వైఎస్ విగ్రహం మాయం.. టీడీపీ నేత గుండెలపై తన్నిన పోలీసులు.. హైటెన్షన్..
Publish Date:Jan 15, 2022
Advertisement
ఖాకీలు రెచ్చిపోయారు. టీడీపీ వారిపై విరుచుకుపడ్డారు. పై నుంచి ఆర్డర్స్ వచ్చాయో ఏమో.. ఓ రేంజ్లో కుమ్మేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడమే టీడీపీ శ్రేణులు చేసిన తప్పు. అంతే. పోలీసులు పసుపుదళంపై దండయాత్ర చేశారు. మీదపడి దాడి చేశారు. పోలీసుల ఓవరాక్షన్ ఇప్పుడు ఓ టీడీపీ నేత ప్రాణాల మీదకు వచ్చింది. ఖాకీ చొక్కా వేసుకున్నామనో.. లేక, వైసీపీపై వీరాభిమానమో.. కారణం ఏదైనా పోలీసులు టీడీపీ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరసరావుపేట టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్బాబు గుండెలపై పోలీసులు బూటుకాలుతో తన్నారు. ఆ దెబ్బకి ఆయన సృహతప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఇంత జరిగినా వైసీపీ శ్రేణులు తమ అరాచకాన్ని ఆపలేదు. అరవింద్బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్పై వైసీపీ వాళ్లు దాడికి దిగారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వారిపై రెచ్చిపోయిన ఖాకీలు.. వైసీపీ వారు ఇంతటి విధ్వంసానికి దిగుతున్నా చూస్తూ ఉండిపోయారు. పట్టించుకోనట్టు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి దిగారు. పోలీసుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట జొన్నలగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకీ అసలేం జరిగిందంటే... గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అనిల్, రాజేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని టీడీపీ శ్రేణులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలే వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి టీడీపీ వారిపై అబాండాలు వేస్తున్నారంటూ చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆ దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు బలవంతంగా టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అరవిందబాబును బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తోపులాటలో అరవింద్బాబు గుండెలపై పోలీసులు బూటుకాలితో తన్నారని అంటున్నారు. ఆ దెబ్బకు చదలవాడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ శ్రేణులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట, జొన్నలగడ్డలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
http://www.teluguone.com/news/content/high-tension-in-narasaraopeta-39-130229.html