స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 19, 2023

Advertisement

1.ఢిల్లీ వాసులను పాములు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలలో పాములు కొట్టుకు వస్తుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది.   రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోనే ఏకంగా పాతిక పాములను పట్టుకున్నారంటే   తీవ్రత అర్ధమౌతోంది.

...............................................................................................................................................

2. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తామని  లోకేష్ అన్నారు. .కొండపి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  జగన్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.  

..................................................................................................................................

3.  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన ఆయన తాము విపక్షంలో ఉన్నప్పుడూ సానుకూల రాజకీయాలు చేశామే తప్ప విదేశాల నుంచి సహకారం తీసుకోలేదని చెప్పారు.  

........................................................................................................................................

4.ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైఅట్రాసిటీ కేసు నమోదుకు  చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి ఎస్సీలను అవమానించేలా మాట్లాడారంటూ చిత్తూరు జిల్లా కోర్టులో మాజీ జడ్డి రామకృష్ణ దాఖలు చేసిన ప్రైవేటు కేసుపై చిత్తూరు కేసు బీ కొత్త కోట పోలీసులకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి విచారణ నివేదిక అందించాలని ఆదేశించింది. 

..................................................................................................................................

5.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,   సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

..................................................................................................................................

6. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఆయన ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమన్నారు. మోడీ  విదేశాంగ విధానం బాగుందన్నారు.

..................................................................................................................................

7.   రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి తప్పించాలంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాశారు.  రేవంత్ రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అవమానించారనీ, అలాగే ప్రజలను కులాల పేరుతో కించపరుస్తున్నారనీ ఆ లేఖలో ఆరోపించారు.

..................................................................................................................................

8. ప్రముఖ రచయత శ్రీరమణ కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. మిథునం,మరియు ఎన్నో కథలు,నవలల రచయిత శ్రీ శ్రీ రమణ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన రాసిన మిథునం కథ  అదే పేరుతో సినీమాగా వచ్చింది.  

...................................................................................................................................

9. హైదరాబాద్ నగరాన్ని  ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా  వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచీ కురిసిన వర్షానికి పలు తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  

..................................................................................................................................

 

10.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అంటూ జూలై 18న శ్రీవారిని 64వేల మంది దర్శించుకున్నారు. 24 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  హుండీ ఆదాయం మూడు కోట్ల 6 లక్షలు వచ్చింది.

..................................................................................................................................

11. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది.  బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్,   వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. 

..................................................................................................................................

12.  టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం   వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది.   టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్  జంగా నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

..................................................................................................................................

13. పరువునష్టం కేసులో   సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది.  చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని  అమ్ముకుంటున్నారని  జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

14. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి  జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు, ముఖ్య అధికారుల‌తో మాట్లాడారు. సీనియర్ అధికారులతో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

..................................................................................................................................

15. ఏపీలో  పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్​డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయన్నారు.

..................................................................................................................................

16. ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందు కోసం రైల్వే టికెట్‌ బుకింగ్‌లో  మార్పులు తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో  టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

..................................................................................................................................

 

17. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ఈ నెల 21న  బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి  నేడు స్వదేశానికి చేరుకోనున్నారు. 

..................................................................................................................................

18. ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. 

19. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్డులను స్థానిక   ప్రజాప్రతినిధుల ద్వారా  లబ్ధిదారులకు అందించనున్నారు. 

......................................................................................................................................................

20. ఏపీలో  వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. 

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.