జ‌గ‌న్‌కు 'గుప్తా' గుబులు.. వైసీపీ నేత‌ల బెదురు.. మ‌రో ర‌ఘురామ?

Publish Date:Jan 24, 2022

Advertisement

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎన్ని మప్పు తిప్పలు పెట్టాలో.. ఎలా రాజకీయంగా దెబ్బ కొట్టాలో అధికార వైయస్ జగన్ పార్టీకి తెలుసు.. అదే అధికార జగన్ పార్టీని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టాలో.. రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలో అదే పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు తెలుసు.. ఆయన ఢిల్లీలో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ పార్టీలోని కీలక నేతలకు ఓ రేంజ్‌లో తలంటుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకీ ఈ విషయం జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటు టీడీపీతో.. అటు రఘురామకృష్ణంరాజుతో రోజు వాతలు పెట్టించుకుంటుందన్నదీ పక్కా నిజం. కానీ జగన్ పార్టీని ఏకుతున్న వారి జాబితాలోకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సొమిశెట్టి సుబ్బారావు గుప్తా తాజాగా వచ్చి చేరారు. 

ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వ హయాంలోని చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కేడర్‌కు ఏర్పడే సమస్యలను సుబ్బారావు గుప్తా ఎత్తి చూపడం నాటి నుంచి..  సుబ్బారావు గుప్తాను మంత్రి బాలీనేని వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ చావా బాదడం వరకు ఉన్న వీడియోలను ప్రపంచమంతా వీక్షించింది. 

సుబ్బారావు గుప్తాకు జరిగిందీ అన్యాయమని.. అర్యవైశ్య సంఘాలే కాదు.. జగన్ పార్టీలోని కేడర్ అంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ సుబ్బారావు గుప్తాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే తనకు జరిగిన అన్యాయంతోపాటు... జగన్ పార్టీకీ జరుగుతున్న చెడును సైతం.. వరుస ప్రెస్ మీట్లు పెట్టీ మరి మీడియా సాక్షిగా ఎండగడుతున్నాడీ సుబ్బారావు గుప్తా. 

తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం.. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని బూతుల పంచాంగం... కొడాలి నాని తీరుతో పార్టీలో ఓట్లు పోయే పరిస్థితి నెలకొందని.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ తీసి.. హోం శాఖ ఇవ్వమంటూ స్వయంగా సీఎం జగన్‌కు సూచించడం.. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ సమీప బంధువు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద...  అండర్ గ్రౌండ్‌లో ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్చుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి గుప్తా ఈ మీడియా సాక్షిగా సూచించడం.. అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి.. విశ్వనటుడు కమలహాసన్‌లా చాలా చక్కగా యాక్షన్ చేస్తాడంటూ ఇదే ప్రెస్ మీట్‌ సాక్షిగా సుబ్బారావు గుప్తా చెప్పడం.. అక్కడితో ఆగకుండా..  వచ్చే 2024 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతున్నట్లు సుబ్బారావు గుప్తా మరీ బల్లగుద్దీ చెప్పడంతో.. జగన్ పార్టీలో రచ్చ మొదలైందీ. ప్రతి పక్ష టీడీపీతో మనకు తిట్లు దండకం సరే సరి.. ఇక ఢిల్లీలో రఘురాముడు సెలవు రోజుల మినహా ప్రతి రోజూ తిట్ల బాణాలు విసరించుకోవడం పరిపాటిగా మారింది. 

కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటూ.. అధికార పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు ఎవరినీ వదలకుండా ఓ రేంజ్‌లో దొబ్బేస్తున్న ఈ సుబ్బారావు గుప్తా తీరు మాత్రం తమకు మింగుడు పడడం లేదని.. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోని కీలక నేతలు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్ద మొర పెట్టుకున్నారని సమాచారం. ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడతానని సదరు నేతలకు సీఎం జగన్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా అధికార పార్టీలోకి కీలక నేతలకే తలపోటు, రక్త పోటు తెప్పిస్తున్న ఈ సుబ్బారావు గుప్తా మాత్రం మామూలోడు కాదోయి అనే టాక్ అయితే తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైరల్ కావడం విశేషం. ఏమైనా సుబ్బారావు గుప్తానా మజాకా.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.