నా గురించి వర్రీ కాకండి: ఏ.బి. వెంకటేశ్వర రావు

Publish Date:Feb 9, 2020

Advertisement

కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ.పీ. సర్కార్

ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు గా వ్యవహరిస్తోంది.

జగన్ సర్కార్.... ఏమిటీ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలు... నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ అదనపు డి.జి. గా ఒక వెలుగు వెలిగిన ఏ.బి. వెంకటేశ్వర రావుతో  ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన విధానం అసలేమాత్రం బాలేదనేది నిపుణుల అభిప్రాయం. అవును, ఏ.బి. రక్షణ పరికరాలు కొనడం మాత్రమే కాదు... 23 మంది ఎం.ఎల్.ఏ.  లను కొనడంలో కూడా కీలక పాత్ర పోషించారు... కాదనలేము.... ప్యానెల్ లో నిపుణుడు అయిన అధికారిని మార్చి తన పేరు మాత్రమే ఉండాలి అని చూసుకున్న సర్క్యులర్ ఉంది. ఇదీ కాదనలేం. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కనుగోలు చేసి, నాయుడు పట్ల తన ప్రభు భక్తిని చాటుకున్నారు ...ఇది జగమెరిగిన సత్యం..ఇందులోనూ ఎలాంటి వివాదం లేదు..కానీ, ఇవన్నీ చేసింది ఆయన తన ప్రభుత్వానికి మీ నుంచి..అంటే వై.ఎస్.ఆర్.సి.పి . నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త లో భాగంగానే అనే విషయం మీరు గుర్తించాలి. అసలు లోగడ , ఏ ప్రభుత్వమైనా ఇలా కక్ష గట్టి అధికారులను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయా.... మీ తండ్రి హయాంలో ..చంద్రబాబు నాయుడు భక్తులైన అధికారులకు కూడా సముచిత ప్రాధాన్యం లభించిన సంగతి మీకు తెలియదా.... చంద్రబాబు నాయుడి కి అత్యంత నమ్మకస్తుడైన సతీష్ చంద్ర చేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్న సమయం లో జలయజ్ఞం బాధ్యతలు అప్పగించలేదా... జగన్ మోహన్ రెడ్డి గారూ... ముఖ్యమంత్రిగా మీరు అందరినీ కలుపుకుని పోవలసిన సందర్భం ఇది... ఇంటా , బయటా శత్రువులను తయారు చేసుకుంటే, రాబోయే ఆపదల నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.

ఇది ప్రతిపక్ష నేత నాయుడిని అభినందించాల్సిన సందర్భం ..ఎందుకంటే, ఎలాంటి అధికారి చేతనైన ఆయన పని చేయించుకునే  తీరు నుంచి మీరు నేర్చుకోవలసిన అవసరం ఏంటో ఉంది. జాస్తి కృష్ణ కిషోర్ లాంటి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆఫీసర్ మీద కేసులు బనాయించిన మీ తీరు చూస్తే, పిడుక్కీ, బియ్యానికి ఒకటే మంత్రమేసే మీ అమాయకత్వమే కనిపిస్తోంది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్ళొవద్దనేంత ఆదేశాలు ఇచ్చేముందు అసలు ఏ.బి. ర్యాంక్ ఏమిటి చూశారా..అన్నీ బావుంది, నాయుడు అధికారం లోకి వచ్చి ఉంటె, ఆయన డి.జి.పి . ఆయ్యేవారు... 40 ఏళ్ళ  సర్వీసు ఉన్న ఆ ఆఫీసర్ ఉన్న పళంగా ఏ విదేశాలకూ పారిపోరు...సెలవు పెట్టి తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వ్యాపకం గా చేసుకున్న ఏ.బి. ఎక్కడికి పారిపోతారు?

ఐదు కారణాలను చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు  విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు, ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు , ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ, విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని కూడా పేర్కొన్నారు. విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ చేశారు. నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణతో పాటు, కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని, విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని, ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని, నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని, కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణలు చేశారు.

వాస్తవానికి ఇవన్నీ భారీ స్థాయి అభియోగాలు. అఖిల భారత సర్వీసు నిబంధలు ఉల్లంఘిస్తే, ఏ.బి. రాజద్రోహానికి పాల్పడినట్టు మీరు భావిస్తే, మన రక్షణ వ్యవహారాలకు భంగం కలిగించేలా ప్రోటోకాల్ నిబంధల కు నీళ్లు వదిలితే ...రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు....సొంతంగా దర్యాప్తు చేయటానికి మీకున్న విశేషాధికారాలు ఏమిటి..లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని మీకు తెలియదా? నిజానికి సస్పెండ్ చేయటమ వరకూ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.... దీనిని ర్యాటిఫై చేయాల్సింది కేంద్రమే.నెలరోజుల లోపు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి చేరవేయాలి.

ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏ.బి. వెంకటేశ్వర రావు 'తెలుగు వన్' తో మాట్లాడుతూ... మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల మానసికంగా తనకు వచ్చిన నష్టమేమీ లేదని, కాబట్టి మరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని కూడా ఏ.బి. చెప్పారు.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.