ఈటల రాజేందర్ కు మరో షాక్! గులాబీ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా..

Publish Date:Jun 1, 2021

Advertisement

సీనియర్ నేత ఈటల రాజేందర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈటల. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీతో తాడోపేడో తేల్చుకుంటారనే ప్రచారం జరిగింది. కాని రాజీనామాపై వెనక్కి తగ్గారు ఈటల. బీసీ సంఘాలు, ఉద్యమ నేతలను కలవడంతో కొత్త పార్టీ పెడతారని భావించారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ తో కలిసి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఐక్య వేదికగా ఏర్పాటు చేస్తారని భావించారు. కాని అది కూడా జరగలేదు. చివరికి అనూహ్యంగా కమలం గూటికి చేరారు ఈటల రాజేందర్. ఢిల్లీకి వెళ్లి కమలం బీజేపీ పెద్దలను కలిశారు.

ఈటల రాజేందర్ కదలికలపై నిఘా పెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు కౌంటర్ వ్యూహాలు అమలు చేసింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని గులాబీ లీడర్లంతా పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నాలు చేసింది. మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది. మంత్రి హరీష్ రావును కూడా పురమాయించింది. బోయినపల్లి వినోద్ కుమార్ కుడా సీన్ లోకి వచ్చారు. కేసీఆర్ ఎత్తులతో తన సొంత నియోజకవర్గంలోనే ఈటలకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. మొదట ఈటలకు మద్దతుగా నిలిచిన నేతలు కూడా ఒక్కొక్కరు తిరిగి టీఆర్ఎస్ సైడ్ కు వచ్చేశారు. దీంతో తన అనుచరులను బెదిరిస్తున్నారంటూ రాజేందర్ ఆరోపణలు చేశారు. తాజాగా ఢిల్లీలో రాజేందర్ కదలికలపైనా గులాబీ ఫోకస్ చేశారని తెలుస్తోంది. రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చి ప్రకటన చేసేలోగా ఆయనకు మరో షాకిచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం. 

ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎర్త్ పట్టారని సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తైందంటున్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఈటలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. తనంతట తానుగా ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసేలోగానే అనర్హత వేటు పడేలా అధికార పార్టీ పావులు కదుపుతుందని తెలుస్తోంది. ఈటలకు మద్దతుగా ఉన్న నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని సమాచారం. 

ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అదే సంకేతమిచ్చారు. బీజేపీ నాయకులను ఈటల రాజేందర్ కలవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా? అని పల్లా వ్యాఖ్యానించారు. అందరూ ఈటలను ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేశారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

‘‘అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది. నిన్ను గౌరవించినట్లు సీఎం కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు. సొంత ప్రభుత్వ పథకాలను అవహేళన చేశావు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మకం లేదని క్షమించరాని నేరం చేశావు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటాం. సమయం చూసి అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈటల రాజేందర్.’’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. 

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.