‘రాజ్యాంగ హత్య దినం’ సబబేనా?

Publish Date:Jul 15, 2024

Advertisement

కారణాలు ఏమైనప్పటికీ, 1975, జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని ప్రభావం, పర్యవసానాల సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఇందిరాగాంధీ కూడా ఆ తర్వాత తాను ఎమర్జెన్సీని ప్రకటించడం తప్పేనన్న విషయాన్ని అంగీకరించారు. ఎమర్జెన్సీని విధించిన తప్పుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆ తర్వాత ఆమెను క్షమించి మళ్ళీ అధికారం ఇచ్చారు. ఇందిరాగాంధీ అధికారంలో వుండగానే, ప్రధానమంత్రిగా అందరి నుంచి జేజేలు అందుకుంటున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. అదంతా ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం.. మానిపోయిన గాయం. ఇప్పుడు ఆ గాయాన్ని అధికారికంగా రేపి రాజకీయ లబ్ధిని పొందాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది.

ఎమర్జెన్సీని ప్రకటించినందుకు ఇందిరాగాంధీని ఇప్పటికీ నోరున్న ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వుంటారు. బీజేపీ వర్గాలయితే ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తూనే వుంటారు. ఇందిర,  నెహ్రూ దేశానికి చేసిన సేవలు బీజేపీ వాళ్ళకి ఎప్పుడూ కనిపించవు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శించడానికి బీజేపీకి చెందిన గల్లీ కార్యకర్త అయినా నేను సిద్ధం అంటూ రెడీ అయిపోతాడు. ఇలా ఒక పార్టీ వేదికగా ఎవరయినా, ఎవర్నయినా విమర్శించవచ్చు. కానీ, ప్రభుత్వం పరంగా మాత్రం అలా చేయడానికి చాలా పరిమితులు వుంటాయి. ఆ పరిమితులన్నీ బీజేపీ ప్రభుత్వం దాటింది. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్య దినం) పేరిట అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం కంటే దారుణమైన చర్య అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనాడో ఒక మాజీ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అధికారికంగా విమర్శించే విధంగా చేయడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు బీజీపీకి అధికారం వుంది కాబట్టి, తనను ఆపే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి ‘రాజ్యాంగ హత్య దినం’ అంటూ ప్రకటించారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో వస్తుంది. అప్పుడు మోడీ నోట్ల రద్దు చేసిన రోజును ‘అత్యంత తలతిక్కల దినం’ అనో, మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ‘అత్యంత విషాదాత్మక దినం’ అని ప్రకటిస్తే ఎలా వుంటుంది? ఇందిరాగాంధీని కానీ, మోడీని కానీ వ్యక్తిగతంగా ఎంతయినా విమర్శించవచ్చు. ఇలా  ‘హద్దులు’ మీరి ఆ విమర్శలకు ‘అధికారం’ కల్పించడం ఎంతవరకు సబబు అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులను జనం దృష్టిలో పలుచన చేసే విధంగా నిర్మించే సినిమాలకు మద్దతు ఇస్తోంది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని పైకి తీసుకొచ్చి, దానికి అధికారికంగా ఒక పేరును ఇవ్వడం అనేది త్వరలో రాబోతున్న ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాకి హైప్ తేవడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా సెప్టెంబర్ 6, 2024న విడుదలవుతోంది. ఇందిరా గాంధీ మీద తమ ద్వేషాన్ని అధికారికంగా వెళ్ళగక్కడంతోపాటు కంగన రనౌత్ నిర్మాత కూడా అయిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మీద నేటితరం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్లానులో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకోకూడని నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.