చిరు ఇమేజ్‌కి మెగా డ్యామేజ్‌..

Publish Date:Jan 16, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలనుంచి తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్య  సభ టికెట్ ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సీటుపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చిరంజీవి కుండబద్ధలు కొట్టేశారు.ఆయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా భేటీ అవడం వెనక ఏదో ఉందనే వ్యూహగానాలు రాజకీయ, సినిమా వర్గాల్లో ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉన్న ఎవరిని కదిల్చినా, నిప్పు లేనిదే పొగరాదనే సామెతనే గుర్తు చేస్తున్నారు. అంటే, చిరంజీవి ఖండనను నమ్మేందుకు సినీ, రాజకీయ జనాలు సిద్ధంగా లేరని తెలుస్తోంది.  

నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినవస్తూనే ఉంది. ఒక దశలో ఆయన పేరు ఏపీ-పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్త లొచ్చాయి.  అదే సమయంలో ఏఐసీసీ - ఏపీ వ్యవహారాల ఇంచార్జి, ఒమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్పార్టీలోనే లేరని అనడం , అందుకు పీసీసీ ఆయన కాంగ్రెస్’లోనే ఉన్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా, అప్పట్లో చిరంజీవి పెదవి విప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననో లేననో  చెప్పలేదు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారే కానీ, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామచేయలేదు. కనీసం అలాంటి ప్రకటన ఏది రాలేదు.   

అంతేకాదు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ, రాజకీయలాకు పూర్తిగా దూరంగా లేరు. ఒక విధంగా వైసీపీ దగ్గరవుతున్నసంకేతాలు కూడా  ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిత విధానానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి బహిరంగంగానే సమర్ధించారు. ఒక విధంగా, వైసీపీ నయకులు , అభిమానులకంటే ఎక్కువగా జగన్ రెడ్డి వినిపించిన వికేంద్రీకరణ వాదాన్ని సమర్ధించారు. జగన్ రెడ్డి మాటే చిరంజీఉ పలుకుగా వినిపించారు. 

అలాగే, కొవిడ్ వాక్సినేషన్ విషయంలోనూ జగన్ రెడ్డిని అభినందనలలో ముంచెత్తారు. దేశంలో చాల రాష్ట్రలలో ఒకే రోజున రికార్డు స్థయిలో కోవిడ్ తెకాలు వేశారు. అయితే అదేదో ఒక్క ఏపీలోనే జరిగినట్లు, అందుకు జగన్ రెడ్డి ‘విజన్’ కారణమని చిరంజీవి, మళ్ళీ వైసీపీ నేతలను మించి జగన్ రెడ్డిని అభినందించారు.  అంతే కాదు, అదే సమయంలో చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారని,  వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్ళే పనిలో ఉన్నారని వచ్చిన వార్తలను ఆయన గానీ,ఆ ఆయన తరపున ఇంకొకరు గానీ, ఖండించలేదు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చిరంజీవివేలు పెట్టారు. ఇటు మూడు రాజదానుల ధుల విషయంలో అయితే నేమీ, స్టీల్ ప్లాంట్ వ్యవహాంలో అయితే నేమీ, చిరంజీవి, వైసీపీ స్టాండ్’నే వినిపించారు. సో .. జగన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని అంటే కాదనేందుకు కారణం కనిపించదు.

అదేగాక, చిరంజీవి రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఆయనకు రాజకీయ నిబద్దత ఉందని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో తెలుగు దేశం పార్టీని ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించెందుకే ఆయన వైఎస్సార్ ‘చే’యూతతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయినా ప్రజలు, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సినిమా అభిమానులు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. నిజానికి, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవచ్చును, కానీ, గణనీయ విజయాన్నే సాధించింది. 

ఓ వంక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరో వంక రాష్ట్రంలో వేళ్ళూనిన టీడీపీ, తెరాస, వామ పక్షాలలో కూడిన మహా కూటమి పోటీని ఎదుర్కుని, అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయినా, చిరంజీవి లక్షల మంది ఆశలను వమ్ము చేస్తూ,కేవలం కేంద్రంలో సహాయ  మంత్రి పదవికోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేశారు. కాంగ్రెస్ ఓపోయిన తర్వతా సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గంగలో వదిలేసి,టాలీవుడ్ తెరకు చేరుకున్నారు. సో .. ఇప్పుడు మళ్ళీ, సంక్షోభంలో ఉన్న సినిమా రంగాన్ని అదే గంగలో ముంచేసి మళ్ళీ రాజకీయ పునరావాసం వెతుక్కుంటున్నారు, అనే అభియోగంలో నిజం లేదని అనలేమని విశ్లేషకులు అంటున్నారు.  

అయితే, చిరంజీవి బలహీనతను జగన్ రెడ్డి ఉపయోగించుకుని, వ్యూహత్మకంగానే ఆయన్ని చర్చలకు పిలిచి చిక్కుల్లోకి నెట్టి, అభాసుపలు చేశారని ...అయితే, జగన్ రెడ్డి అన్నంతో పాటుగా వడ్డించిన మరకలు చిరంజీవిని వెంటాడుతూనే ఉంటాయని అంటున్నారు. అయితే అందుకు ఎవరూ చింతించ వలసిన అవసరం లేదు .. నో .. రిగ్రీట్స్ అనికూడా పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
జనసేన పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ సెక్యులర్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.
రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు.
చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు.
ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ బరితెగించేసింది. తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూ ఎంతో కొంత తెగిస్తాడు. అయితే పరిమితులు, హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం.
తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు.
ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 16)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
కొన్నికొన్ని సందర్భాలను చూస్తే దేశంలో ఇంకా న్యాయం బతికే వుందన్న నమ్మకం కలుగుతూ వుంటుంది. లిక్కర్ కేసులో పూర్తిగా
తాను చాలా మంచోణ్ణని ప్రూవ్ చేసుకోవడానికి మాజీ రాజకుమారుడు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోగా
కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల అజెండాగా మారిపోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు.
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ సిఎంను పంజాబ్ సిఎం  ఇవ్వాళ పరామర్శించారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సోమ‌వారం పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌సింగ్‌ మాన్ క‌లిశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.