ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అమెరికాలో పోలీసులు అడ్డుకున్నారు. డల్లాస్ లో ఎయిర్ పోర్టు నుంచి ఆయన బటయకువస్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల పాటు అమెరికాలో చదవి, రెండేళ్లు వాషింగ్టన్ డీసీ లో ప్రపంచ బ్యాంకులో కొలువు చేసిన లోకేష్ కు అప్పట్లో ఎప్పుడూ ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విమానాశ్రయంలో లోకేష్ ను అడ్డుకున్నారు.
సాధారణంగా దేశాధినేతలు, ప్రపంచ కప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచి వచ్చే క్రీడాకారులకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అటువంటి సమయాలలో పోలీసులు ఆయా సెలబ్రిటీలను విమానాశ్రయం నుంచి వేరే మార్గం గుండా బయటకు తీసుకు వెడతారు. అశేష అభిమాన జనం రావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వారిని భద్రంగా పంపేందుకు ఇలా చేస్తారు.
ఇప్పుడు లోకేష్ ను అమెరికాలో పోలీసులు అలాగే అడ్డుకుని ఆయన వేరే మార్గం గుండా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకు వెళ్లారు. ఇది అమెరికాలో కూడా లోకేష్ కు అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో తెలియజేస్తున్నది. పోలీసులు తనను అడ్డుకుని వేరే మార్గం ద్వారా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువచ్చిన విషయాన్ని తెలుగు డయాస్పోర సమావేశంలో లోకేష్ స్వయంగా చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని, ఈ అభిమానం అపూర్వమనీ, మరువలేననీ లోకేష్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-stopped-by-police-in-america-36-210655.html
వచ్చింది. ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్ను వెంటనే ఖాళీ చేయాలని, పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.
భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది.
మంగళవారం దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.
విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు.
శంషాబాద్ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్ లో జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఐబొమ్మ రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు.
వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు.