Publish Date:Sep 30, 2024
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఓ ముగ్గురు నాయకులు ఉన్నారు. వారు పేరుకే బీజేపీ కానీ పని చేసేది మాత్రం జగన్ కోసం. ఔను నిజమే ఈ ముగ్గురూ బీజేపీయులే. కారణాలేమైతేనేం.. 2004 నుంచి 2019 వరకూ వారి తీరును అన్ని విధాలుగా అభినందించి ప్రోత్సహించింది బీజేపీ హైకమాండ్. ఈ ముగ్గురి తీరు వల్లా అప్పట్లో బీజేపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఢిల్లీ దాకా పాకి పంచాయతీలు కూడా జరిగాయి. అయినా అధిష్ఠానం అండదండలూ, ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉన్న ఆ ముగ్గురు నేతలపైనా అప్పట్లో ఈగ కూడా వాలలేదు. అయితే కాలం ఎల్ల వేళలా ఒకేలా ఉండదు కదా.. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు పొడిచింది. వైసీపీ విషయంలో బీజేపీ తీరు మారింది. అయినా ఈ ముగ్గురూ మాత్రం మారలేదు. ఆర్నెళ్లు సావాసం చేస్తేనే వారు వీరౌతారంటారు. అలాంటిది ఐదేళ్ల సావాసం మరి. మార్పు రాకుండా ఎలా ఉంటుంది. దీంతో ఆ ముగ్గురు బీజేపీ నేతలకూ హైకమాండ్ జగనే అన్నట్లుగా వారి తీరు మారిపోయింది. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆ ముగ్గురూ ఎవరూ. వాళ్లు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి. ఔను ఆ ముగ్గురి గురించే ఇప్పుుడు మనం చెప్పుకుంటున్నది.
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో చాలా కాలం తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు ఉంది. తెలుగుదేశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, బడ్జెట్ లో నిధుల కేటాయింపు వంటి అంశాలలో కేంద్రంలోని మోడీ సర్కార్ తో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చే వరకూ తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలే. అయినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శత్రు పార్టీగా వ్యవహరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ముగ్గురు బీజేపీ మంత్రులు ఉన్నా కూడా ఎందుకో అప్పట్లో బీజేపీ, తెలుగుదేశం మధ్య స్నేహ కుసుమాలు వికసించలేదు. ప్రభుత్వంలో ఉన్నాం అంటూ తెలుగుదేశం విధానాలు, నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన మంత్రులు పార్టీలో ఒంటరులయ్యారు. అది వేరే సంగతి. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీలో ఈ ముగ్గురి ప్రభా వెలిగిపోయింది. అందుకు పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు, అండదండలే కారణమనడంలో సందేహం లేదు.
అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తరువాత మళ్లీ జగన్ పక్షాన గట్టిగా నోరెత్తేందుకు పార్టీ అధిష్ఠానం తమనే ఎంచుకుంటుందని వీరు భావించారు. కానీ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు చంద్రబాబు మద్దతుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జీవీఎల్, సోము, విష్ణువర్ధన్ రెడ్డిలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారిని పరిగణనలోనికి తీసుకునే అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి. అయినా ఈ ముగ్గురూ ఇంకా జగన్ పాటే పాడుతున్నారు. లేకపోతే.. దేశాన్ని కుదిపేస్తున్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో ఈ ముగ్గురూ కనీసం నోరు మెదపడం లేదు. కేంద్ర మంత్రుల నుంచి స్థానిక బీజేపీ నేతల వరకూ అందరూ లడ్డూ వివాదం విషయంలో జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటూ ఈ ముగ్గురూ మాత్రం నోరు కుట్టేసుకుని, కట్టేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వీరు తమ బాస్ జగనే అనుకుంటున్నట్లుగా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/thouse-three-leaders-did-not-change-39-185908.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.