జయ ఇక లేరు. కానీ...

Publish Date:Dec 5, 2016

Advertisement

నిండైన విగ్రహం. ఆకుపచ్చని ఆహార్యం! ఆమె అడుగుపెట్టగానే పాదాభివందనం చేసే మంత్రులు. అమ్మ అంటూ గుండె గుడిలో ఆమెను ఆరాధించే జనం. ఈ రెండు వాక్యాలూ చాలు... అవి ఎవరో తెలిసిపోవడానికి. తమిళనాట ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరొందిన ఆ ధీశాలి ఇక లేరని తెలిశాక తమిళనాడు ఒక్క క్షణం స్తంభించిపోయింది. జీవితానికి తనదైన అరుదైన నిర్వచనం ఇచ్చిన ఆ మూర్తి మృత్యువుతో ఒక శకం ముగిసిపోయింది.

 

ఈ రోజున జయలలిత కోసం కోట్ల మంది కన్నీరు విడుస్తుండవచ్చు, రాచమర్యాదలకు తీసిపోని ప్రభుత్వ లాంఛనాలు ఆమె చుట్టూ ఉండవచ్చు. కానీ ఇంతదూరం వచ్చేందుకు ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. జయలలిత పేరుకి మాత్రమే ఒక ఉన్నత కుటుంబంలోనే పుట్టారు. కానీ ఆమె తండ్రి జయరాం వ్యసనాలకు లోనుకావడంతో, కొండంత ఆస్తి కాస్తా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. జయలలితకు రెండేళ్ల వయసు ఉండగానే, జయరాం చనిపోవడంతో ఉన్న ఆ అరకొర ఆసరా కూడా ఆ కుటుంబానికి దూరమైంది.

 

భర్త దూరం కావడంతో జయలలిత తల్లి వేదవల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తన ఇద్దరు పిల్లలను సంరక్షించుకునేందుకు ఆమె బెంగళూరులో చిన్నాచితకా పనులు చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో మద్రాసులో పనిచేస్తున్న అంబుజవల్లి దగ్గరకి చేరుకోవడంతో జయలలిత కుటుంబానికి ఒక స్థిరత్వం వచ్చినట్లయ్యింది. అంబుజవల్లి ద్వారానే వేదవల్లి తన పేరుని సంధ్యగా మార్చుకుని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు ధరించడం మొదలుపెట్టింది.

 

తల్లి సినిమాలలో నటిస్తున్నప్పటికీ జయలలితకు ఆ రంగం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. శివాజీ గణేశన్ అంతటివాడు ఆమె అందాన్నీ, నాట్యాన్నీ చూసి ‘గొప్ప నటి అవుతుందని’ ప్రశంసించినా.... ఒక న్యాయవాదిగా స్థిరపడాలన్నదే జయలలిత లక్ష్యంగా ఉండేది. కానీ విధితీరు మరోలా సాగింది. జయలలితకు 15 ఏళ్లు ఉండగా ఆమెను బి.ఆర్.పంతులు ఆనే కన్నడ దర్శకుడు గమనించాడు. ఎలాగూ కాలేజిలో చేరేందుకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి, ఆ విరామసమయంలో తన రాబోయే చిత్రంలో నటించమని అడిగాడు. అలా జయలలిత ‘చిన్నడ గొంబె’ అనే కన్నడచిత్రంలో నటించింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు.

 

జయ జీవితంలోని తరువాత భాగమంతా ఇక చరిత్రే! ఎం.జి.ఆర్ స్ఫూర్తితో అన్నాడీఎంకేలోకి ప్రవేశించిన జయ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆంగ్లంలో ఆమె వాగ్ధాటిని గమనించిన ఎం.జి.ఆర్ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే 1987లో ఎం.జి.ఆర్ మరణించడంతో ఆయన వారసురాలిగా నిరూపించుకునేందుకు జయ తనదైన రాజకీయాలు మొదలుపెట్టారు. తమిళనాట రాజకీయాలు ఏమంత సులువు కావు! అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు, నేతలలో వ్యూహప్రతివ్యూహాలు తారస్థాయిలో సాగుతుంటాయి. జాతీయ పార్టీలతో పాటుగా స్థానిక పార్టీల జోరూ అప్రతిహతంగానే ఉంటుంది.

