వాక్సినేషన్‌కు వన్ ఇయర్.. గ్రేట్ ఇండియా అచీవ్‌మెంట్‌..

Publish Date:Jan 16, 2022

Advertisement

దేశ వ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం ఇదే రోజున  దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో ఈ రకమైన అత్యంత భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు లేదని తెలిపారు. గత ఏడాది జనవరి, 16న ఆరోగ్య కార్యకర్తలకు తొలుత  ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తర్వాత ఫిబ్రవరి, 2న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో 60ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి, 1న వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. గత ఏడాది, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ అమలు జరుగుతూ వస్తోంది.  ఈ నెల 10వ తేదీ నుంచి ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికీ ఫ్రికాన్షరీ డోస్ వేస్తున్నారు. కాగా..దే శ వ్యాప్తంగా  అమలు జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 156 కోట్ల 63 లక్షల డోసులు పంపిణీ చేశారు. నిన్న 56 లక్షల 29 వేల డోసులు వేశారు. 42 లక్షల 69 వేల ప్రికాషన్ డోసులు ఇప్పటి వరకు వేశారు. 

కాగా,ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూరైన సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ శాస్ర్తవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలను, దేశ ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ గా ప్రశంసలు అందుకుందని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 
అలాగే, దేశ వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో  నిరంతర కృషిని అందించిన లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, వైద్యులు, శాస్ర్తవేత్తలు, ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కృతజతలు తెలిపారు. గడచిన సంవత్సరమంతా దేశం యావత్తు కొవిడ్-19 కు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడిందని , ఈ రోజు వ్యాక్సినేషన్ వార్షికోత్సవం సందర్భంగా జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 135 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో ప్రారంభించిన కీలకమైన వ్యాక్సినేషన్ యాత్ర విజయవంతమై ప్రపంచమంతటా అభినందనలు అందుకున్నదని ఆయన అన్నారు. 
 

By
en-us Political News

  
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి.
మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు.
ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.