ఈ ట్రిపులార్ భలే ట్రెండీ గురూ!

Publish Date:Aug 13, 2022

Advertisement

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా,   వైసీపీ అధినేతను, ఆ పార్టీ నేతలను తూర్పారపడుతూనే ఉంటారు.   తాజాగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్  న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం, జరుగుతున్న పరిణామాలు, వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తన దైన స్టైల్ లో స్పందించారు.

గోరంట్ల మాధవ్ కు మద్దతిచ్చి, 500 కార్లతో ఊరేగింపుగా వైసీపీ నేతలు తీసుకెళ్తారా? అంటూ రఘురామ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాధవ్ ను స్వాగతించమేంటని నిలదీస్తున్నారు. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పిన తనను దేశ ద్రోహిగా చిత్రీకరించి, చిత్రహింసలు పెట్టి, తనను సొంత ఊరికి వెళ్లనివ్వకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న మా పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు  అఖండ స్వాగతం చెప్పేందుకు రెడీ అవడం ఏమిటని నిలదీస్తున్నారు. ఆ అశ్లీల వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ కాదని సెంట్రల్ ల్యాబ్ పరీక్షించి నిర్ధారించి చెప్పిన తర్వాత వీరోచితంగా వెళ్తే బాగుంటుందని రఘురామ అభిప్రాయపడ్డారు. గోరంట్ల మాధవ్ నిర్దోషే కావచ్చు.. కానీ ఆయన నిర్దోషి అని రుజువయ్యే వరకు ఆగలేని మీరు నన్ను ఆపేస్తారా? అంటూ రఘురామ విమర్శించారు.

మనం చేసే అభివృద్ధితో దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని జగన్ ఎప్పుడూ చెబుతుంటారని రఘురామ గుర్తుచేస్తూ.. అవును.. మాధవ్ అశ్లీల వీడియో వల్ల దేశమంతా మీ వైపే చూస్తోందంటూ జగన్ సెటైర్లు గుప్పించారు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంటే దేశమంతా మీ వైపు చూడక ఏం చేస్తుంది అని కామెంట్ చేశారు.. గోరంట్ల మాధవ్ న్యూఢ్ వీడియో కాల్ పై ప్రజల్లో గూడుకట్టుకున్న అనుమానాలను తొలగించేందుకు ప్రతిష్టాత్మక   పరిశోధన కేంద్రానికి పంపి నివేదిక తెప్పించాలని రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ కు సూచిచారు. మీకు కుదరకపోతే   తానే ప్రతిష్టాత్మక ప్రైవేట్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పిస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు.

రఘురామకృష్ణరాజు తన సతీసమేతంగా శుక్రవారంనాడు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ముర్ముకు శుభాకాంక్షలు చెప్పారు. పనిలో పనిగా తనను వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిన వైనాన్ని, పోలీసుల ఓవర్ యాక్షన్ గురించి, గోరంట్ల మాధవ్ వ్యవహారంపైన రాష్ట్రపతికి వివరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కారు టైర్లు పంక్చర్ అయిన వైనం పైనా రఘురామ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సీఎం తల్లికి సంబంధించింది కాబట్టి కారు ప్రమాదంపై జగన్ స్పందించాలని కోరారు. ఆమె ప్రయాణించిన కారు రెండు టైర్లు ఒకేసారి పంక్చర్ అవడం వెనక కుట్ర ఏమైనా ఉందా అన్నది  తేల్చాలనేది రఘురామ డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ జగన్ మాట్లాడిన వైనాన్ని రఘురామ ప్రస్తావించి, ఇప్పడు జగన్   హయాంలో  ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై 2 వేల కోట్ల అదనపు భారం మోపేందుకు సీఎం సిద్ధం కావడాన్ని తప్పుపట్టారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో కొనసాగించేలా చూడాలని పార్లమెంటులో కోరినందుకు తనపై అనర్హత వేటు వేయాలని చూశారని రఘురామ ఎత్తి పొడిచారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లేందుకు స్థానిక ఎంపీగా రైలులో బయలుదేరిన రఘురామ మార్గ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోవడం సంచలనం అయింది. తనను చంపేందుకు రైలులో కొందరు అనుసరిస్తున్నారంటూ రఘురామ అప్పుడు చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. మొత్తానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడేందుకు, విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉంటున్నారు. తద్వారా నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నారు.

By
en-us Political News

  
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.