జ‌గ‌న్‌కు 'గుప్తా' గుబులు.. వైసీపీ నేత‌ల బెదురు.. మ‌రో ర‌ఘురామ?

Publish Date:Jan 24, 2022

Advertisement

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎన్ని మప్పు తిప్పలు పెట్టాలో.. ఎలా రాజకీయంగా దెబ్బ కొట్టాలో అధికార వైయస్ జగన్ పార్టీకి తెలుసు.. అదే అధికార జగన్ పార్టీని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టాలో.. రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలో అదే పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు తెలుసు.. ఆయన ఢిల్లీలో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ పార్టీలోని కీలక నేతలకు ఓ రేంజ్‌లో తలంటుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకీ ఈ విషయం జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటు టీడీపీతో.. అటు రఘురామకృష్ణంరాజుతో రోజు వాతలు పెట్టించుకుంటుందన్నదీ పక్కా నిజం. కానీ జగన్ పార్టీని ఏకుతున్న వారి జాబితాలోకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సొమిశెట్టి సుబ్బారావు గుప్తా తాజాగా వచ్చి చేరారు. 

ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వ హయాంలోని చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కేడర్‌కు ఏర్పడే సమస్యలను సుబ్బారావు గుప్తా ఎత్తి చూపడం నాటి నుంచి..  సుబ్బారావు గుప్తాను మంత్రి బాలీనేని వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ చావా బాదడం వరకు ఉన్న వీడియోలను ప్రపంచమంతా వీక్షించింది. 

సుబ్బారావు గుప్తాకు జరిగిందీ అన్యాయమని.. అర్యవైశ్య సంఘాలే కాదు.. జగన్ పార్టీలోని కేడర్ అంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ సుబ్బారావు గుప్తాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే తనకు జరిగిన అన్యాయంతోపాటు... జగన్ పార్టీకీ జరుగుతున్న చెడును సైతం.. వరుస ప్రెస్ మీట్లు పెట్టీ మరి మీడియా సాక్షిగా ఎండగడుతున్నాడీ సుబ్బారావు గుప్తా. 

తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం.. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని బూతుల పంచాంగం... కొడాలి నాని తీరుతో పార్టీలో ఓట్లు పోయే పరిస్థితి నెలకొందని.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ తీసి.. హోం శాఖ ఇవ్వమంటూ స్వయంగా సీఎం జగన్‌కు సూచించడం.. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ సమీప బంధువు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద...  అండర్ గ్రౌండ్‌లో ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్చుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి గుప్తా ఈ మీడియా సాక్షిగా సూచించడం.. అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి.. విశ్వనటుడు కమలహాసన్‌లా చాలా చక్కగా యాక్షన్ చేస్తాడంటూ ఇదే ప్రెస్ మీట్‌ సాక్షిగా సుబ్బారావు గుప్తా చెప్పడం.. అక్కడితో ఆగకుండా..  వచ్చే 2024 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతున్నట్లు సుబ్బారావు గుప్తా మరీ బల్లగుద్దీ చెప్పడంతో.. జగన్ పార్టీలో రచ్చ మొదలైందీ. ప్రతి పక్ష టీడీపీతో మనకు తిట్లు దండకం సరే సరి.. ఇక ఢిల్లీలో రఘురాముడు సెలవు రోజుల మినహా ప్రతి రోజూ తిట్ల బాణాలు విసరించుకోవడం పరిపాటిగా మారింది. 

కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటూ.. అధికార పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు ఎవరినీ వదలకుండా ఓ రేంజ్‌లో దొబ్బేస్తున్న ఈ సుబ్బారావు గుప్తా తీరు మాత్రం తమకు మింగుడు పడడం లేదని.. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోని కీలక నేతలు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్ద మొర పెట్టుకున్నారని సమాచారం. ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడతానని సదరు నేతలకు సీఎం జగన్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా అధికార పార్టీలోకి కీలక నేతలకే తలపోటు, రక్త పోటు తెప్పిస్తున్న ఈ సుబ్బారావు గుప్తా మాత్రం మామూలోడు కాదోయి అనే టాక్ అయితే తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైరల్ కావడం విశేషం. ఏమైనా సుబ్బారావు గుప్తానా మజాకా.

By
en-us Political News

  
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు.
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.