Publish Date:Jun 17, 2025
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.దర్యాప్తు అధికారులు కోరడంతో మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా అధికారులకు వాంగ్మూలం ఇస్తారు.
2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో.. ఆయన ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో ముఖేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉణ్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి, వారి నుంచి కూడా వివరాలు సేకరించిన విషయం విదితమే.
అది పక్కన పెడితే...పోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మంగళవారం (జూన్ 17) కీలకంగా మారనుంది. విచారణలో భాగంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగ రావులను ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రశ్నించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 400 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tpcc-chief-statemeny-inphone-tapping-case-39-200106.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.