చిక్కుల్లో వల్లభనేని వంశీ.. విషయమేంటంటే?

Publish Date:Dec 2, 2025

Advertisement

వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లేనా అంటే తాజాగా జరిగిన పరిణామంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ.. అసెంబ్లీకి ఎన్నికైన రెండు సార్లూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో వల్లభనేని వంశీ అవకాశవాదిగా మారి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో పార్టీలు మారడం అసాధారణమేమీ కాదు. అయితే పార్టీ మారిన తరువాత మాత్రం ఆయన వ్యవహార శైలి అసాధారణంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 

ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వంశీ స్వయంగా గన్నవరం నుంచి ఓడిపోయారు. వైసీపీ హవా కొనసాగిన కాలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి దూరం కావడంతో పరాజయం పాలై మాజీ అయిపోయారు. అయితే గతంలో చేసిన తప్పులు వదలవుగా.. ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదుగా? అందుకే వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వంశీకి ఆ కేసులు చుట్టుముట్టాయి. దాడులు, దౌర్జన్యాలు, మోసం, కబ్జా ఇలా పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు వంశీపై ఉన్నాయి. వీటిల్లో గన్నవరం తెలుగుదేశం కార్యాలంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టై ఏకంగా 137 రోజులు రిమాండ్ ఖైదీలో కటకటాల వెనుక గడిపి బెయిలుపై బయటకు వచ్చారు. 

అయితే తాజాగా అదే కేసులో నిందితులై ఇంత కాలం పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరులలో ఇద్దరిని కోర్టు రిమాండ్ కు పంపింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్నవంశీ అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వారిరువురూ ఆ వారెంట్ వెనక్కు తీసుకోవాలని కోరుతూ  విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఇరువురూ కోర్టులో సరెండర్ అయ్యారు.

వారి అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయిన  తరువాత వారిరువురినీ ఈ నెల 15 వరకూ రిమాండ్ కు పంపిసతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిరువురినీ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా నలుగురు పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇరువురిని కోర్టు రిమాండ్ కు పంపడంతో ఈ కేసులో బెయిలుపై ఉన్న వంశీకి కూడా చిక్కులు తప్పవని అంటున్నారు.  ఈ ఇరువురి అరెస్టు ప్రభావం బెయిలుపై ఉన్న వంశీపై పడటం ఖాయమంటున్నారు. 

By
en-us Political News

  
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.