Publish Date:Jul 26, 2024
జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్మీట్లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు, అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి.
వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-waste-press-meet-39-181581.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.