Publish Date:Jul 24, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడును మరింత పెంచింది. ఈ కేసులో నిందితులు అయిన ఎనిమిది మంది విదేశాలలో ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. విదేశాలలో తలదాచుకున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసుందుకు రంగం సింద్ధం చేసింది.
ఈ కేసులో కీలకంగా ఉన్న ఎనిమిది మంది నిందితులు దుబాయ్, ధాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్. సైమన్ ప్రసన్న, ప్రద్యుమ్నలు దుబాయ్ లోనూ, ఇక అవినాష్ , అనిరుధ్ రెడ్డిలు ధాయ్ ల్యాండ్ లోనూ ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ధాయ్ ల్యాండ్ కు పారిపోయిన అవినాష్, అనిరుథ్ రెడ్డిలు వారిపై కేసు నమోదు అయిన తరువాత పరారీ అయ్యారు. ఈ ఎనిమిది మందిని భారత్ కు రప్పించేందుకు సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే విదేశాంగ శాఖకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు. దుబాయ్, థాయ్ ల్యాండ్ కు పరారైన ఈ నిందితులను భారత్ కు ఆయా దేశాలతో ఉన్న మ్యూచువల్ లీగల్ ట్రీటీస్ ద్వారా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా విదేశాంగ శాఖకు సిట్ అధికారులు లేఖ రాశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-speedup-ap-liquor-scam-case-investigation-25-202677.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.