చిరు ఇమేజ్‌కి మెగా డ్యామేజ్‌..

Publish Date:Jan 16, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలనుంచి తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్య  సభ టికెట్ ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సీటుపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చిరంజీవి కుండబద్ధలు కొట్టేశారు.ఆయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా భేటీ అవడం వెనక ఏదో ఉందనే వ్యూహగానాలు రాజకీయ, సినిమా వర్గాల్లో ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉన్న ఎవరిని కదిల్చినా, నిప్పు లేనిదే పొగరాదనే సామెతనే గుర్తు చేస్తున్నారు. అంటే, చిరంజీవి ఖండనను నమ్మేందుకు సినీ, రాజకీయ జనాలు సిద్ధంగా లేరని తెలుస్తోంది.  

నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినవస్తూనే ఉంది. ఒక దశలో ఆయన పేరు ఏపీ-పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్త లొచ్చాయి.  అదే సమయంలో ఏఐసీసీ - ఏపీ వ్యవహారాల ఇంచార్జి, ఒమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్పార్టీలోనే లేరని అనడం , అందుకు పీసీసీ ఆయన కాంగ్రెస్’లోనే ఉన్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా, అప్పట్లో చిరంజీవి పెదవి విప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననో లేననో  చెప్పలేదు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారే కానీ, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామచేయలేదు. కనీసం అలాంటి ప్రకటన ఏది రాలేదు.   

అంతేకాదు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ, రాజకీయలాకు పూర్తిగా దూరంగా లేరు. ఒక విధంగా వైసీపీ దగ్గరవుతున్నసంకేతాలు కూడా  ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిత విధానానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి బహిరంగంగానే సమర్ధించారు. ఒక విధంగా, వైసీపీ నయకులు , అభిమానులకంటే ఎక్కువగా జగన్ రెడ్డి వినిపించిన వికేంద్రీకరణ వాదాన్ని సమర్ధించారు. జగన్ రెడ్డి మాటే చిరంజీఉ పలుకుగా వినిపించారు. 

అలాగే, కొవిడ్ వాక్సినేషన్ విషయంలోనూ జగన్ రెడ్డిని అభినందనలలో ముంచెత్తారు. దేశంలో చాల రాష్ట్రలలో ఒకే రోజున రికార్డు స్థయిలో కోవిడ్ తెకాలు వేశారు. అయితే అదేదో ఒక్క ఏపీలోనే జరిగినట్లు, అందుకు జగన్ రెడ్డి ‘విజన్’ కారణమని చిరంజీవి, మళ్ళీ వైసీపీ నేతలను మించి జగన్ రెడ్డిని అభినందించారు.  అంతే కాదు, అదే సమయంలో చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారని,  వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్ళే పనిలో ఉన్నారని వచ్చిన వార్తలను ఆయన గానీ,ఆ ఆయన తరపున ఇంకొకరు గానీ, ఖండించలేదు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చిరంజీవివేలు పెట్టారు. ఇటు మూడు రాజదానుల ధుల విషయంలో అయితే నేమీ, స్టీల్ ప్లాంట్ వ్యవహాంలో అయితే నేమీ, చిరంజీవి, వైసీపీ స్టాండ్’నే వినిపించారు. సో .. జగన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని అంటే కాదనేందుకు కారణం కనిపించదు.

అదేగాక, చిరంజీవి రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఆయనకు రాజకీయ నిబద్దత ఉందని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో తెలుగు దేశం పార్టీని ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించెందుకే ఆయన వైఎస్సార్ ‘చే’యూతతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయినా ప్రజలు, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సినిమా అభిమానులు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. నిజానికి, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవచ్చును, కానీ, గణనీయ విజయాన్నే సాధించింది. 

ఓ వంక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరో వంక రాష్ట్రంలో వేళ్ళూనిన టీడీపీ, తెరాస, వామ పక్షాలలో కూడిన మహా కూటమి పోటీని ఎదుర్కుని, అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయినా, చిరంజీవి లక్షల మంది ఆశలను వమ్ము చేస్తూ,కేవలం కేంద్రంలో సహాయ  మంత్రి పదవికోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేశారు. కాంగ్రెస్ ఓపోయిన తర్వతా సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గంగలో వదిలేసి,టాలీవుడ్ తెరకు చేరుకున్నారు. సో .. ఇప్పుడు మళ్ళీ, సంక్షోభంలో ఉన్న సినిమా రంగాన్ని అదే గంగలో ముంచేసి మళ్ళీ రాజకీయ పునరావాసం వెతుక్కుంటున్నారు, అనే అభియోగంలో నిజం లేదని అనలేమని విశ్లేషకులు అంటున్నారు.  

అయితే, చిరంజీవి బలహీనతను జగన్ రెడ్డి ఉపయోగించుకుని, వ్యూహత్మకంగానే ఆయన్ని చర్చలకు పిలిచి చిక్కుల్లోకి నెట్టి, అభాసుపలు చేశారని ...అయితే, జగన్ రెడ్డి అన్నంతో పాటుగా వడ్డించిన మరకలు చిరంజీవిని వెంటాడుతూనే ఉంటాయని అంటున్నారు. అయితే అందుకు ఎవరూ చింతించ వలసిన అవసరం లేదు .. నో .. రిగ్రీట్స్ అనికూడా పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.