అలారంతో నిద్రలేచే అలవాటుందా? అయితే వెంటనే మానేయడం మంచిది!

Publish Date:Oct 20, 2023

Advertisement

ఉదయాన్నే లేచి ఇంటిపనులు చేసుకోవడం కోసం కొందరు మహిళలు, ఉదయాన్నే లేచి జిమ్ కో,  వాకింగ్ కో వెళ్లాలని కొందరు, చదువుకోవాలని కొందరు ఇలా ఎంతోమంది ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేవడానికి అలారం సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇలా అలారం సహాయంతో నిద్రలేస్తామని, పనులన్నీ చక్కగా చేసుకుంటామని, చక్కగా చదువుకుంటామని గొప్పగా చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా అలారం సహాయంతో నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే చేదు వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అసలు అలారం సహాయంతో నిద్రలేవడం ఎందుకు మంచిది కాదు? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?  ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే ఇకమీదట ఎప్పుడూ అలారం పెట్టుకుని నిద్రలేవడానికి ప్రయత్నించరు.

ఒకప్పుడు పిల్లలు పరీక్ష సమయాల్లో ఉదయమే లేచి చదువుకోవాలంటే అలారం ఉపయోగించేవారు. ఆ తరువాత మొబైల్ లోనే అలారం అందుబాటులోకి వచ్చాక నిద్రపోయే ముందు పక్కనే పెట్టుకుని పడుకునే మొబైల్ అలారం సహాయంతో నిద్రలేస్తుంటారు. కానీ చాలామంది అలారం మోత  మోగగానే మొదట్లోనే లేవరు. అది ఒకటికి పదిసార్లు మోగితే కానీ నిద్రలేవరు.  అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఉపయోగింటే అలారం సౌండ్ ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే పెద్ద శబ్దాలతో మేల్కొనడం అంటే అది రక్తపోటు, గుండె సమస్యలకు కోరి దారి ఇస్తున్నట్టేనట.  రాత్రంతా నిశ్చల స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం శబ్దం కారణంగా మేల్కోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరగదు. శరీరం సాధారణంగా మేల్కొన్నప్పుడు శరీరంలో రక్తం చురుగ్గా ప్రసారమవుతుంది. నిద్రమత్తులో, గాఢంగా ఉన్నప్పుడు  అలారం శబ్ధం ద్వారా మేల్కోవడం అంటే జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. అలారం ద్వారా మేల్కోవడం అడ్రినలిన్ పై ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అలారం ద్వారా నిద్ర నుండి మేల్కొనే అలవాటు ఉన్నవారు దీన్ని మానేయడం ఉత్తమం.

అలారం అలవాటు ఎలా మానాలంటే..

అలారం ద్వారా లేవడం రోజులో భాగమైపోయినవారు దీన్ని మానుకుని సాధారణంగా నిద్రలేవడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మానడం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలు నివారించవచ్చు.

అలారం వరుసపెట్టి అరుస్తున్నా నిద్రమత్తుతో లేవకుండా బద్దకంగా అలాగే పడుకునే అలవాటు మానుకోవాలి. ఒకటి లేదా రెండు సార్లు అలారం మోగగానే దాన్ని కట్టేయాలి. ఇది క్రమంగా సాధారణంగా లేచే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బిగ్గరగా భయపెట్టేలానూ, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలారం ను ఉపయోగించడం మానుకోవాలి. సన్న శబ్దంతో పేస్ ఫుల్ గా ఉండే అలారం వాడితే ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇంట్లో సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడేలాగా నిద్రపోయే ప్రాంతాన్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ అలారం అక్కర్లేకుండా నిద్రలేవవచ్చు.

ప్రతిరోజూ ఒకేసమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుంటే ఉదయం సమయంలో అలారం అక్కర్లేకుండానే దానికదే మెలకువ వస్తుంది.

ప్రతి రోజూ 7నుండి 8గంటలపాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నప్పుడు మేల్కోవడం కూడా సులువుగానే జరుగుతుంది. అదే నిద్ర తక్కువైతే మేల్కోవడం కష్టం.

                              *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.