ఇంత మోసమా.. ఎందుకీ కుట్ర.. ఎవరికోసం ఈ నాటకం?

Publish Date:Jan 27, 2022

Advertisement

అనుకున్నట్లుగానే, అనుమానించిన విధంగానే, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వేడిని రాజేసింది. జిల్లాల పేర్ల విషయంగా తలెత్తిన వివాదం మొదలు, సరిహద్దుల వివాదాలు, నియోజక వర్గాల సర్దుబాటు, కూడికలు తీసివేతలు, దూర భారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీ కుట్రలు, కుతంత్రాలు ఇలా ఒకటని కాదు, అన్ని రకాల రాజకీయ రచ్చకు  కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం, రంగం సిద్దం చేసింది. వేదికగ మారింది. ఎక్కడి కక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, అనుకూలంగా విందులు చిందులు అన్నీ జరిగి పోతున్నాయి. 

ఈ నేపధ్యంలోనే, ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ శ్రమ అనుకోకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘దివ్యమంగళ’ ప్రణాళికను, ఆయనగారి ‘పవిత్ర’ ఆశయాన్ని చాలా చక్కగా  వివరించారు. అయితే, ఆయన వివరణను విన్నతర్వాత, ఉన్న అనుమానాలు నివృత్తికాక పోగా,  ఏ నిర్ణయం వెనక ఏ కుట్ర దాగుందో, అన్న సందేహాలు ఎక్కువయ్యాయి, నిజం, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా, విజయకుమార్ వివరణతో మహా కుట్ర మాటున దాగున్న కుట్రలు, కుతంత్రాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి అనటున్నారు విశ్లేషకులు, మరీ ముఖ్యమంగా స్థానిక లోగుట్లు తెలిసిన ప్రజలు, పాత్రికేయులు.  

అసలు ఇలాంటి సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు వంటి చిచ్చును రాజేయడమే, జగన్నాటక  సూత్రదారి మహా కుట్ర అనుకుంటే, ప్లానింగ్ సెక్రెటరీ ప్రవచన పలుకులు మరింత మంత్ర ముగ్ధులను చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇంతవరకు బయటకు వచ్చిన దానికంటే  దాగున్నదే ఎక్కువ ఉందని, అసలు గుట్టు మొత్తం బయట పడితేనే గానీ , ఈ మొత్తం వ్యవహారం అసలు రంగు బయట పడదు అంటున్నారు. 

ఇక వారు ఏమి చెప్పారో చూడండి ..అన్నీ ఇక్కడ చెప్పలేము కాబట్టి.. ఉదాహరణకు నలుగు పలుకులు పట్టి చూద్దాం ...
1.    సంతనూతలపాడు... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... బాపట్ల కి దూరం కాబట్టి ఒంగోలు తో కలిపాం...బాగుంది. చాలా బాగుంది. 
2.    పాణ్యం ... నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... నంద్యాల కి దూరం కాబట్టి కర్నూల్’లో కలిపాం...ఇది కూడా బాగుంది. 
3.    పుంగనూరు... రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే... రాయచోటి దూరం కాబట్టి...(రాయచోటి ప్రస్తుత ప్రతిపాదిత జిల్లా రాజం పేటకు బదులు) చిత్తూరు లో కలిపాం...శభాష్ చక్కగా వుంది. 
4.    సర్వేపల్లి... తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే ... తిరుపతి ( బాలాజీ) దూరం కాబట్టి నెల్లూరు జిల్లాలోనే ఉంచాం...ఇది ఇంకా .. ఇకా బాగుంది. 
కానీ, ఇన్ని జిల్లాల విషయంలో... ఇన్ని నియోజకవర్గాల విషయంలో అంత చొరవ చూపించి, దూర భారాలను అడుగులు అంగుళాలలో కొలిచి మరీ దూరం అవుతుంది అని దగ్గర చేసిన అధికారులకు "కందుకూరు" ప్రజలు ఎందుకు కనిపించలేదు...???వారికి ఒంగోలు ఎంత దూరం నెల్లూరు ఎంత దూరం...???వారి విషయంలో ఎందుకు ఇంత వివక్ష...???వారికి అవసరం లేదా సత్వర న్యాయం... పరిపాలనా సౌలభ్యం...???దీని వెనుక కుట్ర ఏంటి...??? నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు...??? ఇందుకు చారిత్రకంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి అలానే ఉంచాం... ఇది ప్లానింగ్ సెక్రెటరీ విజయకుమార్ గారి ముక్తాయింపు... కానీ, కందుకూరుకు నెల్లూరు దగ్గగా ఒంగోలు దగ్గరా.. 40 కిమీ దూరంలో ఉన్న ఒంగోలు దగ్గర, 120 కిమీ దూరంలో ఉన నెల్లూరు దగ్గరో.. అధికారులెచెప్పాలని కందుకూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
అదలా ఉంటే, ఈ ‘కుట్ర’, (అవును  కందుకూరు జనం ఇది కుట్రనే అంటున్నారు). అసంబద్ధ నిర్ణయానికి చీమకుర్తి గ్రానైట్ గనులు, ఒక కారణంగా అనుమనిస్తున్నారు, అలాగే, ఓడరేవులను ఇటూ చేసే కుట్ర ఉందా అన్నన్ అనుమానాలు కూడ వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోఇప్పటికే కృష్ణ పట్నం ఓడరేవు వుంది... ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం ఓడరేవుకు  ఇప్పటికే  శంఖు స్థాపన జరిగింది. ఇపుడు ఒకే జిల్లాలో రెండు ఓడ రేవులా??  అనే నెపంతో ఎంకేక్క్డికో ఎత్తుకుపోయే కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఇది ఒక్క కందుకూరు సమస్య మాత్రమే కాదు.. చాలా వరకు జిల్లాల్లో చిన్నా పెద్దసమస్యలు చాలనే ఉన్నాయి అంటున్నారు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.