సర్కారును నమ్మేదేలే.. చర్చలకు వచ్చేదేలే

Publish Date:Jan 28, 2022

Advertisement

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. అదొకటి అలా ఉంటే, అసలు ప్రభుత్వం చేతులు కాలిన తర్వాత అయినా ఆకులు పట్టుకుందా లేక ఇంకా ఏదైనా కొత్త ట్రిక్ ప్లే’ చేస్తోందా? అనే అనుమానాలు కూడా లేక పోలేదు. అవును, మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ‘పీఆర్సీ’ పంచాయతీ విషయంగా ఉద్యోగ సంఘాలతో ఆడుతున్న దాగుడు మూతల గురించే. 

అర్థరాత్రి జీఓలతో రాష్ట్ర ప్రభుత్వమే వివాదానికి శ్రీకారం చుట్టింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.నిజానికి, ఒక విధంగా చూస్తే, ప్రభుత్వం వ్యూహత్మకంగానే అడుగులు వేస్తోంది. ఉద్యోగులను, ఉద్యోగుల డిమాండ్లను సమర్ధిస్తున్న వారిని,ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను, పేదల పొట్టలు కొట్టే పాపులు చూపించి, రాజకీయ ప్రయోజనం పొందే కుట్రలు సాగిస్తూనే వుంది. అయితే, సర్కార్ ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాదు, ఉద్యోగులు  జీతాలు పెంచితే పధకాలు ఆగిపోతాయని  ప్రభుత్వం చేసిన ప్రచారం బూమ్రాంగ్ అయింది. ఉద్యోగ సంఘాలు మాకు కొత్త పీఆర్సీ వద్దు, కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ఇవ్వండని ఎదురు దాడికి దిగడంతో, ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిపోయింది.అందుకే ఇప్పుడు చర్చలకు రండని ఉద్యోగ సంఘాల నాయకులకు సర్కార్ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సందేశాలు పంపుతున్నారు. చర్చలకు ఏర్పాటు చేసిన కమిటీ అన్ని వేళలల అందుబాటులో ఉంటుందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. అంటే, ఉద్యోగ సంఘాల మద్య చిచ్చు విభేదాలు సృష్టించేందుకు సజ్జల విత్తు నాటారు. అలాగే, బెదిరింపు బాణాన్ని సంధించారు.సమ్మె చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సమస్య ఎప్పటికైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇలాంటి మొండివైఖరి సమంజసం కాదన్నారు. వాళ్లు శత్రువులు కాదని.. మా ఉద్యోగులేని అన్నారు. పీఆర్సీ ఉద్యోగులకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఓ మెట్టు దిగేందుకు సిద్ధమన్నారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులే కాకుండా ఏ సంఘం వారు వచ్చినా చర్చలు జరుపుతామన్నారు.

అయితే, ఓ వంక చర్చలకు పిలుస్తూనే,ప్రభుత్వంకొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీతాలు, పింఛన్ బిల్లుల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి సర్క్యులర్ జారీచేసింది.దీంతో, ప్రభుత్వం సలహాదారు చెప్పే మాటలు నమ్మేది లేదని, సమ్మెకు సిద్దమవుతున్నారు.కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తున్నాయి.. పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలంటున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ వ్యూహకర్త సలహాలు పాటిస్తున్నారో ఏమో కానీ, వ్యూహాత్మక ఉచ్చులోకి అడుగులు వేస్తున్నారని, అంటున్నారు. ఏమవుతుందో, వివాదంఎంతవరకు వెళుతుందో కానీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మద్యఅఘాదం ఏర్పడడం, అంట మంచిది కాదని, విజ్ఞులు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.