా తుడిచిపెట్టుకుపోయి అందరూ ఒకటే అనే భావనను కలుగజేసింది.

ఇట్లా ఆధ్యాత్మికం, తత్వం, వేదాంతం అన్నిటినీ మేళవించుకున్న వివేకానందుడు భారతీయ యువతకు గొప్ప ఉత్ప్రేరకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తన 39 సంవత్సరాల వయసులో అనారోగ్యం బారిన పడి మరణించారు. ఆ 39 సంవత్సరాల కొద్ది కాలంలోనే యావత్ ప్రపంచానికి తన వాణిని వినిపించాడని, అది అందరి మీద ప్రభావం చూపిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!! 

ఆయన జన్మదినాన్ని యువజన దినోత్సవంగా జరుపుకుని యువత తమ వంతు పాత్రగా దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తే అదే ఆయనకు ఇచ్చే నివాళి అవుతుంది.

◆వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా..
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా..
స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది.
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు....
ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి...
సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది.
జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి.
మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం.
ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి   దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం.
టెడ్డీ బేర్స్ చిన్నపిల్లల నుండి  అమ్మాయిల వరకు అందరూ ఇష్టపడతారు.
వాలెంటైన్స్ డే అంటే యువతకు చాలా ప్రత్యేకం. ఈ వారాంతం మొత్తం బోలెడు చాక్లెట్లు, గులాబీలు, గిఫ్టులు అమ్ముడుపోతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.