వైఎస్ విగ్ర‌హం మాయం.. టీడీపీ నేత గుండెలపై తన్నిన పోలీసులు.. హైటెన్ష‌న్‌..

Publish Date:Jan 15, 2022

Advertisement

ఖాకీలు రెచ్చిపోయారు. టీడీపీ వారిపై విరుచుకుప‌డ్డారు. పై నుంచి ఆర్డ‌ర్స్ వ‌చ్చాయో ఏమో.. ఓ రేంజ్‌లో కుమ్మేశారు. ప్రజాస్వామ్య‌యుతంగా ఆందోళ‌న చేయ‌డ‌మే టీడీపీ శ్రేణులు చేసిన త‌ప్పు. అంతే. పోలీసులు ప‌సుపుద‌ళంపై దండ‌యాత్ర చేశారు. మీద‌ప‌డి దాడి చేశారు. పోలీసుల ఓవ‌రాక్ష‌న్ ఇప్పుడు ఓ టీడీపీ నేత ప్రాణాల మీద‌కు వ‌చ్చింది. 

ఖాకీ చొక్కా వేసుకున్నామ‌నో.. లేక, వైసీపీపై వీరాభిమాన‌మో.. కార‌ణం ఏదైనా పోలీసులు టీడీపీ వారిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. న‌ర‌స‌రావుపేట టీడీపీ ఇంఛార్జ్ చద‌ల‌వాడ అర‌వింద్‌బాబు గుండెల‌పై పోలీసులు బూటుకాలుతో త‌న్నారు. ఆ దెబ్బ‌కి ఆయ‌న సృహతప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

ఇంత జ‌రిగినా వైసీపీ శ్రేణులు త‌మ అరాచ‌కాన్ని ఆప‌లేదు. అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ వాళ్లు దాడికి దిగారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వారిపై రెచ్చిపోయిన ఖాకీలు.. వైసీపీ వారు ఇంత‌టి విధ్వంసానికి దిగుతున్నా చూస్తూ ఉండిపోయారు. పట్టించుకోన‌ట్టు ప్రేక్ష‌క పాత్ర వ‌హించారని మండిప‌డుతున్నారు.  

ఈ సంద‌ర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి దిగారు. పోలీసుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న‌ర‌స‌రావుపేట జొన్న‌ల‌గ‌డ్డ‌లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. 

ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...

గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. 

వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అనిల్‌, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని టీడీపీ శ్రేణులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు.  

వైసీపీ నేతలే వైఎస్సార్‌ విగ్రహాన్ని మాయం చేసి టీడీపీ వారిపై అబాండాలు వేస్తున్నారంటూ చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆ దారిలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు బలవంతంగా టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య  తోపులాట జరిగింది. అరవిందబాబును బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తోపులాటలో అర‌వింద్‌బాబు గుండెల‌పై పోలీసులు బూటుకాలితో త‌న్నార‌ని అంటున్నారు. ఆ దెబ్బ‌కు చ‌ద‌ల‌వాడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ శ్రేణులు వెంటనే ఆయ‌న్ను ఆసుపత్రికి తరలించారు. న‌ర‌స‌రావుపేట‌, జొన్న‌ల‌గ‌డ్డ‌లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

By
en-us Political News

  
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు.
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి.
మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు.
ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.