కవిత రూటేంటి? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ సంకేతమేంటి?

Publish Date:Jun 14, 2025

Advertisement

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ జాగృతినే నమ్ముకుని రాజకీయంగా ఎదగడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకూ బీఆర్ఎస్ కు తాను దూరం అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ నేతనే అని చెప్పుకునేందుకు నానా యాతనా పడుతున్నారు.

నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించనని విస్పష్టంగా ప్రకటించిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె7సిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అయిపోతున్నారు. కేసీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆమె ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కవిత.. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.  కేటీఆర్ కు ఏపీసబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తే.. కేటీఆర్ కు మద్దతుగా కవిత ఈ పోస్టు పెట్టారు. గతంలో కూడా కవిత కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించినా.. ఈ సారి ఖండన మాత్రం భిన్నంగా ఉంది. గతంలో కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత.. దాదాపుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన సమయంలో కానీ, తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభ సమయంలో  కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇటీవల మీడియాతో చిట్ చాట్ అంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు పార్టీని నడపడం చాతకావడం లేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు.   కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు.

ఇంత మాట్లాడిన ఆమె తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే తాజాగా అంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కేసీఆర్ ఆమెతో కనీసం మట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో తత్వం బోధపడిన కవిత.. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడానికే ఇప్పుడు రూటు మార్చి అన్న కేటీఆర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదనీ చాటేందుకే  కేటీఆర్ ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించారని అంటున్నారు. 

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.