మూడేళ్ళ జగన్ పాలన ఎలా ఉందంటే ..

Publish Date:May 27, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం  మరో మూడు రోజుల్లో మూడేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు. వరస పెట్టి  హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు మూడేళ్ళు అయినా, పరిస్థితిలో మార్పులేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడలేదు సరికదా, మరింతగా దిగజారి పోయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. సంవత్సరానికి 365 రోజులు అయితే, అందులో 300 రోజులు ఓడీ మీదనే ప్రభుత్వం బతికేస్తోంది. ఇక అప్పులు కూడా పుట్టని దివాలా దశకు చేరుకుంది.  

అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో మట్టి కొట్టుకుపోయింది ఒక్క ఆర్థిక రంగమేనా, ఒక్క ఆర్థిక వ్యవస్థ మాత్రమేనా, మిగిలిన వ్యవస్థలన్నీ బాగున్నాయా? అంటే లేదు, ఏ రంగానికి ఆ రంగం, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ దినదిన ప్రవర్తమానంగా దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకుంది. శాంతి భద్రతల పరిస్థితి కలల్ముందే కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కీలకం. కానీ, జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే, అరాచక పాలనకు అక్కడి నుండే, శ్రీకారం చుట్టారు. వస్తువస్తూనే, ప్రజా వేదికను కూల్చి వేశారు. రాజకీయ కక్ష సాధింపుకు అంకు రార్పణ చేశారు.ఆ విధ్వంసకాండ  ఈరోజుకు కూడా ఆలా కొనసాగుతూనే వుంది. 
తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి పునాదిగా నిల్చే విధంగా, అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుడితే, జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే రాష్ట ప్రజల సంపద అమరావతిని నిర్వీర్యం చేశారు. అధికార వికేంద్రీకరణ ముసుగులో. మూడు రాజధానుల పేరుతొ, సర్కార్ రియల్ దందా తెరమీదకు తెచ్చారు.

ఆ ప్రహసనం ఇంకా ఈరోజుకు అలా సాగుతూనే వుంది. అందుకే, రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా, రాజధాని లేని అనాధగానే, రాష్ట్రం మిగిలి పోయింది. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధి చుక్క పెట్టేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అభివృద్ధికి హాలిడే ప్రకటించారు. పోలవరం సహా తెలుగు దేశం ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకుకు పునాదులుగా నిలిచే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యంచేశారు. పెట్టుబడులు అడ్డుకట్ట వేశారు. రాకుండా చేశారు. అందుకే, దావో స్ వెళ్ళినా, ఫలితం లేకుండా పోయింది. సింగడు అద్దింకి పోనూ పోయాడు, రాను వచ్చాడు అన్నట్లుగానే దావోస్ యాత్ర ముగుస్తుందని, అధికార వర్గాల సమాచారం.  

మరోవంక,ఈ రోజు పచ్చని కోనసీమలో వైసేపీ ప్రభుత్వం పెట్టిన రాజకీయ, కుల చిచ్చు దావానంలా వ్యాపిస్తోంది. సర్కార్ రగిల్చిన మంటలు కోనసీమ సరిహద్దులు విస్తరిస్తున్నాయి. అయినా, అక్కడ ఒక్కచోట మాత్రమే కాదు, రాష్ట్రం అంతటా  ఒకే విధమైన అరాచక పాలన రాజ్యమేలుతోంది. ఒక అదికార పార్టీ ఎమ్మెల్సీ తమ కారు డ్రైవర్’ హత్య చేసి శవాన్ని స్వయంగా ఇంటికి చేరుస్తారు, ఒక మంత్రి ఇంటిని, సొంతింటి (వైసీపీ) దుండగులు తగులపెట్టి సర్కార్’కే సవాలు విసురుతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి ఎంత అద్వాన్న స్థితిలో వుందో చెప్పేందుకు వేరే ఉదాహరణలు అవసరం లేదు. 
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే,వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే నవరత్నాలు కూడా నవ్వుల పాలవుతున్నాయి.

నిజానికి, ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ్వం, ఓటు బ్యాంకు సృష్టించుకునే దురాలోచనతో  సంక్షేమ పథకాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే, ఎక్కువ ప్రధాన్యాతే ఇచ్చింది. అభివృద్ధిని అటకెక్కించి, అప్పులు చేసి మరీ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. అయినా, చివరకు అప్పులే మిగిలాయి కానీ, ప్రజలకు ఇచ్చిన  హామీలు అరకొరగానే అమలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వివిధ  సంక్షేమ పథకాల కింద కుటుంబానికి, ఏడాదికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ప్రయోజనం చేకూరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. కాగా, తాజాగా గడచిన మూడేళ్ల కాలంలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్ర జనాబా ఐదు కోట్లని అనుకుంటే, ఒక్కొకరికి వచ్చేది రూ.7000,  నలుగురు ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.28 వేల నగదు ప్రభుత్వం ద్వారా అందిందని ప్రభుత్వం చెబుతోంది.

అంటే జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇచ్చిన హామీకి వాస్తవంలో ఇచ్చిన మొత్తానికి ఎక్కడా పొంతన లేదు. వాగ్దానం చేసింది, సంవత్సరానికి మూడు  నుంచి నాలుగు లక్షల రూపాయలు, అయితే విదిలిచింది మాత్రం ఏడాదికి రూ.27 వేలు. అంటే మూడేళ్ళకు కలిపినా లక్ష లోపలే ఉంది. మరో వంక తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అమలైన, అన్న క్యాంటీనలు మొదలు విదేశీ విద్యాపథకం వరకూ అనేక పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.

ఇంకొన్ని పథకాలకు అర్హతలను సవరించి, భారాన్ని తగ్గించుకుంది. అందుకే, జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనను నిజాయతీగా విశ్లేషిస్తే... ఎవరికైనా నిరాశే మిగులుతుందని, ఎవరో కాదు, వైసేపీ అభిమానులే ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. మరోవంక ఈ పాలనా ఇలాగే, కొనసాగితే, ఆంధ్ర ప్రదేశ్ అర్తికంగానే కాదు అన్ని విధాల ఆకహ్రి స్థానానికి చేరుకుంటుందని , ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.