Publish Date:Oct 16, 2019
వాస్తవానికి దావూద్ గ్యాంగ్ బినామీ ఆస్తులు చాలా రోజుల క్రితమే బయటపడ్డాయి. కానీ డీ గ్యాంగ్ తో లింకున్న నేతల పేర్లు మాత్రం ఇప్పుడే బయటకొచ్చాయి. ప్రఫుల్ పటేల్ కు మిలీనియం డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ప్రఫుల్ తో పాటు ఆయన భార్య వర్ష ఇందులో భాగస్వాములు, ముంబైలో విలాసవంతమైన ఏరియాలో దావూద్ కుడి భుజం ఇక్బాల్ మిర్చికి వందల కోట్ల విలువైన స్థలముంది. రెండు వేల
ఏడులో మిలీనియం డెవలపర్స్ కు మిర్చి కుటుంబానికి మధ్య డీల్ కుదిరింది. ఇక్బాల్ మిర్చికి చెందిన స్థలంలో ప్రఫుల్ పటేల్ సంస్థ సీజే హౌస్ అని ఖరీదైన అపార్ట్ మెంట్ ను నిర్మించింది. అందులో రెండు ఫ్లోర్ లను ప్రతిఫలంగా ఇక్బాల్ మిర్చి కుటుంబానికి కేటాయించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ లలో ప్రఫుల్ పటేల్ స్వయంగా సంతకం చేశారు. అదే పత్రాలపై ఇక్బాల్ మిర్చి భార్య హజరా కూడా సంతకాలు చేశారు. రెండు వేల ఏడు నాటి డాక్యుమెంట్ లను ఈడీ సంపాదించింది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయం పై ఇక్బాల్ మిర్చి కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. వాళ్ళను ప్రశ్నించినప్పుడు ప్రఫుల్ పటేల్ పేరు బయటకు వచ్చింది.
అయితే రెండు వేల ఏడు నాటి విషయాలను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రఫుల్ పటేల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందటానికి ఈ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కావాలనే డాక్యుమెంట్ లను మీడియాకు ఈడీ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇక్బాల్ మిర్చితో తాను ఎలాంటి ల్యాండ్ డీల్ చేయలేదంటున్నారు ప్రఫుల్ పటేల్. రెండు వేల ఏడులో ఈ డీల్ కుదిరినప్పుడు ఇక్బాల్ మిర్చి భార్య హజరా పై ఎలాంటి కేసులు లేవన్నారు. అంతా చట్టపరంగానే జరిగిందన్నారు.
హజ్రా విధిగానే ఆదాయపు పన్ను చెల్లించారని కూడా తెలిపారు. తనపై కేసులో వెనుక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారు ప్రఫుల్ పటేల్. కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈడీ విచారణకు ఈ నెల పధ్ధెనిమిది వ తేదీన హాజరవుతానని తెలిపారు ప్రఫుల్ పటేల్. పోలింగ్ కు కేవలం ఐదు రోజుల ముందు ఆయనకు ఈడీ పిలుపు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు.
మన్మోహన్ కేబినెట్ లో ఆయన విమానయాన శాఖ నిర్వహించారు. ఎయిర్ బస్ కుంభకోణంలో ఆయన్ను ఇప్పటికే సీబీఐ ఈడీ అధికారులు విచారించారు. తాజాగా దావూద్ గ్యాంగ్ తో బిజినెస్ డీల్స్ లో ఆయన చిక్కుకోవడం ఎన్సిపికి పెద్ద దెబ్బగా మారింది.ఇక ఈ టేన్షన్ నుంచి ప్రఫుల్ పటేల్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/praful-patel-25-90142.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.