 

1989లో జయలలిత ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టిన సంవత్సరంలో అక్కడి రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసొచ్చింది. ఆ ఏడాది ఆమెను నిండు శాసనసభలో ఆమె చీరను చింపి అవమానించారు. ఒక ఆడది, అందులోనూ ఎం.జి.ఆర్తో సహజీవనం చేసి ఆయన వారసురాలిగా అడుగుపెట్టిన మనిషి... తమను ఏం చేయలేదన్న ధీమాతో కరుణానిధి ఆ పర్వాన్ని చిరునవ్వుతో పరికించారని అంటారు. కానీ రెండేళ్లు తిరిగేసరికి అదే శాసనసభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడంతో ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ... దానికి ఎదుర్కోవడం అంత సులభం కాదనీ తెలిసొచ్చింది.

 

ముఖ్యమంత్రిగానూ జయలలితకు ఒక శైలి ఉంది. పేదలకి మేలు చేసేందుకో, ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేందుకో... కారణం ఏదైనాగానీ విరివిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేవారు. పసిపిల్లలు, పేదవారు, స్త్రీల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలు బడుగువర్గాలలో ఆమెకు మంచి ఆదరణని కలిగించాయి. ఇప్పటికీ చెన్నైలోని మురికివాడల పక్క నుంచి వెళ్లేవారికి అక్కడి గుడిసెలలో ఆమె ఫొటోలు కనిపిస్తాయి. ఇదే సమయంలో కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల ఆమె కఠినమైన అధినేత్రిగా కూడా పేరొందారు. 2003లో ప్రభుత్వోద్యోగులు మెరుపుసమ్మెకు దిగినప్పుడు, 1.7 లక్షలమంది ఉద్యోగులను డిస్మిస్ చేసిపారేసిన జయ చర్యకు జనం ముక్కున వేలేసుకున్నారు.

 

తన చిరకాల ప్రత్యర్థి కరుణానిధిని అరెస్టు చేయించడం, కంచి పీఠీధిపతి జయేంద్ర సరస్వతిని కటకటాల వెనక్కి నెట్టడం వంటి చర్యలతో ఆమె దూకుడుకి అడ్డులేదని తేలిపోయింది. కానీ జయ నివాసంలో లెక్కకు మిక్కిలిగా ఆస్తులు బయటపడటం, టాన్సీ భూముల కుంభకోణం, ప్లజంట్ స్టే హోటల్ కేసు, కలర్ టీవీల కుంభకోణం.. ఇలా నానారకాల కుంభకోణాలలో జయ పీకల్లోతు మునిగిపోయారు. ఈ కేసుల కారణంగానే పదవి నుంచి దిగాల్సి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. వీటికి తోడు విలాసవంతమైన ఆమె జీవితం, పార్టీలో నియంతృత్వ పోకడలు కూడా జయ వ్యక్తిత్వంలో భాగమైపోయాయి.

 

మంచిచెడులు ఎలా ఉన్నా ప్రస్తుతం తమిళనాట జయలలితే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అనడంలో అనుమానం లేదు. అందుకే 32 ఏళ్ల తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని తమిళతంబిలు ఆమెకు కల్పించారు. మరో పక్క ఆమె మీద ఉన్న కేసులు ఒకొక్కటిగా విడిపోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన జయ- అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, అమ్మ మందులు అంటూ తనదైన శైలిలో సంక్షేమానికి దారితీశారు. ఈలోపులే ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇదేదో తాత్కాలికమైన ఆరోగ్య సమస్యే అని సరిపెట్టుకున్ని తమిళ ప్రజలు, నెలలు గడిచినా కూడా జయ ఆసుపత్రికే పరిమితం కావడం చూసి విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాగొలా తిరిగి జయ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ యజ్ఞయాగాలు నిర్వహించారు.

 

ప్రజల ఆకాంక్షలు ఫలించాయా అన్నట్లుగా నవంబరునాటికి జయ కోలుకుంటున్న వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆమె చిరునవ్వుని తిరిగి చూస్తామని ఆశించిన తమిళ ప్రజలకి శరాఘాతంగా ఆమెకి గుండెపోటు వచ్చిందన్న వార్త వినిపించింది. ఒక పక్క జయ ప్రత్యర్థి కరుణానిధి వయసు మీరిపోవడంతో... జయ తప్ప అన్యమెరుగని తమిళప్రజలకు ఆమె ఇక లేదన్న వార్త నిజంగా పిడుగుపాటే! కేవలం తమిళ ప్రజలకే కాదు యావద్భారతానికీ కూడా జయ లేని లోటు ఒక వేటుగానే మిగిలిపోనుంది. రాజకీయాలలో ఆరితేరిన నాయకురాలిగా, విపత్కరమైన పరిస్థితులలో తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వినిపించే ధీశాలిగా, జాతీయ కూటములలో భాగంగా తన పంతాన్ని నెగ్గించుకునే  సహచరిగా... జయ లేని దేశరాజకీయాలను సైతం ఊహించడం కష్టం.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.