పంద్రాగస్టు పండుగ వేదికగా.. రాజకీయ ప్రచార సభలు

Publish Date:Aug 17, 2022

Advertisement

స్వాతంత్రం వచ్చిందని సభలు చేసి సంబరపడిపోతే సరిపోదన్నాడు మహాకవి శ్రీశ్రీ.. అయితే నేటి రాజకీయ నాయకులు మహాకవి శ్రీశ్రీ మాటను వేరేగా అర్ధం చేసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సంబరాలతో సరిపెట్టేయకుండా రాజకీయ విమర్శలకు వేదికగా చేసేసి తాము ఆజాదీ కా అమృతోత్సవ్ ను కేవలం సంబరాలతో సరిపెట్టేయలేదనీ, వాటిని విమర్శల మసాలా జోడించామని చెబుతున్నారు.

లేకుంటే జాతి మొత్తం విభేదాలను, అంతరాలను, తారతమ్యాలనూ మరచి చేసుకోవలసిన ఈ పండుగను, వేడుకలు రాజకీయ విమర్శలకు వేదికగా మార్చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను రాజకీయ వేదకగా మార్చి తమాషా చూశారు. ముందుగా మోడీ విషయానికి వస్తే.. ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని మోడీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశం సాధించిన విజయాలు, ఘనతల గురించిన ప్రస్తావన కన్నా.. అవినీతి, వారసత్వ పాలనపై విమర్శలకే పెద్ద పీట వేశారు. ప్రతిపక్షాలు ఏం చేసినా అది అవినీతి, వారి అధికారం అంతా వారసత్వ మయం అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది.

మొత్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రసంగం అంతా స్వోత్కర్ష, పరనిందగా సాగింది. దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న తన పాలనకు ప్రజాశీర్వాదం కావాలని స్వాతంత్ర్యద్యమం సందర్భంగా జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రధానిగా మోడ ఎర్రకోట బురుజులపై నుంచి జెండా ఎగురవేయడం ఇది తొమ్మిదో సారి. దేశంలో అవినీతి నిర్మూలనకు తాను మొదటి సారి జెండా ఆవిష్కరించినప్పటి నుంచి తొమ్మిదో సారి జెండా ఎగురవేస్తున్న నాటి వరకూ ఆయన చేసింది ఏమిటో చెప్పడానికి ఇంత కంటే మంచి సందర్భం మరొకటి ఉండదు.. కానీ మోడీ ఈ సందర్భాన్ని అందుకు కాకుండా విపక్షాలపై పరోక్షంగా నిందలు వేయడానికీ, విమర్శలు గుప్పించడానికి ఎన్నుకున్నారు.

అంటే స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభ వేళ ఆయన విపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.  ఎనిమిదేళ్లుగా దేశంలో తమ పార్టీ అధికారాన్ని విస్తరించడానికి ఇచ్చిన ప్రాధాన్యం మోడీ దేశంలో అవినీతి నిర్మూలనకు ఇవ్వలేదని పరిశీలకుల విమర్శలను ఆయన పట్టించుకోలేదు. ఆయన దృష్టిలో అవినీతి నిర్మూలన అంటే ప్రత్యర్థి పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులేనని విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాజకీయ వేధింపులనే మోడీ అవినీతి నిర్మూలనగా సూత్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నాయి.   

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయనదీ ఒకే అజెండా.. అది మోడీపై విమర్శలు. తెలంగాణకు మోడీని శత్రువుగా చూపడానికే ఆయన స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేదికను ఎంచుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం, ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, ప్రజాసమస్యలు, వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల కారణంగా సంభవించిన నష్టం ఇత్యాది అంశాలపై ఆయన దృష్టి సారించకుండా కేవలం రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడం, మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడానికే కేసీఆర్ ప్రసంగం పరిమితమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇక ఏపీ ముఖ్యమంత్రి అయితే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వోత్కర్షకు ఇచ్చినంత ప్రాధాన్యం మరే  ఇతర అంశానికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆజాదీ కా అమృతోత్సవ్ సంబరాలకు రాజకీయ రంగు పూసి సమావేశాలను ఎన్నికల ప్రచార సభలుగా మార్చేసిన వైనంపై ప్రజలలో నిరసన వ్యక్తమౌతున్నది.  స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటేలా కాకుండా రాజకీయ ప్రచారం కోసం అధికార పార్టీలు ఈ వేడుకలను వేదిక చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.