స్కూల్స్కి సెలవులు పొడిగింపు.. 30 వరకు పండగ చేస్కోండి..
Publish Date:Jan 16, 2022
Advertisement
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈనెల 20 వరకూ రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై నిషేధం ఉంది. దీంతో స్కూల్స్కు కూడా 20వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తారని భావించారు. అయితే, ఏకంగా రెండు వారాల పాటు హాలిడేస్ పెంచడంతో విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. జనవరి నెలలో కేవలం ఒక వారం మాత్రమే క్లాసులు జరిగాయి. ఇక జనవరి 30 తర్వాతనైనా రీఓపెన్ అవుతాయా? అప్పటికీ కేసులు తగ్గకపోతే మరోసారి పొడిగింపు తప్పకపోవచ్చు. సెలవుల పెంపుతో స్టూడెంట్స్ సంబరపడుతున్నా.. పేరెంట్స్ నుంచి మిక్స్డ్ ఓపినియన్ వినిపిస్తోంది. ఇప్పటికే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నామని.. అదేదో ముందే చెబితే బాగుండేదని అంటున్నారు. ఇక, తెలంగాణ మాదిరే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పెంచే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇప్పటికే ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ కానున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి సెలవులకు హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లిన ప్రజలు.. ఆదివారం సాయంత్రం తిరిగొచ్చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో.. సెలవులు మరికొన్ని రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు ఇష్యూ చేశారు.
http://www.teluguone.com/news/content/sankranti-holidays-increased-in-telangana-39-130232.html