విజయనగరంలో వైసీపీ సామాజిక న్యాయభేరి రద్దు.. నెపం వర్షం మీద తోసేస్తున్న మంత్రులు

Publish Date:May 27, 2022

Advertisement

విజయనగరం జిల్లాలో జరగాల్సిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రద్దైంది. మంత్రి బొత్ ఇలాకాలోనే సామాజిక న్యాయ భేరి వైఫల్యం ఆ పార్టీని తీవ్ర నిరాశలో ముంచేసింది. సామాజిక న్యాయ భేరి విజయనగరంలో రద్దు కావడానికి వర్షం కారణమంటూ నేతలు నెపం వర్షం మీదకు తోసేస్తున్నారు. విజయనగరంలో భారీ వర్షం కురిసింది నిజమే.

కానీ వర్షం ఆగిపోయిన తరువాత 17 మంది మంత్రులూ వేదిక మీదకు వెళ్లినా కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరూ లేకపోవడంతో గత్యంతరం లేక సభను రద్దు చేసుకుని మంత్రులు బస్సులో విశాఖ వెళ్లిపోయారు. 

మంత్రుల బస్సు విజయనగరంలోనికి ప్రవేశించే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వైసీపీ కష్టపడి సమీకరించిన జనం ఇళ్లకు వెళ్లి పోయారు. సభా స్థలి వద్దకు మంత్రులు చేరుకునే సమయానికి కూడా వర్షం కురుస్తూనే ఉండటంతో మంత్రులు బస్సులోనే ఉండిపోయారు. తరువాత వర్షం తెరిపిచ్చినప్పటికీ, మంత్రులు వేదిక మీదకు చేరుకున్న తరువాత కూడా సభ స్థలి ఖాళీగానే దర్శనమివ్వడంతో నిరాశ చెందిన మంత్రులు సభను రద్దు చేశారు.  తొలి రోజే సభకు స్పందన కరవవ్వడం చూస్తుంటే ఈ యాత్ర ముందు ముందు ఎలా సాగుతుందా అన్నా అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

కాగా  మొత్తంగా వైసీపీ చేపట్టిన బస్సు యాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలన మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే లక్ష్యంతో తలపెట్టిన ఈ యాత్రను కేవలం బహిరంగ సభలకే పరిమితం చేశారు.

అంతే కానీ బస్సులో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కాలనీలకు, వాడలలోకి వెళ్లాలి కానీ, వారిని బహిరంగ సభలకు సమీకరించడం అంటే గడపగడపకూ అనుభవంతో ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించేయడానికే నిర్ణయించుకున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీ వాడలకు దూరంగా  బస్సు యాత్ర జరుగుతున్న తీరు పట్ల ప్రజలలో కూడా ఆసక్తి కరవైంది. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.