పొట్ట కూటి కోసం కూలీలుగా మాలిలో పని చేస్తున్న ఇద్దరు తెలుగు కార్మికులు కిడ్నాప్ నకు గురయ్యారు. వీరిలో ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమరం గ్రామానికి చెందిన నల్లమాస్ ప్రవీణ్ కాగా, మరొకరు అలాగే సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన రామచంద్రన్. వీరిరువురూ ఏడాది కిందట రూబీ బోర్వెల్ కంపెనీ ఉద్యోగం కోసం మాలి దేశానికి వెళ్లారు. అయితే గత నెల 23న గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా అప్పటి నుంచీ మొబైల్ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. కాగా మాలిలో తెలుగు యువకుల కిడ్నాప్ నకు సంబంధించి సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వీరి గురించి ఎటువంటి సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమౌతున్నారు.
ఇలా ఉండగా వీరిని జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కాగా వీరు పని చేస్తున్న బోర్ వెల్ సంస్థ యాజమాన్యం కూడా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగుల విడుదల కోసం ఉగ్రవాదులు ఏ డిమాండ్ చేసినా అంగీకరించి తీర్చుందుకు సిద్ధంగా ఉన్నట్లు బోర్ వెల్ సంస్థ యాజమాన్యం ఎంబసీ అధికారులతో చెప్పినట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-telugu-workers-kidnapped-in-mali-36-210567.html
వచ్చింది. ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్ను వెంటనే ఖాళీ చేయాలని, పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.
భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది.
మంగళవారం దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.
విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు.
శంషాబాద్ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్ లో జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఐబొమ్మ రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు.
వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు.