Publish Date:Aug 12, 2022
బస్సుల్లో, ఆటోల్లో చాలాసార్లు మనం చాలాసార్లు రూపాయి, రెండురూపాయలు వదిలేస్తూ ఉంటాం. చిల్లర లేదని డ్రైవర్లు నొక్కేస్తుంటారు. కానీ తుంగనాధ్ చతుర్వేదీ ఇరవై రూపాయల కోసం ఏకంగా రైల్వే వారిని కన్స్యూమర్ కోర్టుకు ఈడ్చాడు. ఇరవయ్యేళ్లు కేసు నడిచిన తర్వాత ఆయనకు రూ.15000 చెల్లించమని కోర్టు ఆదేశించింది. దేశంలో కన్స్యూమర్ చట్టం అంటూ ఒకటి ఉందని చాలామంది ఇప్ప టికైనా తెలుసు కుంటే మంచిది.
చతుర్వేది అనే లాయరు 1999లో మధురనుంచి మొరాదాబాద్కు రైల్లో వెళ్లారు. టిక్కెట్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అప్పట్లో మధుర నుంచి మొరాదాబాద్కు టిక్కెట్ 35 రూపాయలు. కానీ బుకింగ్ కౌంటర్ లో ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆయన వందరూపాయలు ఇస్తే 70 రూపాయలు తీసుకోవా ల్సింది 90 రూపాయలు తీసుకుని పది రూపాయలు ఇచ్చారు. చతుర్వేది రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే భయ్యా, జర లైట్ తీసుకో అన్నారట. ఆయనకి కోపం వచ్చింది. అంతే వెంటనే ఈశాన్య రైల్వే బుకిం గ్ క్లర్క్ మీద కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. వందకు మించి కోర్టు వాదనలు జరిగాయి. అన్ని రోజు లు అన్నిసార్లూ చతుర్వేది కోర్టుకు వెళ్లారు. ఆయన నిజానికి అంత ఆరోగ్యవంతుడు కాదు. అయినా రైల్వే క్లర్కుకు, రైల్వే వారికి బుద్ధిచెప్పాలన్న పట్టుదలతోనే చాలా సహనం ప్రదర్శించారు.
ఈ కేసు 22 ఏళ్లు నడిచింది. చివరికి సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన ఒక కేసు తీర్పు ఆధారంగా ఇలాంటి కేసులు కన్స్యూమర్ కోర్టు తీర్పు ఇవ్వచ్చని తేలింది. అంతే రైల్వేవారికి గుండెల్లో రాయి పడింది. అసలు అప్పుడే ఆ ఇరవై రూపాయలు ఇచ్చుంటే సరిపోయేది. ఏదో ముసలాయన కదా ఏం చేస్తాడులే అని క్లర్కు లు దబాయించారు. కానీ కన్స్యూమర్ కోర్టు తీర్పు తాటతీసింది. చతుర్వేదీకి వడ్డీతో సహా 15000 నెల రోజుల లోపు చెల్లించాలని ఆదేశించింది. మొనగాడంటే ఈడ్రా బుజ్జీ అన్నారు మధుర వారంతా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mathura-man-won-case-against-rlys-39-141812.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.