ఏపీలో సెలవుల పెంపు!.. మంత్రి ప్రకటన...
Publish Date:Jan 16, 2022
Advertisement
తెలంగాణలో రోజుకు 2వేల పైచిలుకు కరోనా కేసులు. అదే ఏపీలో రోజూ నాలుగున్నర వేలకు పైగా కేసులు. రెండు వేల కేసులొస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకైనా మంచిదని విద్యార్థులకు సంక్రాంతి సెలవులు పెంచింది. జనవరి 30 వరకూ హాలిడేస్ ప్రకటించింది. ఇక, రోజూ సుమారు 5వేల కేసులు వస్తున్న ఏపీలో మాత్రం సెలవులు పెంచే ప్రసక్తేలేదంటోంది ప్రభుత్వం. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి సురేశ్ క్లారిటీ ఇచ్చేశారు. కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. తాజాగా, గుంటూరు జిల్లా కాకుమానులో ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా .. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే ఆలోచన ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. గతంలో కూడా ఇంతే. సెకండ్ వేవ్ సమయంలో విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టేందుకు తెగ ప్రయత్నించింది ఏపీ సర్కారు. ఆఖరికి హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు కూడా అంతే. ఓవైపు కొవిడ్ విజృంభిస్తుంటే.. సెలవులు పెంచేందుకు ససేమిరా అంటోంది. అసలే థర్డ్వేవ్ పిల్లలపైనే విరుచుకుపడుతోంది. ఈ సమయంలో మళ్లీ స్కూల్స్కి పంపితే పరిస్థితి ఎలా ఉంటుందోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. జగనన్న సెలవులు ఇవ్వకపోతారా అని భావించినా.. అలాంటిదేమీ లేదని మంత్రి స్టేట్మెంట్తో క్లారిటీ రావడంతో కలవరం చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/no-sankranti-holidays-extend-in-ap-39-130258.html