తెలంగాణలో మళ్లీ లాక్డౌన్?.. కేబినెట్ భేటీలో నిర్ణయం?
Publish Date:Jan 16, 2022
Advertisement
ఒమిక్రాన్ ఎరియంట్’గా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపద్యంలో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. ఓ వంక కేంద్ర ప్రభుత్వం, స్థానిక పరిస్థితుల అదారంగా అవసరమైన మేరకు ఆంక్షలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.అదే సమయంలో ఆర్థిక, ఉపాథి కార్యక్రమాలు దెబ్బ తినకుండా, సామాన్యుల జీవనోపాధికి సమస్యలు లేకుండా చర్యలు ఉండాలని సూచించింది. ఈ నేపధ్యంలో, కరోనా కట్టడిలో తొలి చర్యగా తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సలహా మేరకు అన్ని విద్యాలయాలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు. అలాగే, పండగ అనంతర పరిస్థితిని కూలంకషంగా చర్చించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు మరోవంక పండగ సందర్భంగా రాజదాని హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లారు. రేపటి నుంచి తెరిగి రావడం మొదలవుతుంది. కరోనా పై ఈ రాకపోకల ప్రభావం ఉంటుందని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ గడచిన మూడు నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తారా? లేక కర్ణాటక తరహాలో వీకెండ్ లాక్డైన్ అము చేస్తారా? అదీ కాక, కఠిన ఆంక్షలతో సరిపెడతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసలు ఉంటాయా? లేదా? అన్నదానిపై రేపటి కేబినెట్ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే,తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కొత్త కేసులు పెరుగతున్న దృష్ట్యా .. మరో పక్షం రోజుల పాటు ... ఆంక్షలు విధిస్తారని అటున్నారు.
ముఖ్యమంత్రి సోమవారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/is-another-lockdown-in-telangana-39-130247.html