చిరు ఇమేజ్‌కి మెగా డ్యామేజ్‌..

Publish Date:Jan 16, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలనుంచి తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్య  సభ టికెట్ ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సీటుపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చిరంజీవి కుండబద్ధలు కొట్టేశారు.ఆయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా భేటీ అవడం వెనక ఏదో ఉందనే వ్యూహగానాలు రాజకీయ, సినిమా వర్గాల్లో ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉన్న ఎవరిని కదిల్చినా, నిప్పు లేనిదే పొగరాదనే సామెతనే గుర్తు చేస్తున్నారు. అంటే, చిరంజీవి ఖండనను నమ్మేందుకు సినీ, రాజకీయ జనాలు సిద్ధంగా లేరని తెలుస్తోంది.  

నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినవస్తూనే ఉంది. ఒక దశలో ఆయన పేరు ఏపీ-పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్త లొచ్చాయి.  అదే సమయంలో ఏఐసీసీ - ఏపీ వ్యవహారాల ఇంచార్జి, ఒమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్పార్టీలోనే లేరని అనడం , అందుకు పీసీసీ ఆయన కాంగ్రెస్’లోనే ఉన్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా, అప్పట్లో చిరంజీవి పెదవి విప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననో లేననో  చెప్పలేదు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారే కానీ, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామచేయలేదు. కనీసం అలాంటి ప్రకటన ఏది రాలేదు.   

అంతేకాదు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ, రాజకీయలాకు పూర్తిగా దూరంగా లేరు. ఒక విధంగా వైసీపీ దగ్గరవుతున్నసంకేతాలు కూడా  ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిత విధానానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి బహిరంగంగానే సమర్ధించారు. ఒక విధంగా, వైసీపీ నయకులు , అభిమానులకంటే ఎక్కువగా జగన్ రెడ్డి వినిపించిన వికేంద్రీకరణ వాదాన్ని సమర్ధించారు. జగన్ రెడ్డి మాటే చిరంజీఉ పలుకుగా వినిపించారు. 

అలాగే, కొవిడ్ వాక్సినేషన్ విషయంలోనూ జగన్ రెడ్డిని అభినందనలలో ముంచెత్తారు. దేశంలో చాల రాష్ట్రలలో ఒకే రోజున రికార్డు స్థయిలో కోవిడ్ తెకాలు వేశారు. అయితే అదేదో ఒక్క ఏపీలోనే జరిగినట్లు, అందుకు జగన్ రెడ్డి ‘విజన్’ కారణమని చిరంజీవి, మళ్ళీ వైసీపీ నేతలను మించి జగన్ రెడ్డిని అభినందించారు.  అంతే కాదు, అదే సమయంలో చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారని,  వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్ళే పనిలో ఉన్నారని వచ్చిన వార్తలను ఆయన గానీ,ఆ ఆయన తరపున ఇంకొకరు గానీ, ఖండించలేదు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చిరంజీవివేలు పెట్టారు. ఇటు మూడు రాజదానుల ధుల విషయంలో అయితే నేమీ, స్టీల్ ప్లాంట్ వ్యవహాంలో అయితే నేమీ, చిరంజీవి, వైసీపీ స్టాండ్’నే వినిపించారు. సో .. జగన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని అంటే కాదనేందుకు కారణం కనిపించదు.

అదేగాక, చిరంజీవి రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఆయనకు రాజకీయ నిబద్దత ఉందని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో తెలుగు దేశం పార్టీని ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించెందుకే ఆయన వైఎస్సార్ ‘చే’యూతతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయినా ప్రజలు, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సినిమా అభిమానులు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. నిజానికి, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవచ్చును, కానీ, గణనీయ విజయాన్నే సాధించింది. 

ఓ వంక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరో వంక రాష్ట్రంలో వేళ్ళూనిన టీడీపీ, తెరాస, వామ పక్షాలలో కూడిన మహా కూటమి పోటీని ఎదుర్కుని, అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయినా, చిరంజీవి లక్షల మంది ఆశలను వమ్ము చేస్తూ,కేవలం కేంద్రంలో సహాయ  మంత్రి పదవికోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేశారు. కాంగ్రెస్ ఓపోయిన తర్వతా సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గంగలో వదిలేసి,టాలీవుడ్ తెరకు చేరుకున్నారు. సో .. ఇప్పుడు మళ్ళీ, సంక్షోభంలో ఉన్న సినిమా రంగాన్ని అదే గంగలో ముంచేసి మళ్ళీ రాజకీయ పునరావాసం వెతుక్కుంటున్నారు, అనే అభియోగంలో నిజం లేదని అనలేమని విశ్లేషకులు అంటున్నారు.  

అయితే, చిరంజీవి బలహీనతను జగన్ రెడ్డి ఉపయోగించుకుని, వ్యూహత్మకంగానే ఆయన్ని చర్చలకు పిలిచి చిక్కుల్లోకి నెట్టి, అభాసుపలు చేశారని ...అయితే, జగన్ రెడ్డి అన్నంతో పాటుగా వడ్డించిన మరకలు చిరంజీవిని వెంటాడుతూనే ఉంటాయని అంటున్నారు. అయితే అందుకు ఎవరూ చింతించ వలసిన అవసరం లేదు .. నో .. రిగ్రీట్స్ అనికూడా పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.