Publish Date:Jul 22, 2024
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేష్.. సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించడంలో తనకు తానే సాటి, పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్య చిటికెలో పరిష్కారం అయిపోతోంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ ఏ మాత్రం జాగు లేకుండా స్పందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో దివ్యాంగుల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్న జీవోను సవరించడంలో కానీ, ఎక్కడో గల్ఫ్ దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వ్యక్తిని రోజుల వ్యవధిలో స్వరాష్ట్రానికి చేర్చడంలో కానీ లోకేష్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ తీసుకుంటున్నారు. తన నివాసంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా, ఈమెయిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా స్పందిస్తున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా మర్లమాడి గ్రామానికి చెందిన విద్యార్థులు ఒక ఈమెయిల్ ద్వారా తమ గ్రామానికి బస్సులేకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవస్థలను లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే వెంటనే ఆ గ్రామానికి బస్సు వచ్చేసింది. విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోయాయి. అంతే కాదు తన సహాయం కావలసిన వారెవరైనా సరే hello.lokesh@ap.gov.in అడ్రస్ కు ఈమెయిల్ చేస్తే చాలని లోకేష్ చెబుతున్నారు.
లోకేష్ ఒరవడిని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కూటమి మంత్రులు అనుసరిస్తున్నారు. చిటికెలో సమస్యలు పరిష్కరంచేస్తున్న లోకేష్ వేగాన్ని తాము అందుకుంటామని చెబుతున్నారు. ఇలా లోకేష్ సహచర మంత్రులకు ఒక టాస్క్ ఫిక్స్ చేశారనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-problems-solve-in-no-time-25-181216.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.